గంగాధర, జనవరి 14: మధురానగర్లోని కోదండ సీతారామచంద్రస్వామి ఆలయంలో శనివారం గోదారంగనాయకుల కల్యాణాన్ని కనుల పండువగా నిర్వహించారు. ప్రత్యేకంగా అలంకరించిన వేదికపై స్వామి వారి ఉత్సవమూర్తులను ప్రతిష్ఠించగా, ఆలయ అర్చకులు పవన్కుమార్ ఆచార్యులు, విష్ణు భగవత్ ఆచార్యులు ఆధ్వర్యంలో కల్యాణం జరిపించారు. భక్తులు స్వామి వారి కల్యాణాన్ని తిలకించి మొక్కులు చెల్లించుకున్నారు. కార్యక్రమంలో సర్పంచ్ వేముల లావణ్య, ఆలయ కమిటీ అధ్యక్షుడు వొడ్నాల రాజిరెడ్డి, సింగిల్ విండో వైస్ చైర్మన్ వేముల భాస్కర్, నాయకుడు పెంచాల చందు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.
రామడుగు, జనవరి 14: గోపాల్రావుపేటలోని శ్రీ వేంకటేశ్వరస్వామి, శ్రీ సీతారామచంద్ర స్వామి ఆలయంలో శనివారం గోదారంగనాయకుల కల్యాణం కనుల పండువగా నిర్వహించారు. ఈ వేడుకల్లో ఆలయ కమిటీ చైర్మన్లు నార్ల రమేశ్, కర్యాద హన్మంతరెడ్డి, భక్తులు దొనపాటి రాజమణెమ్మ, సీతారాంరెడ్డి, బత్తిని మల్లేశంగౌడ్, కాసారపు బుచ్చిరాములుగౌడ్, రావుల రాజయ్య, దేవయ్య, బోగ పోచమల్లు, బత్తిని రమేశ్, గాలిపెల్లి వెంకటేశ్వర్లు, సంతోష్, కొలిపాక రాజేశం, ఆలయ అర్చకులు, గ్రామస్తులు పాల్గొన్నారు.
కరీంనగర్ రూరల్, జనవరి 14: చెర్లభూత్కూర్ చెన్నకేశవాలయంలో అర్చకులు కమలాకరాచార్యులు, సుధాకరాచార్యులు, శ్రీనివాసాచార్యులు ఆధ్వర్యంలో గోదారంగనాయకుల కల్యాణం జరిపించారు. ఆలయంలో భక్తులు ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం భక్తులకు తీర్థ ప్రసాద వితరణ చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ నిర్వాహకులు, భక్తులు పాల్గొన్నారు. అలాగే, నగరంలోని తీగలగుట్టపల్లి కోదండ రామాలయంలో గోదారంగనాయకుల కల్యాణాన్ని అర్చకుడు శ్రీనివాస శర్మ ఆధ్వర్యంలో వైభవంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో కార్పొరేటర్ కాశెట్టి లావణ్య, ఆర్బీఎస్ కరీంనగర్ రూరల్ మండల కన్వీనర్ కాశెట్టి శ్రీనివాస్, రాజిరెడ్డి, దామోదర్, సాగర్, మూల రవీందర్రెడ్డి, ప్రభాకర్, రాజయ్య, భక్తులు పాల్గొన్నారు.