‘నేను మీ బిడ్డను. మీరే నా బలం.. నా బలగం. మీ ఆశీర్వాదంతో ఐదేండ్లు ఎమ్మెల్యేగా పనిచేసిన. సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ సహకారంతో విరివిగా నిధులు తెచ్చి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసిన. రామగుండంలో మెడికల్ కాలేజీ ఏర్పాటు చేయించి ఈ ప్రాంత ప్రజల దశాబ్దాల కలను సాకారం చేసిన. ఐటీ, ఇండస్ట్రియల్ పార్కులు, సీనియర్ సివిల్ జడ్జి కోర్టుల సముదాయం, సబ్ రిజిస్ట్ట్రార్ కార్యాలయం ఏర్పాటు చేయించిన. అరవై ఏండ్లుగా పెండింగ్లో ఉన్న పెద్దంపేట, రాయదండి రైతులకు ఖురూజ్ కమ్మి భూములకు పట్టాలు ఇప్పించిన.
నిరంతరం అందుబాటులో ఉండి ప్రజల కష్టసుఖాల్లో పాలుపంచుకున్న. ఇప్పుడు ఇక్కడ ఉద్యమకారుడికి, ఉద్యమద్రోహికి మధ్య యుద్ధం జరుగుతున్నది. ప్రజలు ఆలోచించాలి. మీ మధ్య ఉండే నేను కావాలా..? హైదరాబాద్లో ఉండే వారు కావాలా..? మీరే నిర్ణయం తీసుకోవాలి’ అని రామగుండం అసెంబ్లీ బీఆర్ఎస్ అభ్యర్థి, ఎమ్మెల్యే కోరుకంటి చందర్ ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. గురువారం ఆయన ‘నమస్తేతెలంగాణ’కు ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. ప్రచార తీరుతెన్నులు.. ప్రజల నుంచి వస్తున్న స్పందనను వివరించారు. ప్రతిపక్షాల వైఖరిని ఎండగడుతూనే, గెలిపిస్తే చేయబోయే పనులను కండ్లముందుంచారు.
– పెద్దపల్లి, నవంబర్ 16 (నమస్తే తెలంగాణ)
పెద్దపల్లి, నవంబర్ 16 (నమస్తే తెలంగాణ) : ఉమ్మడి పాలనలో రామగుండం వివక్షకు గురైందని, కార్మిక ప్రాంతానికి తీరని అన్యాయం జరిగిందని రామగుండం బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి కోరుకంటి చందర్ విమర్శించారు. తనకు ఎమ్మెల్యేగా అవకాశం ఇస్తే ఐదేండ్లు ఈ ప్రాంత అభివృద్ధికి కృషి చేసి ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకున్నానని చెప్పారు. తాను చేసిన అభివృద్ధి మీ కండ్ల ముందే కనిపిస్తున్నదని, ప్రజలు ఆలోచించి ఓటేయాలని విజ్ఞప్తి చేశారు. గురువారం ఆయన ‘నమస్తే తెలంగాణ’కు ప్రత్యేక ఇంటర్వ్యూలో ఇచ్చా రు. చేసిన అభివృద్ధ్ది, అందించిన సంక్షేమ పథకాలే తనకు విజయాన్ని కట్టబెడతాయని, ప్రజలు కూడా పనిచేసిన తనను మరోసారి దీవిస్తారన్న నమ్మకం ఉన్నదని విశ్వాసం వ్యక్తం చేశారు.
కోరుకంటి చందర్: బ్రహ్మండంగా సాగుతున్నది. ఆత్మీయ సమ్మేళనాలతో అన్ని వర్గాలతో మమేకవుతున్న. ప్రజాఆశీర్వాదయాత్రల పేరిట ఊరూరా క్యాంపెయిన్ చేస్తున్న. ప్రజల నుంచి విశేషంగా స్పందన వస్తున్నది. రోడ్షోలకు ప్రజలు, ముఖ్యంగా మహిళలు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నరు. చేసిన అభివృద్ధిని చూసి ఘన స్వాగతం పలుకుతున్నరు. కార్యకర్తలు సైతం ఉత్సాహంగా ప్రచారాన్ని కొనసాగిస్తున్నరు. రాత్రింబవళ్లు కష్టపడుతున్నరు. ఇంటింటికీ వెళ్లి కారు గుర్తుకు ఓటేయాలని అభ్యర్థిస్తున్నరు.
