పెద్దపల్లి : జిల్లాలోని అంతర్గాం మండల రెవెన్యూ ఇన్స్పెక్టర్ ( RI ) సెదంక శ్రీమాన్ ( Sriman ) లంచం ( Bribe ) తీసుకుంటూ ఏసీబీ ( ACB ) అధికారులకు రెడ్హ్యండెడ్గా పట్టుబడ్డారు. భూభారతి చట్టం, 2025 ప్రకారం, ఫిర్యాదుదారు తల్లికి చెందిన భూమికి సంబంధించి క్షేత్రస్థాయి విచారణ నిర్వహించి నివేదికను తహసీల్దార్కు పంపించాలని ఆర్ఐను కోరగా అందుకు లంచం డిమాండ్ చేశాడు.
దీంతో బాధితుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. గురువారం తహసీల్ కార్యాలయం లో రూ.10 వేలు లంచం తీసుకుంటుండగా కరీంనగర్ యూనిట్కు చెందిన ఏసీబీ అధికారులకు చిక్కాడు. అతడిపై కేసు నమోదు చేసి కరీంనగర్ ఏసీబీ కోర్టులో హాజరు పర్చామని అధికారులు వివరించారు.