Interview | ‘సమైక్య ప్రభుత్వాల పాలన చూశారు. బీఆర్ఎస్ ప్రభుత్వ పాలనను చూశారు. అప్పుడు కార్మికుల వైపు కన్నెత్తి చూసిన వారే లేరు. కార్మికుల కష్టాలు తీర్చి, కన్నీళ్లను తుడిచి, సింగరేణిని అభివృద్ధి, సంక్షేమ బాట పట్టించింది సీఎం కేసీఆరే. కార్మికుల కుటుంబాలను కడుపులో పెట్టుకొని చూసుకుంటున్నది బీఆర్ఎస్ ప్రభుత్వం మాత్రమే. రామగుండం నియోజకవర్గ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా వందలాది కోట్లతో అభివృద్ధి చేశాం. సీఎం కేసీఆర్ చొరవతో సింగరేణిని లాభాల బాట పట్టించాం. కేంద్రం ఎన్ని కుట్రలు చేస్తున్నా రాష్ట్ర సర్కారు అడ్డుకుంటూ వస్తున్నది. కార్మికుల సంక్షేమానికి అన్ని విధాలా అండగా నిలుస్తున్నది. మీ బిడ్డగా నన్ను మరోసారి దీవిస్తే నియోజకవర్గాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దుతా. ఐటీ, ఇండస్ట్రీయల్ పార్క్ను తీసుకొస్తా.’ అని రామగుండం అసెంబ్లీ బీఆర్ఎస్ అభ్యర్థి, ఎమ్మెల్యే కోరుకంటి చందర్ స్పష్టం చేశారు. శుక్రవారం ఆయన ‘నమస్తే తెలంగాణ’కు ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు.
‘గత ప్రభుత్వాల పాలనలో రామగుండం ఎలా ఉండేది. కార్మికు లు, ప్రజలు ఆగమయ్యారు. అభివృద్ధి లేక, హామీలు అమలు కాక అరిగోస పడ్డారు. స్వరాష్ట్రంలో అభివృద్ధి ఎలా జరిగింది. బీఆర్ఎస్ పాలనలో ఈ ప్రాంతం ఎలా మారింది. ఇవన్నీ మీకు తెలుసు. నియోజకవర్గ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా వందలాది కోట్లతో అభివృద్ధి చేశాం. సీఎం కేసీఆర్ నాయకత్వంలో కార్మికుల కష్టాలు తీర్చి సింగరేణిని అభివృద్ధి బాట పట్టించాం. సంక్షేమానికి పెద్దపీట వేశాం. కార్మికులకు వెన్నంటి ఉంటూ అనేక ప్రోత్సాహాలు అందిస్తున్నాం.’ అని రామగుండం బీఆర్ఎస్ అభ్యర్థి, ఎమ్మెల్యే కోరుకంటి చందర్ పేర్కొన్నారు. శుక్రవారం ఆయన ‘నమస్తే తెలంగాణ’ కు ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. మరోసారి తనకు అవకాశం ఇస్తే నియోజకవర్గాన్ని ప్రగతికి కేరాఫ్ అడ్రస్లా మార్చుతానని, రామగుండాన్ని రెవెన్యూ డివిజన్గా ఏర్పాటు చేయడమేకాదు ఐటీ, ఇండస్ట్రియల్ పార్క్ను తీసుకొస్తానని హామీ ఇచ్చారు. గోదావరి తీర ప్రాంతాన్ని టూరిజం స్పాట్గా మార్చుతానని స్పష్టం చేశారు.
