కరీంనగర్ రూరల్: ఆగస్టు 22: తెలంగాణలో రుణమాఫీతో రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారని, రైతుబంధు, రైతు బీమా, రుణమాఫీతో సీఎం కేసీఆర్ రైతుల పక్షపాతి అని తేలిందని, ప్రజలు మళ్లీ కేసీఆర్ ప్రభుత్వాన్నే కోరు కుంటున్నారని రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖల మంత్రి గంగుల కమలాకర్ స్పష్టం చేశారు. మంగళవారం ఎంపీపీ తిప్పర్తి లక్ష్మయ్య అధ్యక్షతన నిర్వహించిన కరీంనగర్ మండల సర్వసభ్య సమావేశానికి మంత్రి ముఖ్య అతి థిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా పంట రుణమాఫీ చేసినందుకు సీఎం కేసీఆర్కు కృతజ్ఞతలు తెలుపుతూ మండల సమావేశం తీర్మానం చేయాలని ఆయన కోరగా, సభ్యులంతా ఏకగ్రీవంగా తీర్మానం చేశారు.
అనంతరం అకాల వర్షాలతో పంట నష్టం నమోదుపై, పంటల రుణామాఫీపై పూర్తి స్థాయి సమాచారాన్ని ఎంపీటీసీ బుర్ర తిరుపతి గౌడ్, ఎంపీపీలు, వ్యవసాయ అధికారి సత్యంను వివరణ అడిగారు. ఒక చెర్లభూత్కూర్లోనే 40 ఎకరాల పంట నష్టం జరిగితే, 14ఎకరాల పంట నష్టం జరిగిందని పేర్కొ నడంపై మండల సభ్యులు వ్యవసాయ అధికారిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తాగునీటి సరఫరాకు అధికంగా కరెంట్ బిల్లు వస్తుందని, ఏడాదిగా ఏఎన్సీ, పల్లెప్రగతి నిధులు మంజూరు చేయడం లేదని, మిషన్ భగిరథ పైపుల లీకేజీ మరమ్మతుల ఖర్చులను గ్రామ పంచాయతీ భరించాల్సి వస్తుందని మొగ్దుంపూర్ గ్రామ సర్పంచ్ జక్కం నర్సయ్య అధికారుల దృష్టికి తీసుకువచ్చారు. అనంతరం సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన రాష్ట్ర మంత్రి గంగుల కమలాకర్ మాట్లాడుతూ… ప్రజల మనస్సు చూరగొనేలా ప్రజాప్రతినిధులు పని చేసి, వారి మన్ననలు పొందాలని సూచించారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కేసీఆర్ నాయకత్వంలో రూ.22 వేల కోట్ల నిధులను మంజూరు చేసి, రాష్ట్రంలోని రైతులందరికీ రుణమాఫీ చేసిందన్నారు. రైతుబీమా, రైతుబంధు పథకాలను అమలు చేసి రైతు సంక్షేమ ప్రభుత్వంగా నిలిచిందన్నారు. సీఎం కేసీఆర్కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నారని, మళ్లీ సీఎం కేసీఆర్కే అధికారం అప్పగించాలని ప్రజలు కోరుకుంటున్నారని పేర్కొన్నారు.
