కార్పొరేషన్/ కొత్తపల్లి, ఫిబ్రవరి 15: తెలంగాణ సర్కారు అన్ని వర్గాల అభ్యున్నతికి ప్రాధాన్యమిస్తున్నదని రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖల మంత్రి గంగుల కమలాకర్ పేర్కొన్నారు. కరీంనగర్ శివారులోని రేకుర్తి శివాలయ ఆవరణలో ఏర్పాటు చేసిన బంజారాల ఆరాధ్య దైవం సేవాలాల్ మహారాజ్ విగ్రహాన్ని మంత్రి బుధవారం ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రేకుర్తిలో లంబాడీల కమ్యూనిటీ భవన నిర్మాణం కోసం రూ.10 లక్షలు మంజూరు చేస్తామని తెలిపారు. అన్ని కుల సంఘాలకు రాష్ట్ర రాజధానిలో భవనాలను నిర్మిస్తున్నామని పేర్కొన్నారు. రాష్ట్రంలోని ప్రతి ఒక్కరూ ఆత్మగౌరవంతో జీవించాలన్నదే సీఎం కేసీఆర్ అభిమత మన్నారు. నగరాన్ని సుందరంగా తీర్చిదిద్దేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. కార్యక్రమంలో నగర మేయర్ యాదగిరి సునీల్రావు, కార్పొరేటర్లు సుధగోని మాధవీ కృష్ణగౌడ్, ఎదుర్ల రాజశేఖర్, కార్పొరేటర్లు, బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.