– పెద్దపల్లి, ఆగస్టు 25 (నమస్తే తెలంగాణ)
చందర్ : అసలు రామగుండం నియోజకవర్గంలో అసలైన అభివృద్ధి జరిగిందంటే కేవలం బీఆర్ఎస్ పాలనలోనే. ముఖ్యమంత్రి కేసీఆర్ కార్మిక క్షేత్రంపై ప్రత్యేక ప్రేమతో పోలీస్ కమిషనరేట్ను ఇచ్చి అభివృద్ధికి పునాది వేశారు. సింగరేణి మెడికల్ కాలేజీని మంజూరు చేసి ప్రారంభించారు. బోధనాసుపత్రిని ఏర్పాటు చేశారు. కార్మిక క్షేత్రంలోని కార్మికులకు ఖరీదైన కార్పొరేట్ వైద్యాన్ని చేరువ చేశారు. సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాన్ని, సీనియర్ సివిల్ జడ్జి కోర్టులను ఏర్పాటు చేశారు. వందలాది కోట్లతో సింగరేణి కార్మిక వాడలను అద్భుతంగా తీర్చిదిద్దారు. అంతర్గాం, పాలకుర్తి మండలాల్లోని 20వేల ఎకరాలను సుభిక్షం చేసేందుకు ఎల్లంపల్లి వద్ద 80కోట్లతో 27ఎల్, 17ఎల్ను ఏర్పాటు చేసి త్వరలోనే సాగునీరు ఇచ్చేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఇండస్ట్రియల్ పార్క్, ఐటీ పార్క్ను ఏర్పాటు చేసేందుకు ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ ఇప్పటికే గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. రామగుండం, సింగరేణి చరిత్రలో 50 ఏండ్లలో జరుగని అభివృద్ధి బీఆర్ఎస్ పాలనలో చేసి చూపించాం.
చందర్ : అసలు సింగరేణి ఇప్పటివరకు ఇంత గొప్పగా లాభాల బాటలో పయనించడం ఎప్పుడూ జరుగలేదు. సీఎం కేసీఆర్ చొరవతోనే సంస్థ నష్టాలను దూరం చేసుకొని లాభాల బాటలో పయనిస్తున్నది. కార్మికుల సమస్యలను తీర్చేందుకు ప్రత్యేకంగా దృష్టి కేంద్రీకరించారు. ఎన్నో ఏండ్లుగా ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న కార్మికుల పిల్లలకు వారసత్వ కొలువులు ఇవ్వడంతో కార్మికుల కుటుంబాలకు గొప్ప ప్రయోజనం కలిగింది. అలాగే ఏటా లాభాల్లో వాటాను పెంచి కార్మికులకు అందజేస్తున్నారు. లాభాల్లో దూసుకెళ్తున్న సింగరేణిని ప్రైవేట్ పరం చేసేందుకు కేంద్రం ఎన్ని కుట్రలు చేస్తున్నా రాష్ట్ర సర్కారు అడ్డుకుంటూ కార్మిక వర్గానికి అండగా నిలుస్తున్నది. కార్మిక వాడల్లో తాగునీరు, విద్యుత్ సరఫరా, రోడ్ల అభివృద్ధికి ప్రత్యేకంగా కృషి చేసింది. విద్యుత్ చార్జీల మాఫీ, కార్ షెడ్ల నిర్మాణాల కోసం ప్రత్యేకంగా నిధుల కేటాయింపులాంటి చర్యలను ప్రభుత్వం తీసుకున్నది. కార్మికుల కష్టాలు తీర్చి, కన్నీళ్లను తుడిచి సింగరేణిని సంక్షేమ బాట పట్టించింది సీఎం కేసీఆరే. కార్మికుల కుటుంబాలను కడుపులో పెట్టుకొని చూసుకుంటున్నది బీఆర్ఎస్ ప్రభుత్వమనే చెప్పాలి. గతంలో ఉన్న వెతలు.. ప్రస్తుత సౌకర్యాలను కార్మికులు బేరిజు వేసుకోవాలి.
కోరుకంటి చందర్ : ఉద్యమ పార్టీ బీఆర్ఎస్లో ఒక చురుకైన కార్యకర్తగా పనిచేసిన నాకు 2009లో మహాకూటమి అభ్యర్థిగా ఆనాటి ఉద్యమ నేత కేసీఆర్ పార్టీ టికెట్ ఇచ్చి బరిలో నిలిపారు. కొన్ని కారణాలతో ఓటమి పాలైనా పార్టీ అధినాయకత్వం మాత్రం నన్ను వెన్నుతట్టి ప్రోత్సహించింది. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఏఐఎఫ్బీ నుంచి పోటీ చేసి గెలుపొంది నా మాతృ పార్టీ బీఆర్ఎస్లో చేరా. సీఎం కేసీఆర్, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రోత్సాహంతో నియోజకవర్గ అభివృద్ధే ధ్యేయంగా పనిచేస్తున్నా. నా పని తీరును గుర్తించి అధినేత కేసీఆర్ నాకు రామగుడం అసెంబ్లీ బీఆర్ఎస్ అభ్యర్థిగా అవకాశమిచ్చారు. చాలా సంతోషంగా ఉంది. మరోసారి ప్రజల ఆశీర్వాదం కోసం నాకు అవకాశం ఇవ్వడం నా అదృష్టం.