ఇతరులకు తెలంగాణ రాష్ర్టాన్ని అప్పగించేందుకు ప్రజలు సిద్ధంగా లేరని స్పష్టం చేశారు. కేసీఆర్ పాలనలో తెలంగాణ అభివృద్ధి చెందుతుందనే నమ్మకం ప్రజలకు వచ్చిందని తెలిపారు. సమైక్య ఆంధ్ర పాలనలో హైదరాబాద్ ద్వారా వచ్చే ఆదాయాన్ని, ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధికి తరలించేవారని విమర్శించారు. స్వరాష్ట్రంలో హైదరాబాద్ ఆదాయంతో హైదరాబాద్తో పాటు తెలంగాణలోని అనేక గ్రామాలు అభివృద్ధి చెందుతున్నాయని తెలిపారు. రాష్ట్రంలోని జలాశయాలు నిరంతరం నీటితో కళకళలాడుతున్నాయని, రైతుల ఆర్థిక ప్రమాణాలు మెరుగుయ్యాయని వివరించారు. వ్యవసాయానికి ఉచిత విద్యుత్, అందుబాటులో యూరియా, సాగునీరు, తాగునీరు సౌకర్యం కల్పించడంతో గ్రామీణ ప్రాంతాల రైతుల ఆర్థిక అభివృద్ధికి సీఎం కేసీఆర్ తోడ్పాటు అందించారన్నారు. దేశంలో అన్ని రాష్ర్టాల కంటే తెలంగాణ అద్భుతంగా అభివృద్ధి చెందుతుందన్నారు. కరీంనగర్ చరిత్రలో 1956 నుంచి ఒక సారి ఎమ్మెల్యేగా గెలిచిన వ్యక్తి రెండోసారి గెలిచిన దాఖలాలు లేవన్నారు. కరీంనగర్ ప్రజల ఆశీస్సులతో కౌన్సిలర్గా, నగర కార్పొరేటర్గా గెలుపొంది, మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచానన్నారు.
రోడ్ల మరమ్మతులకు నిధులు మంజూరు
తాను మొదటిసారిగా ఎమ్మెల్యేగా గెలిచినప్పుడు, కరీంనగర్ మండలంలోని గ్రామాలకు సక్రమంగా రహదారులు లేవని, కోట్ల రూపాయల నిధులు మంజూరు చేసి, గ్రామాల్లోని ప్రధాన రహదారులను నిర్మాణం చేయడంతో పాటు, గ్రామాల కనెక్టివిటి రోడ్లకు కోట్ల రూపాయల నిధు లు మంజూరు చేశానన్నారు. చామనపల్లి నుంచి బహ్దూర్ఖాన్పేట, ఫకిర్పేట, ఇరుకుల్ల, ఎలభోతారం గ్రామాలకు కనెక్టివిటి రోడ్లు, ఎలభోతారం నుంచి నగునూర్, నగునూర్ నుంచి ఇరుకుల్లకు, ఎలభోతారం నుంచి చామనపల్లి, చెర్లభూత్కూర్, బహ్దుర్ఖాన్పేట, ప్రశాంత్ నగర్కాలనీ, దుబ్బపల్లి, తాహెర్ కొండాపూర్ గ్రామాలకు బ్రిడ్జిలు, రహదారుల నిర్మాణం చేపట్టానని తెలిపారు. పదేళ్లలో గ్రామాలను బ్రహ్మండంగా అభివృద్ధి చేశామని వివరించారు. రూ.16 కోట్ల నిధులతో గ్రామాలకు రోడ్ల నిర్మాణం చేపడుతున్నట్లు పేర్కొన్నారు. గోపాల్పూర్ గ్రామం నుంచి మల్లికార్జున ఆలయం వరకు రూ. కోటి 50 లక్షలతో, బొమ్మకల్లోని మల్లికార్జున ఆలయం వరకు రూ.కోటి 50 లక్షలతో, బొమ్మకల్ దుర్గమ్మ ఆలయం నుంచి గోధు మకుంట వరకు రూ. కోటి 60 లక్షల నిధులతో రోడ్ల నిర్మా ణం, మొగ్దుంపూర్ రాజీవ్ రహదారిపై రోడ్డు నిర్మాణానికి రూ. కోటి, గ్రామీణ ప్రాంతంలో కనెక్టివిటి లేని రహదారులకు, చెర్లభూత్కూర్, ప్రశాంత్ నగర్, దుబ్బపల్లి రోడ్డుకు రూ.2కోట్లతో, దుర్శేడ్ గుంటూర్పల్లి రోడ్డు, గోపాల్పూర్ మల్లికార్జున ఆలయం రహదారిలో బ్రిడ్జి నిర్మాణానికి రూ.కోటి, తాహెర్ కొండాపూర్ రోడ్డుకు రూ.22 లక్షలను మంజూరు చేశామని పేర్కొన్నారు.
