కల్యాణలక్ష్మి, షాదీముబారక్తో భరోసా
ఎమ్మెల్యే దాసరి మనోహర్రెడ్డి
రాష్ట్రంలో 10లక్షల మందికి సాయం అందిన సందర్భంగా పెద్దపల్లిలో ర్యాలీ
పెద్దపల్లి జంక్షన్, ఫిబ్రవరి 8: పేద కుటుంబాలకు సీఎం కేసీఆర్ అభయమిస్తున్నారని, కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్తో ఆడబిడ్డల వివాహాలకు భరోసా కల్పిస్తున్నారని ఎమ్మెల్యే దాసరి మనోహర్రెడ్డి పేర్కొన్నారు. రాష్ట్రంలో కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకం కింద పది లక్షల మందికి లబ్ధి కలిగిన సందర్భంగా మంగళవారం జిల్లా కేంద్రం లో టీఆర్ఎస్ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ తీశారు. ఈ పథకంతో ఆడబిడ్డల తల్లిదండ్రులు ఏ రంది లేకుండా ఉన్నారని, బాల్య వివాహాలు పూర్తిగా నియంత్రించబడ్డాయని చెప్పారు. దేశంలో మరెక్కడా లేని గొప్ప పథకమని కీర్తించారు. గొప్ప ఆలోచనలతో మహిళాసాధికరతకు కృషి చేస్తున్న సీఎం కేసీఆర్కు పెద్దపల్లి నియోజకవర్గ ప్రజల తరపున ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ర్యాలీలో మున్సిపల్ చైర్ పర్సన్ దాసరి మమతా ప్రశాంత్రెడ్డి, వైస్ చైర్ పర్సన్ నాజ్మీన్ సుల్తానా మొబిన్, టీఆర్ఎస్ పట్టణాధ్యక్షుడు ఉప్పు రాజ్కుమార్, కౌన్సిలర్లు ఎరుకల కల్పన రమేశ్, గాదె మాధవి, పూదరి చంద్రశేఖర్, పైడ పద్మ రవి, టీఆర్ఎస్ నాయకులు వెన్నం రవి, శ్రీధర్, మున్సిపల్, మెప్మా సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.