మానకొండూర్ రూరల్, జూన్ 14: కనిపించే దేవుళ్ల్లు వైద్యులు, ఏఎన్ఎంలు, ఆశ వర్కర్లు, సిబ్బంది అని రాష్ట్ర సాంస్కృతిక సారథి చైర్మన్, ఎమ్మెల్యే డాక్టర్ రసమయి బాలకిషన్ పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా మండలంలోని ముంజంపల్లి కేఎస్ఆర్ ఫంక్షన్ హాల్లో బుధవారం అదనపు డీఎంహెచ్వో డాక్టర్ సుజాత, జడ్పీ సీఈవో ప్రియాంక ఆధ్వర్యంలో వైద్యఆరోగ్య దినోత్సవం నిర్వహించారు. ముఖ్య అతిథులుగా ఎమ్మెల్యే డాక్టర్ రసమయి బాలకిషన్, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, సుడా చైర్మన్ జీవీ రామకృష్ణారావు హాజరై జ్యోతి ప్రజ్వలన చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే రసమయి మాట్లాడుతూ, స్వరాష్ట్రంలో సీఎం కేసీఆర్ సర్కారు దవాఖానల్లో సకల సదుపాయాలు కల్పిస్తున్నట్లు తెలిపారు. బతుకుపై ఆశను కల్పించి, ఆశయం కల్పించే వారే ‘ఆశ’ వర్కర్లు అని కొనియాడారు. సామాజిక సేవ చేసే వారే వైద్య సిబ్బంది అని పేర్కొన్నారు.
ఇప్పటికే మండలంలోని వెల్ది (లక్ష్మీపూర్)లో బస్తీ దవాఖాన, గన్నేరువరంలో పీహెచ్సీ భవనం నిర్మిస్తున్నట్లు తెలిపారు. ఇల్లంతకుంట మండలంలో 30 పడకల దవాఖాన నిర్మిస్తున్నట్లు చెప్పారు. ప్రస్తుతం 8 లక్షల ర్యాంక్ వచ్చినప్పటికీ డాక్టర్ కోర్సు చేసేలా ప్రభుత్వం వసతులను కల్పించిందన్నారు. గర్భిణులకు న్యూట్రిషన్ కిట్లు, అంధత్వ నివారణకు కంటి వెలుగు, ప్రభుత్వ దవాఖానల్లో ప్రసవం అయిన మహిళలకు కేసీఆర్ కిట్లు అందించిన ఘనత సీఎం కేసీఆర్కే దక్కుతుందన్నారు. అర్హులైన ఆశ కార్యకర్తలకు డబుల్ బెడ్రూం ఇండ్లు మంజూరు చేసేందుకు తన వంతు కృషి చేస్తానని తెలిపారు. సుడా చైర్మన్ జీవీ రామకృష్ణారావు మాట్లాడుతూ, మండు వేసవిలో చెరువులు, కుంటలు నీటితో కళకళలాడుతున్నాయని పేర్కొన్నారు. తెలంగాణ సంక్షేమ పథకాలు దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నాయని కొనియాడారు. జడ్పీ సీఈవో ప్రియాంక మాట్లాడుతూ, జిల్లాలో శిశు మరణాల సంఖ్య తగ్గిందన్నారు. ఆరోగ్య మహిళా కార్యక్రమం గురించి ఇప్పటికే అంగన్వాడీల ద్వారా ప్రజలకు అవగాహన కల్పించినట్లు తెలిపారు. అనంతరం ప్రజాప్రతినిధులు, అధికారులు వైద్య సిబ్బందితో కలిసి న్యూట్రిషన్ క్యాలెండర్ను ఆవిష్కరించారు.
వైద్య సిబ్బందికి మెమోంటోలతో పాటు ప్రశంసా పత్రాలను, ఆశ వర్కర్లకు చీరలను, గర్భిణులకు న్యూట్రిషన్ కిట్లను అందజేశారు. ప్రాంగణంలో ఏర్పాటు చేసిన స్టాల్స్ను పరిశీలించారు. వైద్య ప్రగతిని పరిశ్రమల శాఖ అధికారి నవీన్, అదనపు డీఎంహెచ్వో డాక్టర్ సుజాత చదివి వినిపించారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీలు తాళ్లపల్లి శేఖర్ గౌడ్, లింగంపల్లి శ్రీనివాస్ రెడ్డి, ఎంపీపీ ముద్దసాని సులోచన, 8వ డివిజన్ కార్పొరేటర్ సల్ల శారద, ముంజంపల్లి సర్పంచ్ రామంచ గోపాల్ రెడ్డి, సీడీపీవో సబిత, ఆయా గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు, మానకొండూర్, తిమ్మాపూర్ ఎంపీడీవోలు దివ్యదర్శన్ రావు, రవీందర్ రెడ్డి, ఆయా పీహెచ్సీల డాక్టర్లు కిరణ్కుమార్, బియాబానీ, ప్రణవ్, వేణుగోపాల్, ఎంఎల్హెచ్పీ డాక్టర్లు, సూపర్వైజర్లు, ఏఎన్ఎంలు, తదితరులు పాల్గొన్నారు.