ప్రభుత్వంపై వ్యతిరేకత లేదు
గ్రామాల్లో సమస్యలు అధికంగా ఉంటాయని, వాటిని అధిగమించి ప్రజలు సంతోషపడే విధంగా అభివృద్ధి చేయాలన్నారు. మండలంలోని గ్రామాల్లో 2016లో పల్లె ప్రగతిలో భాగంగా ఇండ్లపై నుంచి విద్యుత్ తీగలను ఎందుకు పూర్తి స్థాయిలో తొలగించలేదని విద్యుత్ డీఈని ప్రశ్నించారు. వెంటనే తీగలను తొలగించేలా ప్రణాళిక సిద్ధం చేస్తే, కలెక్టర్ ద్వారా ప్రత్యేక నిధులను మంజూరు చేస్తానని తెలిపారు. మండుటెండల్లో గ్రామాల్లోని చెరువులు, కుంటలకు జలకళ వచ్చిందని ఆనందం వ్యక్తం చేశారు. తెలంగాణలో హైదరాబాద్ ఆదాయం రూ.లక్ష కోట్లు పెరిగిందని, రాష్ట్ర ప్రభుత్వం, సర్పంచులు, ఎంపీటీసీలు జవాబుదారీగా పని చేస్తున్నారన్నారు. ప్రజలకు తెలంగాణ ప్రభుత్వంపైన వ్యతిరేకత లేదని, తెలంగాణలో రోడ్లపై నీటి బిందెలతో కారుకు అడ్డంగా ఆడపడుచులు అందోళన చేసిన సంఘటనలు లేవని గుర్తు చేశారు. కలెక్టర్ బీ గోపి మాట్లాడుతూ.. స్వచ్ఛ్ గ్రామీణ యోజన కింద జిల్లాలోని రెండు గ్రామాల ఎంపిక జరుగుతుందని, ఉపాధి హామీ పథకం ద్వారా అభివృద్ధి పనులు చేపట్టాలని, నూతన గ్రామ పంచాయతీల భవన నిర్మాణాలకు మంజూరు వచ్చిందన్నారు. అడిషనల్ కలెక్టర్ ప్రిపుల్ దేశాయ్ మాట్లాడుతూ.. స్వచ్ఛ్భారత్, స్వచ్ఛ గ్రామాలకు ఎంపిక జరుగుతుందన్నారు.
కరీంనగర్ మండలంలోని గ్రామాల్లో అభివృద్ధి పనులు చేపట్టి, దేశ స్థాయిలో ఎంపిక కావాలని సూచించారు. గ్రామాల అభివృద్ధికి అందరు సహకారం అందించాలని కోరారు. సమావేశంలో జడ్పీటీసీ పురుమల్ల లలిత, ఆర్డీవో మహేశ్, డీపీవో వీర బుచ్చయ్య, ఏడీఏ, తహసీల్దార్ నవీన్కుమార్, ఎంపీడీవో జగన్మోహన్రెడ్డి, సింగిల్ విండో చైర్మన్లు పెండ్యాల శ్యాంసుందర్రెడ్డి, గోనె నర్సయ్య, పీఆర్డీఈ, ఆర్డబ్ల్యూఎస్ డీఈ, వివిధ శాఖల ఏఈలు, విద్యుత్ ఏఈలు, వైస్ ఎంపీపీ వెల్పుల నారాయణ, ఎంపీటీసీలు బుర్ర తిరుపతిగౌడ్, వెంగళదాసు శ్రీనివాస్, వినయ్సాగర్, అంకమల్ల శ్రీనివాస్, చల్ల రమక్క, ర్యాకం లక్ష్మి, గోలి రాజ్యలక్ష్మి, ఎలక్కపల్లి స్వరూప, దామరపల్లి పుష్ప, సర్పంచులు దబ్బెల రమణారెడ్డి, జక్కం నర్సయ్య, పురుమల్ల శ్రీనివాస్, ఉప్పుల శ్రీధర్, ఊరడి మంజుల, చామనపల్లి అరుణ, తప్పట్ల భూమయ్య, కట్ల లక్ష్మి, వడ్లూరి సంతోష, బలుసుల శారద, గాజుల వెంకటమ్మ, మండల అధికారులు తదితరులు పాల్గొన్నారు.