సిరిసిల్ల :ఫ్యాషన్ డిజైన్ రంగంలో రాణించాలనుకునే వారికి శిక్షణ ఇవ్వనున్నట్లు మల్కాజిగిరి నియోజకవర్గ టిఆర్ఎస్ పార్టీ ఇంచార్జీ రాజశేఖర్రెడ్డి వెల్లడించారు. బుధవారం సిరిసిల్ల మండలం తంగళ్ళపల్లి మండలం మండెపల్లి ప్రభుత్వ ఐటిఐలో కాలేజ్ లో నూతన యంత్రాలతో కూడిన సెంటర్ను ఏర్పాటు చేయటం సంతోషంగా ఉందన్నారు. చేనేత కార్మికులు ఫ్యాషన్ డిజైన్ రంగంలో రాణించాలంటే తప్పనిసరిగా శిక్షణ తీసుకోవాలన్నారు.
సరికొత్త డిజైన్లను కంప్యూటర్ ద్వారా డిజైన్ చేసి కంప్యూటరైజ్డ్ ఫ్యాషన్స్ తో గ్లోబల్ మార్కెట్లో పోటిపడే విధంగా తీర్చిద్దిదడమే ద్యేయమన్నారు. తన పై నమ్మకం ఉంచి ఈ అవకాశం ఇచ్చిన మంత్రి కేటిఆర్కు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ మానసరాజు, సర్పంచ్ గణప శివజ్యోతి, ఏఎంసీ వైస్ చైర్మన్ రవీందర్రెడ్డి, సర్పంచుల ఫోరం అధ్యక్షుడు వేణుగదోపాల్రావు, ఎంపీటీసీ స్వప్నలింగం, కళాశాల ప్రిన్సిపాల్ కనకయ్య, టిఆర్ఎస్ మండలాధ్యాక్షుడు రాజన్న, గుగ్గిళ్ల అంజనైయులు, బైరి రమేశ్, చిలువేరి నర్సయ్య, గణప మదన్ తదితరులు ఉన్నారు.