అభివృద్ధి బాటలో పయనిస్తున్న వేములవాడ పట్టణాన్ని రాష్ట్ర ప్రభుత్వం మరింత సుందరంగా తీర్చిదిద్దుతున్నది. అందులో భాగంగా 107.45 కోట్లు కేటాయించి వివిధ పనులకు శ్రీకారం చుట్టింది. ఇప్పటికే కొన్ని పూర్తి కాగా, మరికొన్ని చేపట్టేందుకు సిద్ధమవుతున్నది. తాజాగా రాష్ట్ర ఐటీ, మున్సిపల్, పరిశ్రమల శాఖల మంత్రి కేటీఆర్ మంగళవారం వేములవాడ నియోజకవర్గంలో పర్యటించి అభివృద్ధి కార్యక్రమాలకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేయనున్నారు. వేములవాడ పట్టణ, నియోజకవర్గ ప్రజలతో పాటు రాజన్న సన్నిధికి వచ్చే భక్తుల కోసం చేపట్టే పనుల్లో పాలుపంచుకోనున్నారు. ఆయనతో పాటు రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్ కుమార్, ఎమ్మెల్యే రమేశ్ బాబు పాల్గొనున్నారు.
వేములవాడ, ఆగస్టు 7 : వేములవాడ పట్టణం ప్రగతి పథంలో దూసుకుపోతున్నది. ఇప్పటికే అనేక రంగాల్లో వేగంగా అభివృద్ధి జరుగగా, ఇటీవల పూర్తి చేసుకున్న పనులు, చేపట్టనున్న పనులకు రాష్ట్ర ఐటీ, మున్సిపల్, పరిశ్రమల శాఖల మంత్రి కేటీఆర్ మంగళవారం ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేయనున్నారు. ఉదయం 10 గంటలకు వేములవాడకు చేరుకోనున్న ఆయన, రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్కుమార్, ఎమ్మెల్యే రమేశ్బాబుతో కలిసి పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పా ల్గొంటారు. అనంతరం 2 గంటలకు సిరిసిల్ల కలెక్టరేట్లో జరిగే కార్యక్రమానికి హాజరవుతారని అధికారులు తెలిపారు.
ప్రారంభించే అభివృద్ధి పనులు
శంకుస్థాపనలు చేసేవి..