కోరుకంటి: అవును. ఒకటి కాదు.. రెండుకాదు, ఎన్నో మరిచిపోలేని అనుభవాలు ఎదురైనయ్. రామగుండం బల్దియా పరిధిలోని సప్తగిరికాలనీ 6వ డివిజన్లో ఓ వృద్ధురాలు వచ్చి పలుకరించింది. ‘ఇంతకాలం ఇక్కడ దవాఖాన లేక కరీంనగర్కు వెళ్లేదాన్ని బిడ్డా.. కానీ, ఇప్పుడు మన పట్నంలనే పెద్దదవాఖన ఏర్పాటు చేసిన్రు. అక్కడికే పోయిన. పైసా ఖర్చు లేకుండా పరీక్షలు, టెస్టులు చేసి పంపిన్రు. ఈ దవాఖానల 30రోజులు ఉండి మంచిగై ఇంటికచ్చిన కొడుకా..’ అని చెప్పడం నాకు కన్నీళ్లను తెప్పించింది. ఆ వృద్ధురాలు గట్టిగా హత్తుకొని కన్నీరు పెట్టుకున్న ఘటన గుర్తుకచ్చినప్పుడల్లా నా కళ్లు చెమ్మగిల్లుతయ్. కేవలం బీఆర్ఎస్ ఎమ్మెల్యేను కావడంతోనే ఈ అదృష్టం కలిగింది. ఇది నా పూర్వ జన్మ సుకృతం.
కోరుకంటి: రామగుండం ఎమ్మెల్యేగా జీవితకాలం ప్రజలకు గుర్తుండేలా అభివృద్ధి చేసిన. సీఎం కేసీఆర్ సహకారంతో కార్మిక క్షేత్రానికి మెడికల్ కాలేజీ తెచ్చిన. అందులో సింగరేణి కార్మికుల పిల్లలకు 5శాతం రిజర్వేషన్ కల్పించిన. సబ్రిజిస్ట్రార్ ఆఫీసు తెచ్చిన. ఖర్జూ కమ్మీ భూముల సమస్యలతో అరవైఏళ్లుగా వెతలు పడుతున్న 1800 మంది రైతులకు మంత్రి కేటీఆర్ చేతుల మీదుగా పట్టాలు ఇప్పించిన. అసాధ్యమను కున్న రామగుండం కార్పొరేషన్లో కలిపిన కుందన్పల్లి, లింగాపూర్ గ్రామాల విలీనాలను రద్దు చేయించిన.
నగరపరిధిలోని ప్రధాన కూడళ్లను గొప్పగా తీర్చిదిద్దిన. తెలంగాణ అమరుల త్యాగాలను గుర్తించి స్మారక స్తూపాన్ని నిర్మించిన. జ్యోతిరావు పూలే విగ్రహం, ఫౌంటేయిన్ను ఏర్పాటు చేసిన.
నమస్తే: రామగుండం కార్మికులు, పారిశ్రామిక ప్రాంత ప్రగతికి ఏం చేశారు?
నిర్మాణానికి ఫౌండేషన్ వేసిన. ఈ పనులు పూర్తయితే రాష్ట్రంలోని ప్రధాన నగరాలతో సమానంగా రామగుండం అభివృద్ధి చెందుతుంది. కార్మికుల శ్రమకు గుర్తుగా ఫైవిైంక్లెన్లో గని కార్మికుల శారీరక సౌందర్యం ఉట్టిపడేలా విగ్రహాలను ఏర్పాటు చేసి గౌరవించుకున్నం. మిషన్ భగీరథ ద్వారా 40 వేల ఇండ్లకు నీరందిస్తున్నం.
కోరుకంటి: ఇప్పటికీ ఎంతో అభివృద్ధి చేసినం. ఇంకా సాధించాల్సింది చాలా ఉన్నది. పసలేని ప్రతిపక్షాల మాటలు విని ఆగం కావద్దు. రామగుండంలో గోదావరి నది ఉంది కాబట్టి టూరిజం స్పాట్, నదిపై కేబుల్ బ్రిడ్జి, కాళేశ్వరం బ్యాక్ వాటర్ నగరంలోకి రాకుండా కరకట్టలు నిర్మిస్త. ఇప్పటికే ప్రతిపాదనలు పంపించిన. పార్క్లు, ఓపెన్ జిమ్లు ఏర్పాటు చేసిన. ఉపాధి ఉద్యోగాల కల్పన కోసం కుటీర పరిశ్రమలను ఏర్పాటు చేస్త. మూడు నెలలకోసారి జాబ్ మేళాలు నిర్వహించి యువతకు ఉద్యోగాలు కల్పిస్త. బొగ్గు, నీరు, కరెంట్ ఆధారిత పరిశ్రమలను నెలకొల్పుత. ఇండస్ట్రీయల్ కారిడార్ చేస్త. కార్మికుల వేతనాలను పెంపునకు కృషి చేస్త.
