కమాన్చౌరస్తా, నవంబర్ 24: కార్పొరేషన్లో విలీనం అయిన తర్వాత అల్గునూర్ అభివృద్ధికి చిరునామాగా మారిందని, ఒక వైపు కేబుల్ బ్రిడ్జి, మరోవైపు రివర్ ఫ్రంట్, తిమ్మాపూర్ వరకు నాలుగు వరుసల రోడ్డు, సెంట్రల్ లైటింగ్తో ధగధగా మెరిసిపోతూ కరీంనగర్కు స్వాగత తోరణంలా మారిందని బీఆర్ఎస్ మానకొండూర్ ఎమ్మెల్యే అభ్యర్థి రసమయి బాలకిషన్ పేర్కొన్నారు. శుక్రవారం కార్పొరేషన్ పరిధిలోని 8వ డివిజన్ అల్గునూర్లో రోడ్డుషోకు ఆయన హాజరయ్యారు. స్థానిక నాయకులు ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ డివిజన్ మొత్తం పర్యటించారు.
అనంతరం అల్గునూర్ చౌరస్తా వద్ద ఎమ్మెల్యే రసమయి మాట్లాడారు. అప్పుడు ఎట్లుండే అల్గునూర్, ఇప్పుడు ఎట్లా మారిందో స్థానికులు గమనించాలన్నారు. కార్పొరేషన్లో విలీనమైన తర్వాత ఇక్కడ భూములకు డిమాండ్ చాలా పెరిగిందని గుర్తు చేశారు. షోరూంలు, ఫుడ్ కోర్టులు అనేకం వచ్చాయని, రానున్న రోజుల్లో రివర్ ఫ్రంట్ పూర్తయితే ఇక్కడ అభివృద్ధి కనీవినీ ఎరుగని రీతిలో ఉంటుందని పేర్కొన్నారు. కల్లబొల్లి మాటలు చెప్పుకొంటూ వస్తున్న కాంగ్రెస్ నాయకులను నమ్మవద్దని సూచించారు. రాష్ట్రంలో ప్రతి ఇంటికీ సంక్షేమ పథకాలు అందాయని, ఇదే క్రమంలో ఇక్కడి కాంగ్రెస్ నాయకులకూ కల్యాణలక్ష్మి, షాదీముబారఖ్ చెక్కులు అందజేశామని, అదీ ముఖ్యమంత్రి కేసీఆర్ గొప్పతనమని కొనియాడారు.
కేడీసీసీ బ్యాంక్ డైరెక్టర్, పొరండ్ల సింగిల్ విండో చైర్మన్ సింగిరెడ్డి స్వామిరెడ్డి మాట్లాడుతూ, అల్గునూర్ అభివృద్ధికి మానకొండూర్ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్తో పాటు, ముఖ్యమంత్రి కేసీఆర్ కట్టుబడి ఉన్నారని చెప్పారు. స్థానికంగా జరిగిన అభివృద్ధిని చూసి ఓటు వేయాలని కోరారు. ఈ కార్యక్రమానికి స్థానిక కార్పొరేటర్ సల్ల శారదారవీందర్, బీఆర్ఎస్ డివిజన్ అధ్యక్షుడు జాప శ్రీనివాస్ రెడ్డి అధ్యక్షత వహించగా, నాయకులు కంది రాంచంద్రారెడ్డి, కంది అశోక్ రెడ్డి, పడాల రమేశ్, చిందం మల్లేశం, అంజయ్య, కమలాకర్, సల్ల మహేందర్, లక్ష్మారెడ్డి, రవీందర్రెడ్డి, దీపక్, దిలీప్, రాజమల్లు, శ్రీకాంత్, చంద్రయ్య, అనంత రెడ్డి, అఫ్రోజ్, హాజార్, నవీద్, ఫయాజ్, ముదిరాజ్ సంఘం మండలాధ్యక్షుడు చిల్లా పరశురాం, జీకే యూత్ డివిజన్ అధ్యక్షుడు ప్రశాంత్, రవి, యువకులు, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.