మానకొండూర్, జనవరి 4: బీఆర్ఎస్ ఏర్పాటుతో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్కి వణుకు పుట్టిందని, తీవ్రమైన మానసిక ఒత్తిడిలో ఏమి మాట్లాడుతున్నాడో అతడికే అర్థం కావడం లేదని, ఇప్పటికైనా బీజేపీ శ్రేణులు స్పందించి వెంటనే సైకియాటిస్ట్కు చూపించి మెరుగైన వైద్యం చేయించాలని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, సుడా చైర్మన్ జీవీ రామకృష్ణారావు హితవు పలికారు. బుధవారం మానకొండూర్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో జీవీఆర్ మాట్లాడారు.
ఇటీవల ఆంధ్రప్రాంతం నుంచి బీఆర్ఎస్ పార్టీలో చేరిన నాయకులపై బండి సంజయ్ అనుచిత వ్యాఖ్యలు చేయడం అతడి అవివేకానికి నిదర్శనమన్నారు. బీఆర్ఎస్కు వస్తున్న ఆదరణను చూసి జీర్ణించుకోలేక పోతున్నారని మండిపడ్డారు. తెలంగాణ ఉద్యమంలో నీవు ఎక్కడున్నావు? ఏరోజైనా జై తెలంగాణ అని నినదించావా, తెలంగాణ ఉద్యమ నేపథ్యం గురించి తెలుసుకుని మాట్లాడాలని హితవు పలికారు. కేసీఆర్ ప్రాణాలకు తెగించి కొట్లాడి తెచ్చిన తెలంగాణలో ఇప్పుడు ఓ పార్టీకి రాష్ట్ర అధ్యక్షుడివయ్యావంటే అది కేసీఆర్ పుణ్యమే అని గుర్తుంచుకోవాలన్నారు.
మతాల మధ్య చిచ్చుపెట్టే ప్రయత్నం బెడిసి కొట్టడంతో ఇప్పుడు తెలంగాణ, ఆంధ్ర ప్రాంతాలపై అసత్యపు ఆరోపణలతో విభేదాలు సృష్టిస్తే రాబోయే రోజుల్లో రెండు ప్రాంతాల ప్రజలు తరిమి కొడుతారని హెచ్చరించారు. తెలంగాణ ఉద్యమంలో ఇక్కడే ఉంటున్న ఒక్క నాయకుడి ఇంటిపై రాయి పడలేదు, ఆంధ్ర ప్రాంత అధికారులపై దాడులు జరుగలేదని గుర్తు చేశారు. తెలంగాణలో స్థిర నివాసం ఏర్పాటు చేసుకున్న ఆంధ్రప్రాంత ప్రజలు రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఇక్కడే సంతోషంగా ఉంటున్నారని, ముఖ్యమంత్రి కేసీఅర్ పాలనకు ఇది నిదర్శనమని పేర్కొన్నారు.
తెలంగాణ ఉద్యమనేత, సీఎం కేసీఆర్ మాటలను వక్రీకరిస్తే సహించేది లేదని హెచ్చరించారు. బీఆర్ఎస్ పార్టీపై అనుచిత వ్యాఖ్యలు చేసిన బండి సంజయ్ తక్షణమే బేషరతుగా క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. సమావేశంలో జడ్పీటీసీ తాళ్లపెల్లి శేఖర్గౌడ్, సర్పంచ్ రొడ్డ పృథ్వీరాజ్, ఉప సర్పంచ్ నెల్లి మురళి, బీఆర్ఎస్ గ్రామాధ్యక్షుడు పిట్టల మధు, బీఆర్ఎస్వై మండల ప్రధాన కార్యదర్శి దండు మనోజ్, ఎస్సీ సెల్ మండలాధ్యక్షుడు పారునంది కిషన్, నాయకులు పడాల శంకరయ్యగౌడ్, ఉండింటి శ్యాంసన్, శాతరాజు యాదగిరి, దండబోయిన శేఖర్, నెల్లి శంకర్, గంజి శ్రీనివాస్, పిండి సందీప్, రామగిరి ఆంజనేయులు, రామంచ ప్రవీణ్ పాల్గొన్నారు.