కోరుకంటి చందర్: సింగరేణి కార్మికులకు మా ప్రభుత్వం ఎంతో చేసింది. వారసత్వ ఉద్యోగాలు ఇచ్చింది. వారి తల్లిదండ్రులకు కార్పొరేట్స్థాయి వైద్యాన్ని ఫ్రీగా అందిస్తున్నది. ఇండ్లు కట్టుకోవడానికి 10లక్షల మిత్తీ లేని రుణాలు ఇస్తున్నది. సర్కారుకు నివేదించి కార్మికులకు క్వార్టర్లు సొంతం చేసేందుకు కృషి చేస్త.
నమస్తే: ప్రతిపక్షాలు మీపై చేస్తున్న విమర్శలకు మీ సమాధానం?
కోరుకంటి: ఇక్కడి అభివృద్ధిని చూసి ఓర్వలేకే ఆరోపణలు చేస్తున్నయి. కుట్రపూరితంగా వ్యవహరిస్తున్నయి. వాళ్లు ఏం చేస్తారో చెప్పుకోలేక బట్ట కాల్చి మీద వేస్తున్నరు. ప్రజలు వివేకవంతులు అ న్నీ గమస్తున్నరు. ఈనెల 30న ప్రగతి నిరోధకుల కు కర్రు కాల్చి వాత పెడుతరు. బీఆర్ఎస్కే పట్టంగడుతరు. కేసీఆర్ను హ్యాట్రిక్ సీఎంగా చేస్తరు.
కోరుకంటి: నేను సామాన్య కుటుంబంలో పుట్టిపెరిగినోన్ని. నాకు ధన బలం లేదు. ప్రత్యర్థి ఖాతాల్లో కోట్లు, హైదరాబాద్లో ఆస్తులు ఉన్న యి. కానీ నా ఖాతాల్లో లక్షలే ఉన్నయి. అయినా పైసతో పనిలేదు. నాకున్నది ప్రజా బలం. పార్టీ బలమే. నేను మొదటి నుంచీ ప్రజల మధ్యనే ఉన్న. ప్రజల కోసమే ఉద్యమాలు చేసిన. ప్రజా సేవకే ఈ జీవితాన్ని అంకితం చేసిన. రామగుం డం నియోజకవర్గ ప్రజలే నా కుటుంబం. నాకు సర్వస్వం. కానీ, ప్రత్యర్థికి హైదరాబాద్లో ఉన్న సెలబ్రిటీలే ముఖ్యం. అక్కడే ఉంటడు. ఎన్నడూ ఇక్కడ ప్రజల కోసం పనిచేయ లేదు. ఐదేళ్లు శాప్ చైర్మన్గా పనిచేసి కనీసం రామగుండానికి షటిల్ కోర్టు కూడా తీసుకురాలేదు. ఆయన ఈ రోజు ఏదో చేస్తా అంటే నమ్మద్దు. నేను తెలంగాణ ఉద్యమ కారుడిని. ప్రత్యర్థి తెలంగాణ ద్రోహి. బీఆర్ఎస్ అంటే ఇంటి పార్టీ. కాంగ్రెస్ అంటే ఢిల్లీ పార్టీ. మన ఇంటి అవసరాలు మన పార్టీకే తెలుస్తయి. ఢిల్లీకి తెలియవు. ఓటర్లు గ్రహించాలి.
కోరుకంటి: బీఆర్ఎస్ ఎంతో గొప్ప పార్టీ. ఉద్యమ చరిత్ర ఉన్న పార్టీ. తెలంగాణను అభివృద్ధి చేసిన పార్టీ. సీఎం కేసీఆర్ నేతృత్వంలో అర్హులందరికీ సంక్షేమ ఫలాలు అందించినం. అందుకే గులాబీ పార్టీలోకి కాంగ్రెస్, బీజేపీ నుంచి నేతలు, ప్రజా ప్రతినిధులు, కార్యకర్తలు పెద్దసంఖ్యలో చేరుతున్నరు. పనిచేసే వారందరినీ అక్కున చేర్చుకుంటున్నం. కష్టపడ్డవారికి తగిన రాజకీయ అవకాశాలను ఇస్తం.
