రాంనగర్, ఫిబ్రవరి 8: పోలీస్ స్టేషన్కు వచ్చే ఫిర్యాదుదారులు సంతృప్తి చెందేలా రిసెప్షన్ అధికారులు మెరుగైన సేవలందించాలని కరీంనగర్ పోలీస్ కమిషనర్ ఎల్ సుబ్బారాయుడు ఆదేశించారు. ఫిర్యాదుదారులకు కనీస మర్యాదనిచ్చి వారికి కేటాయించిన సీట్లలో కూర్చోబెట్టి సమస్యలను ఓపికగా ఆలకించి, సత్వరం పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. స్థానిక కమిషనరేట్ కేంద్రంలోని కాన్ఫరెన్స్ హాల్లో బుధవారం పోలీస్ స్టేషన్ల రిసెప్షన్ అధికారులకు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సీపీ ఎల్ సుబ్బారాయుడు మాట్లాడుతూ, రిసెప్షన్ కేంద్రాల్లో పని చేస్తున్న అధికారులు అన్ని వర్గాల ప్రజల ఫిర్యాదులపై సత్వరం స్పందించి, వారి సమస్యలు త్వరగా పరిషారమయ్యేలా చర్యలు తీసుకోవాలన్నారు.
రోజు వారీగా కేసుల వివరాలను ఆన్లైన్లో అప్లోడ్ చేయాలని సూచించారు. టెక్నాలజీ వినియోగాన్ని పెంపొందించుకునేందుకు ప్రాధాన్యమివ్వాలని పేరొన్నారు. సమర్థవంతమైన సేవల ద్వారానే గుర్తింపు లభిస్తుందని, ప్రతి పోలీసు పోలీస్ శాఖ ప్రతిష్టను పెంపొందించేందుకు క్రమశిక్షణతో మెదులుతూ కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ డీసీపీ (పరిపాలన) చంద్రమోహన్, ఏసీపీ కాశయ్య, కరీంనగర్ రూరల్ సీఐ విజ్ఞాన్ రావు పాల్గొన్నారు.