వెల్గటూర్, డిసెంబర్ 26: కోటిలింగాల, చెగ్యాం గ్రామాల వద్ద రాష్ట్ర మత్య్స సమీకృత అభివృద్ధి శాఖ ద్వారా అందించిన 10 లక్షల రొయ్య పిల్లలను ఎల్లంపల్లి బ్యాక్ వాటర్లో జడ్పీటీసీ బీ సుధారాణి స్థానిక నాయకులు, మత్య్స శాఖ అధికారులతో కలి సి సోమవారం విడుదల చేశారు. అనంతరం ఆమె మాట్లాడుతూ, ప్రభుత్వం ఉచితంగా చేప పిల్లలు, రొయ్య పిల్లలను పంపిణీ చేయడం వల్ల గంగపుత్రులకు ఉపాధి అవకాశాలు మెరుగుపడ్డాయన్నారు.
రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచి సీఎం కేసీఆర్ ముం దు చూపుతో అన్ని కుల సంఘాలకు అనేక రకాల సంక్షేమ పథకాలను అమలు చేస్తూ ఉపాధి అవకాశాలను కల్పిస్తున్నారని వివరించారు. కార్యక్రమం లో సర్పంచులు నక్క మౌనిక-రవితేజ, రామిళ్ల లావణ్య-సునీల్, ద్యావనపల్లి లక్ష్మి-ఎల్లయ్య, ఏఎంసీ చైర్మన్ పత్తిపాక వెంకటేశ్, సొసైటీ చైర్మన్ ఎర్రోళ్ల సతీశ్, చెగ్యం గంగపుత్రుల సంఘం అధ్యక్షడు ధర్మాజీ రాజేశం, ధర్మాజీ శ్రీనివాస్, జిల్లా మత్య్సశాఖ అధికారి ఎల్ దామోదర్, సభ్యులు రాకేశ్, తిరుపతి, సురేశ్, నవీన్ ఉన్నారు.