కోరుకంటి : ఇప్పటికే నియోజకవర్గంలో కార్యకర్తలు ఫుల్ జోష్తో ప్రచారం చేస్తున్నరు. వృద్ధు లు, మహిళలు, యువకులు స్వచ్ఛందంగా హోరెత్తిస్తున్నారు. ఈ నెల 18న పార్టీ వర్కింగ్ ప్రెసిడెం ట్, ఐటీ మంత్రి కేటీఆర్ రోడ్షో, ఈ నెల 24న సీఎం కేసీఆర్ రామగుండంలో నిర్వహించే ప్రజా ఆశీర్వాద సభలో పాల్గొంటారు.
నమస్తే: రామగుండంలో యువత ఎక్కువ వారి కోసం ఏం చేస్తారు?
కోరుకంటి: సీఎం కేసీఆర్ చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమంతోపాటు యువ నేత కేటీఆర్ ఉపాధి, ఉద్యోగ అవకాశాల కల్పన కోసం చేస్తున్న కృషి యువతకు తెలుసు. రాష్ట్రంలో 22 లక్షల మందికి ఉపాధి, ఉద్యోగ అవకాశాలు కల్పించారు. ఉపాధి ఉద్యోగ, అవకాశాల కల్పన కోసమే రామగుండాన్ని దత్తత తీసుకుంటానని ఇప్పటికే ప్రకటించారు. ఆయన నేతృత్వంలో రామగుండం ప్రగతి గొప్పగా ఉంటుంది. ఇప్పటికే ఆయన ఐటీ, ఇండస్ట్రీయల్ పార్కులకు శంకుస్థాపన చేశారు. అవి అందుబాటులోకి వస్తే ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పెరుగుతయి.
కోరుకంటి: కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు పింఛన్ 200లే ఉండేది. అది కూ డా ఊళ్లో ఎవరైనా చస్తారా.. పోతారా.. అని చూసుకుంటూ ఇచ్చేది. పదేండ్లలో పైసా కూడా పింఛన్ పెంచలే. కానీ, ఎన్నికలు రాగానే ఆరు గ్యారెంటీలు అని ప్రజల వద్దకు వెళ్లి సంతకాలు పెట్టిస్తున్నరు. ప్రజలు వారిని నమ్మడం లేదనే ఈ విధంగా చేస్తన్నరు. కానీ బీఆర్ఎస్ ప్రభుత్వం వృద్ధులు, అభాగ్యులకు అండగా నిలిచింది. ఇప్పటికే పింఛన్ పది రెట్లు పెంచింది. మళ్లీ పెంచుతామని భరోసా ఇచ్చింది. కేసీఆర్ భరోసా పేరిట ఇస్తున్న పథకాలను నమ్ముతున్నరు. మా మ్యానిఫెస్టోను విశ్వసిస్తున్నరు. ప్రజలంతా బీఆర్ఎస్ వైపే ఉన్నారు.
కోరుకంటి: నేను మీ బిడ్డను. 24 గంటలు నియోజకవర్గాన్ని పట్టుకొనే ఉన్న.. ఉంట. ప్రజలు చైతన్యవంతులు, ఉద్యమ నేత కేసీఆర్ ఇచ్చిన ఒక్క పిలుపునకు ఇల్లిల్లూ కదిలి తెలంగాణ కోసం ఉద్యమంలో ఏ విధంగా పాల్గొన్నారో.. అదే స్పూర్తితో ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్కు ప్రజలు ఓటు వేయాలి. పదేండ్లకు ముందున్న తెలంగాణ. రామగుండాన్ని ప్రత్యక్షంగా చూశారు. నగరాభివృద్ధికి పునాదులు పడి పరుగులు తీస్తున్నది. ఏ చిన్న తప్పిదం జరిగినా అది అభివృద్ధికి నిరోధమైతది. కాంగ్రెస్ దేశాన్ని రాష్ర్టాన్ని మన ప్రాంతాన్ని వెనక్కి నెట్టింది. వారి పాలనలో బొగ్గుబావులు మూత పడ్డయి. ఉద్యమ కారుడిని గెలిపిస్తారా..? ఉద్య మ ద్రోహిని గెలిపించుకుంటరో..? మీరే ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి.