ఫర్టిలైజర్సిటీ, ఏప్రిల్ 1: రామగుండంలో నిర్మించిన ఆర్ఎఫ్సీఎల్ 2023-24 ఆర్థిక సంవత్సరంలో 11.19 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా ఉత్పత్తి చేసినట్లు ఆర్ఎఫ్సీఎల్ ముఖ్య కార్యనిర్వహణ అధికారి సుధీర్కుమార్ ఝా సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. యూరియా ఉత్పత్తి సాధించడంలో కీలక పాత్ర పోషించిన కార్మికులకు, ఉద్యోగులకు ఆయన అభినందనలు తెలిపారు.
ఈ ఆర్థిక సంవత్సరంలోని 12 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా టార్గెట్గా పెట్టుకోగా, 11.19 లక్షల మెట్రిక్ టన్నుల ఉత్పత్తి చేసినట్లు చెప్పారు. అందులో తెలంగాణకు 4,45,861.89 మెట్రిక్ టన్నులు, ఆంధ్రప్రదేశ్కు 1,53,383.94 మెట్రిక్ టన్నులు, కర్ణాటకు 1,83,070.44 మెట్రిక్ టన్నులు, మహారాష్ట్రకు 78,745.23 మెట్రిక్ టన్నులు, ఛత్తీస్గఢ్కు 85,862.07 మెట్రిక్ టన్నులు, తమిళనాడుకు 99,006.03 మెట్రిక్ టన్నులు, మధ్యప్రదేశ్కు 74,093.94 మెట్రిక్ టన్నుల చొప్పున సరఫరా చేసినట్లు చెప్పారు.