కరీంనగర్ కలెక్టరేట్, మార్చి 18 : ఎస్సీ సామాజిక వర్గంలోని 57 ఉపకులాలకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని ఎస్సీ ఉపకులాల హక్కుల పోరాట సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు బైర వెంకటేశం డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమవారం కరీంనగర్ కలెక్టరే ట్ ఎదుట ఆ సంఘం జిల్లా శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ఆందోళనలో పాల్గొని మాట్లాడారు.
సీఎం రేవంత్రెడ్డి చేవెళ్ల సభలో ఇచ్చిన హామీ మేరకు ఎస్సీలకు మూడు కార్పొరేషన్లు ఏర్పా టు చేయాలని కోరారు. ఆందోళనలో సంఘ ప్రతినిధులు రాయల లక్ష్మీనర్సయ్య, బాణాల రాజారాం, ఔషధం రవీందర్, పరమేశ్వర్, బొల్లంపల్లి సాగర్, తోటపల్లి రాజలింగం, పురుషోత్తం ప్రభాకర్, మహేశ్ పాల్గొన్నారు.