చందర్ : గత ఎమ్మెల్యేల హయాంలో రామగుండం ఎలా అభివృద్ధి జరిగింది? నా పాలనలో ఎలా అభివృద్ధి జరిగిందో మీ కళ్ల ముందు కనిపిస్తున్నది. నేను ఉద్యమ కార్యకర్తగా మీ ముందుకు వచ్చా. ఆ రోజు 2009లో ఏ విధంగా ఉన్నానో.. ఇప్పుడు అదే విధంగా ఉన్నా. ప్రజా సేవే నా లక్ష్యం. నియోజకవర్గ అభివృద్ధే నా ధ్యేయం. మీ బిడ్డగా మరోసారి ఆశీర్వదించండి. నాకు అవకాశం ఇవ్వండి. రాష్ట్రంలో బీఆర్ఎస్ ప్రభుత్వానికి మూడో సారి అవకాశం ఇచ్చి కేసీఆర్ను మరోసారి ముఖ్యమంత్రిగా చేసుకుందాం. నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి చేసుకుందాం. మనకు మాటల మనుషులు వద్దు. చేతల మనిషి కేసీఆర్, కేటీఆర్ సహాయ సహకారాలతో నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి చేసుకుందాం.
చందర్ : అభివృద్ధే నా అభిమతం. ప్రజాసేవే నా మార్గం. ప్రతిపక్షాలకు ఏదో ఒకటి మాట్లాడాలనే యావ తప్ప వారు చేసే ఆరోపణల్లో, విమర్శల్లో పసలేదు. అభివృద్ధిపై వాళ్లకు చిత్తశుద్ధి లేదు. వాళ్లకు జెండా లేదు. ఎజెండా లేదు. ప్రజల మీద వాళ్లకు శ్రద్ధ లేదు. వ్యక్తిగతమైన నిరాధారమైన ఆరోపణలు చేయడం తప్ప వాటికి అంతగా ప్రాధాన్యం లేదు. ప్రజలు కూడా వాళ్లను పట్టించుకోవడం లేదు. అసలు మాకు వాళ్లు పోటీయే కాదు. మేం పట్టించుకోవాల్సిన పనిలేదు.
చందర్ : రామగుండంలో గతంలో ఎన్నడూ లేని విధంగా అభివృద్ధి పనులు చేశాం. వచ్చే ఐదేళ్లకు ప్రత్యేక ప్రణాళికతో ముందుకు సాగుతాం. ముఖ్యమంత్రి కేసీఆర్, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సహాయ సహకారాలతో రామగుండాన్ని రెవెన్యూ డివిజన్గా తీర్చిదిద్దుతా. ఒక ఇంజినీరింగ్ కళాశాలను తీసుకువస్తా. పార్వతీ బరాజ్ నుంచి ముంపునకు గురి కాకుండా గోదావరి నదిపై కరకట్ట నిర్మిస్తా. గోదావరిఖనిని ది బెస్ట్ టూరిజం స్పాట్గా, పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేస్తా. పట్టణంలో మరిన్ని వ్యాపార వాణిజ్య కేంద్రాలను నిర్మిస్తాం. బస్ స్టేషన్ను ఆధునీకరిస్తాం. ఇండస్ట్రియల్ పార్క్ను, ఐటీ పార్క్ను ఏర్పాటు చేస్తాం. చిన్నతరహా పరిశ్రమలను ఏర్పాటు చేసి నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తాం. ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీ స్కిల్ డెవలప్ మెంట్ సెంటర్లను, స్టడీ సర్కిళ్లను ఏర్పాటు చేసి నిరుద్యోగులకు చేయూత అందిస్తా.