చొప్పదండి/ కమాన్చౌరస్తా, ఏప్రిల్ 16 ;దేశంలోనే అత్యున్నతమైన సివిల్స్లో కరీంనగర్ జిల్లాకు చెందిన ఇద్దరు అభ్యర్థులు మెరిశారు. తాజాగా విడుదల చేసిన యూపీఎస్సీ ఫలితాల్లో వెలిచాలకు చెందిన నందల సాయికిరణ్, కరీంనగర్కు చెందిన కొలనుపాక సహన అదరగొట్టారు.
మెరిసిన ‘కిరణం’
సివిల్స్ ఫలితాల్లో రామడుగు మండలం వెలిచాల గ్రామానికి చెందిన నందల సాయి కిరణ్ 27వ ర్యాంకు సాధించాడు. గ్రామానికి చెందిన కాంతయ్య లక్ష్మికి కూతురు స్రవంతి, కొడుకు సాయి కిరణ్ ఉండగా, ఇద్దరూ చిన్నప్పటి నుంచే చదువుల్లో రాణించేవాడు. సాయికిరణ్ గ్రామంలోని సరస్వతీ పబ్లిక్ స్కూల్లో 5వ తరగతి పూర్తి చేశాడు. కరీంనగర్లోని తేజ హైస్కూల్లో 2012లో పదో తరగతి పూర్తి చేశాడు. ఈ క్రమంలో కాంతయ్య మహారాష్ట్రలోని భీవండిలో పవర్ లూమ్స్ కార్మికునిగా పనిచేస్తుండగా క్యాన్సర్ బారిన పడడంతో స్వగ్రామానికి తిరిగి వచ్చాడు. ఒకవైపు అనారోగ్యంతో బాధపడుతున్న భర్తను చూసుకుంటూ బీడీలు చుడుతూ వచ్చిన ఆదాయంతో పిల్లలను చదివించుకుంటూ తల్లి లక్ష్మి జీవనం సాగించింది. ఇంటర్ ట్రినిటీ కళాశాలలో చదువగా, బీటెక్ వరంగల్ ఎన్ఐటీలో పూర్తి చేశాడు. ఈ సమయంలోనే కాంతయ్య మరణంతో సాయికిరణ్ కుటుంబం మరింత ఇబ్బందులు పడింది.
ఈ క్రమంలో తన లక్ష్యమైన సివిల్స్ కోసం ప్రయత్నం చేయాలా? వద్దా? అన్న ఆలోచనలతో వెనకాముందయ్యాడు. సోదరి స్రవంతి బాసరలో ట్రిపుల్ఐటీ పూర్తి చేసి మిషన్ భగీరథలో ఏఈఈగా ఉద్యోగం సాధించింది. ఈ క్రమంలో తన జీవిత లక్ష్యాన్ని ఎలాగైనా చేరుకోవాలని నిర్ణయించుకున్నాడు. ఆర్థిక ఇబ్బందులు చుట్టుముడుతున్నా చదువును మాత్రం సాయికిరణ్ అశ్రద్ధ చేయలేదు. ఒడిదొడుకులను ఎదుర్కొంటూనే ఒకవైపు సివిల్స్ ప్రిపేర్ అవుతూ వచ్చాడు. ఆర్థిక అవసరాల కోసం హైదరాబాద్లో సాఫ్ట్వేర్ ఇంజినీర్గా పనిచేశాడు. మొదటి ప్రయత్నంలో విఫలమైనా, సవాళ్లను అధిగమిస్తూ మరోసారి ప్రయత్నం చేశాడు. తన సోదరి స్రవంతి ప్రోత్సాహంతో కష్టపడి చదివి లక్ష్యాన్ని చేరుకున్నాడు. మంగళవారం విడుదలైన సివిల్స్ ఫలితాల్లో ఏకంగా 27వ ర్యాంకు సాధించగా, గ్రామస్తులు సంతోషం వ్యక్తం చేశారు. ట్రినిటీ విద్యాసంస్థల ఫౌండర్ దాసరి మనోహర్రెడ్డి ప్రత్యేకంగా అభినందనలు తెలిపారు. తమ కళాశాలలో చదివిన సాయికిరణ్ ర్యాంకు సాధించడం తమకు, తమ కళాశాలకు గర్వకారణమని చెప్పారు. విద్యార్థులు గొప్ప గొప్ప స్థాయిలో స్థిరపడేలా తీర్చిదిద్దేలా అన్ని రకాల వసతులతో విద్యనందించడమే తమ లక్ష్యమని చెప్పారు.
మొదటి ప్రయత్నంలో సహన
కరీంనగర్ జిల్లా కేంద్రానికి చెందిన కొలనుపాక సహన 739వ ర్యాంకు సాధించింది. సహన తండ్రి అనిల్ రిపోర్టర్గా పని చేస్తుండగా, తల్లి గృహిణి కాగా, ఆ యువతి కరీంనగర్లోని కెన్క్రెస్ట్ సూల్లో టెన్త్ దాకా చదివి 9.8 గ్రేడ్ పొందింది. ఇంటర్ హైదరాబాద్లోని శ్రీగాయత్రి కళాశాలలో 979 మారులతో పూర్తి చేసింది. అనంతరం అక్కడే జేఎన్జీయూలో బీటెక్ కంప్లీట్ చేసి, ఢిల్లీలోని శ్రీరామ్స్ ఐఏఎస్ అకాడమీలో కోచింగ్ తీసుకున్నది. అనంతరం ప్రిలిమినరీ, మెయిన్స్ ఎగ్జామ్స్లో క్వాలిఫై అయి, మళ్లీ ఢిల్లీలో మాక్ ఇంటర్వ్యూలు అటెండ్ చేసింది. మొదటి ప్రయత్నంలోనే మంచి ర్యాంకు 739వ సాధించింది.
స్మితా మేడం నాకు ఆదర్శం
మా మమ్మీడాడీ ప్రోత్సహించడం వల్లే నేను యూపీఎస్సీలో ర్యాంకు సాధించా. స్మితా సబర్వాల్ మేడం కరీంనగర్ కలెక్టర్గా పనిచేస్తున్న సమయంలో ఆమె పనితీరు నచ్చింది. అందుకే ఆమెను ఆదర్శంగా తీసుకున్నా. అప్పటి నుంచి కలెక్టర్ కావాలని డిసైడ్ అయ్యాను. మా పేరెంట్స్ సహకారంతో ప్రిపేర్ అయ్యాను.