Vemulawada | వేములవాడ, ఏప్రిల్ 17 : అగ్ని ప్రమాదాల పట్ల అప్రమత్తంగా ఉండాలని వేములవాడ అగ్నిమాపక ఇన్చార్జి అధికారి సీహెచ్ సాయిలు అన్నారు. వేములవాడ పట్టణంలోని ప్రైవేటు ఆసుపత్రులలో అగ్ని ప్రమాదాలపై శుక్రవారం అవగాహన కల్పిస్తూ మాట్లాడారు. ఆసుపత్రులలో తప్పనిసరిగా అగ్ని ప్రమాద నివారణ చర్యలు పాటించాలని సూచించారు.
ఏమైనా ప్రమాదాలు సంభవించే సమయంలో తీసుకోవలసిన జాగ్రత్తలను వివరించామని చెప్పారు. ప్రతీ మూడు మాసాలకు ఒకసారి మార్క్ డ్రిల్ నిర్వహించి అవగాహన కల్పిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో లీడింగ్ ఫైర్ ఫైటర్ చంద్రశేఖర్, ఉపేందర్, ప్రేమ్ చంద్, జీవన్ రెడ్డి, ఆసుపత్రి నిర్వహకులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.