కార్పొరేషన్, ఫిబ్రవరి 10 : కరీంనగర్ వంటి నగరాల్లో ప్రాపర్టీ షోలు ప్రజలకు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయని ఆర్డీవో మహేశ్వర్ పేర్కొన్నారు. నమస్తే తెలంగాణ, తెలంగాణ టుడే ఆధ్వర్యంలో కరీంనగర్ రెవెన్యూ గార్డెన్ వేదికగా రెండు రోజులపాటు ప్రాపర్టీ షో నిర్వహించగా, శనివారం ముగింపు కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ భవన నిర్మాణాలు, స్థలాల గురించి తెలుసుకోవాలంటే ఎక్కడెక్కడికో వెళ్లాల్సి వస్తుందని, దీని వల్ల సమయం వృథా అవుతుందని చెప్పారు.
కానీ, నిర్మాణ రంగ సంస్థలన్నింటినీ ఒకే వేదికపైకి తేవడం వల్ల కొనుగోలుదారులకు ఒకేచోట అనుమానాలు నివృత్తి కావడంతోపాటు సమయం ఆదా అవుతుందని చెప్పారు. ఇలాంటి షోలను నిర్వహించడం అభినందనీయమని, కరీంనగర్లో మరిన్ని ఏర్పాటు చేయాలని సూచించారు. కొత్తపల్లి మున్సిపల్ చైర్మన్ రుద్ర రాజు మాట్లాడుతూ, కరీంనగర్ జిల్లాలోని రియల్ వ్యాపారులు, బిల్డర్స్ అందరినీ ఒకే వేదికపైకి తీసుకురావడం అభినందనీయమని ప్రశంసించారు. నమస్తే తెలంగాణ ఇలాంటి కార్యక్రమాలు చేపట్టడం సంతోషంగా ఉందన్నారు.
కరీంనగర్ కేంద్ర సహకార బ్యాంక్ ఆధ్వర్యంలో అన్ని రంగాలకు సేవలందిస్తున్నాం. వ్యవసాయంతోపాటు వ్యాపారాలు, వాహనాలు, గృహనిర్మాణాలకు సంబంధించి రుణాలు అందిస్తున్నాం. డిపాజిట్లపై అత్యధిక వడ్డీని అందిస్తూ కార్పొరేట్ స్థాయిలో సేవలందిస్తున్నాం. కరీంనగర్ జిల్లా అభివృద్ధిలో మా వంతు బాధ్యతను నిర్వర్తిస్తున్నాం. నమస్తే తెలంగాణ, తెలంగాణ టుడే ఆధ్వర్యంలో ప్రాపర్టీ షో నిర్వహించడం అభినందనీయం. సందర్శకులకు మేం అందిస్తున్న సేవలను వివరించాం.
– సత్యనారాయణరావు, సీఈవో (కేడీసీసీబీ)