కోల్సిటీ, జనవరి 31: కేంద్ర ప్రభుత్వం అర్బన్ ఔట్ కమ్ ఫ్రేమ్ వర్క్స్లో భాగంగా ఈజ్ ఆఫ్ లివింగ్ ఇండెక్స్ రూపొందించేందుకు చేపట్టిన సిటిజన్ పర్సెప్షన్ సర్వే యాక్టివిటీలో పెద్దపల్లి జిల్లా రామగుండం నగర పాలక సంస్థకు నూటికి నూరు మార్కులు లభించాయి. తెలంగాణ రాష్ట్రం నుంచి ఆ ఘనత సాధించిన ఏకైక కార్పొరేషన్గా రామగుండంకు చోటు దక్కింది. సిటీ లెవల్ బోర్డ్ ఫర్ సీపీఎస్ యాక్టివిటీస్-2022 పేరుతో కేంద్ర గృహ నిర్మాణం, పట్టణ వ్యవహారాల శాఖ ఈనెల 30 (సోమవారం) జాబితా విడుదల చేసింది. ఇం దులో నూటికి నూరు మార్కులు సాధించిన నగరాల్లో తెలంగాణ రాష్ట్రం నుంచి కేవలం రామగుండం నగరానికి మాత్రమే చోటు దక్కడం గమనార్హం.
ఈజ్ ఆఫ్ లివింగ్ ఇండెక్స్లో భాగంగా నగరంలో జీవన నాణ్యతకు సంబంధించి పౌరుల అవగాహన, అభిప్రాయాన్ని అర్థం చేసుకోవడానికి సహాయ పడుతుందని కేంద్ర గృహ నిర్మాణం, పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఆ ధ్వర్యంలో దేశ వ్యాప్తంగా ఈ సిటిజన్ పర్సెప్షన్ సర్వే నిర్వహిస్తున్నారు. ఇం దులో భాగంగా ప్రచార అవగాహన కోసం బిల్ బోర్డులు, హోర్డింగ్లు ఏర్పా టు చేయడం (10మార్కులు), కుడ్య చిత్రాలు (20 మార్కులు), క్యాంపెయిన్కు (10మార్కులు), రిఫరల్ సర్వే ప్రమోషన్కు (20 మార్కులు), ప్రింట్ మీడియా (10మార్కులు), డిజిటల్ మీడియా (10 మార్కులు), ఇన్నోవేటివ్ ఇన్సియేటివ్ (20 మార్కులు) మొత్తం 100 మార్కులు లక్ష్యం కాగా, అన్ని విభాగాల్లోనూ రామగుండం నగర పాలక సంస్థ వంద శాతం మార్కులు సాధించడం విశేషం.
కేంద్ర ప్రభుత్వం స్మార్ట్ సిటీగా గుర్తించిన నగరాలే ఎక్కువగా ఈ జాబితాలో చోటు సంపాదించగా, స్మార్ట్ సిటీగా గుర్తింపు పొందనప్పటికీ వాటి సరసన రామగుండం నగర నిలిచింది. ఈ గుర్తింపు దక్కడానికి శ్రమించిన అర్బన్ అవుట్ కమ్ ఫ్రేమ్ వర్క్స్ నోడల్ అధికారి, రామగుండం నగర పాలక సంస్థ డిప్యూటీ కమిషనర్ నారాయణ రావును, ఇందులో భాగస్వామ్యంగా ఉన్న మునిసిపల్ సిబ్బందిని మంగళవారం నగర పాలక సంస్థ మేయర్ బంగి అనిల్కుమార్, కమిషనర్ బీ.సుమన్ రావు అభినందించారు.