చొప్పదండి, డిసెంబర్ 6: భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఆశయసాధన కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని చొప్పదండి ఎమ్మెల్యే సుంకెరవిశంకర్ పిలుపునిచ్చారు. బెంగళూర్లో సోమవారం అంబేద్కర్ 65వ వర్ధంతిని పురస్కరించుకొని మంత్రి గంగుల కమలాకర్, మహబూబ్నగర్ ఎమ్మెల్సీ నారాయణరెడ్డి, మాజీ మంత్రి ఎల్ రమణ, జీహెచ్ఎంసీ మాజీ మేయర్ రామ్మోహన్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఏనుగు రవీందర్రెడ్డితో కలిసి అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలువేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ గుర్రం నీరజ, కౌన్సిలర్లు, ఎంపీపీలు, జడ్పీటీసీలు తదితరులు పాల్గొన్నారు.
యువజనసంఘం ఆధ్వర్యంలో…
మండలకేంద్రంలో అంబేద్కర్ యువజన సంఘం అధ్యక్షుడు పెద్దెల్లి శ్రీనివాస్ ఆధ్వర్యంలో జడ్పీటీసీ మాచర్ల సౌజన్యావినయ్కుమార్ అంబేద్కర్ విగ్రహం, చిత్రపటానికి పూలమాలలువేసి నివాళులర్పించారు. మార్కెట్ కమిటీ చైర్మన్ చంద్రశేఖర్గౌడ్, వైస్ చైర్మన్ కొత్త గంగారెడ్డి, సీఐ నాగేశ్వర్రావు, తహసీల్దార్ రజిత, ఎంపీడీవో స్వరూప, మున్సిపల్ మేనేజర్ ప్రశాంత్, ఆర్ఐ సురేందర్, కోఆప్షన్ సభ్యులు పాషా, అజ్జూ, ఎమ్మార్పీఎస్ మండలాధ్యక్షుడు సదానందం, నాయకులు తాళ్లపల్లి శ్రీనివాస్గౌడ్, రత్నం, డేవిడ్, వెంకటరమణారెడ్డి పాల్గొన్నారు.
గంగాధరలో..
మండల అంబేద్కర్ సంఘం ఆధ్వర్యంలో మధురానగర్లో రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ విగ్రహానికి కొండగట్టు దేవస్థానం డైరెక్టర్ పుల్కం నర్సయ్య, తహసీల్దార్ శ్రీనివాస్, ఎంపీడీవో భాస్కర్రావు, ఎస్ఐ నరేశ్రెడ్డి పూలమాలవేసి నివాళులర్పించారు. సర్పంచులు వేముల లావణ్య, మడ్లపెల్లి గంగాధర్, మేచినేని నవీన్రావు, వేముల దామోదర్, మాల చంద్రయ్య, అంబేద్కర్ సంఘం అధ్యక్షుడు కొలెపాక స్వామి, సభ్యులు ద్యావ శ్రీనివాస్, దోమకొండ మల్లయ్య, లింగాల దుర్గయ్య, మ్యాక వినోద్, పాల్గొన్నారు. బూరుగుపల్లిలో స్థానిక యువకులు అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. నాయకులు గడ్డం నర్సయ్య, తడగొండ అజయ్, లంక హరిబాబు, మహేశ్, సతీశ్, విజయ్, దిలీప్ పాల్గొన్నారు.
బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి ..
బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి డాక్టర్ అంబేద్కర్ అని ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ పేర్కొన్నారు. బెంగళూర్లో మండల ఎంపీటీలతో కలిసి అంబేద్కర్ వర్ధంతి నిర్వహించారు. వైస్ ఎంపీపీ కంకణాల రాజ్గోపాల్రెడ్డి, ఎంపీటీసీలు అట్ల రాజిరెడ్డి, ద్యావ మధుసూదన్రెడ్డి, కోలపురం లక్ష్మణ్, తడిగొప్పుల రజిత, వంగల వసంత, ముద్దం జమున, ఎగుర్ల మల్లమ్మ, నాయకులు దూలం శంకర్గౌడ్, ముద్దం నగేశ్, తడిగొప్పుల రమేశ్, వంగల మల్లికార్జున్, ఎగుర్ల మల్లయ్య పాల్గొన్నారు.
అంబేద్కర్కు నివాళి
బెంగళూర్లోని ఎంపీటీసీల క్యాంపులో బస చేసిన రామడుగు మండల ఎంపీటీసీలతో కలిసి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ అంబేద్కర్ చిత్రపటానికి నివాళులర్పించారు. మండల కేంద్రంలోని అంబేద్కర్ చిత్రపటానికి ఎంపీడీవో ఎన్నార్ మల్హోత్రా నివాళులర్పించారు. సర్పంచులు, అంబేద్కర్ సంఘాల నాయకులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.