రాజన్నసిరిసిల్ల, నమస్తేతెలంగాణ, జగిత్యాల రూరల్/గోదావరిఖని/ కరీంనగర్ కార్పొరేషన్, జనవరి 28: ఉమ్మ డి కరీంనగర్లోని వివిధ జిల్లాల టీఆర్ఎస్ కొత్త సారథుల కు శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. రాజన్నసిరిసిల్ల జిల్లా పార్టీ అధ్యక్షుడు తోట ఆగయ్య శుక్రవారం ప్రగతిభవన్లో పార్టీ అధినేత కేసీఆర్ను కలిశారు. ఈ సందర్భంగా వారు ఆయనకు శాలువా కప్పి అభినందించారు. కాగా తనపై నమ్మకం తో బాధ్యతలు అప్పగించిన కేసీఆర్, కేటీఆర్కు ఆగయ్య కృతజ్ఞతలు తెలిపారు. జడ్పీ చైర్పర్సన్ న్యాలకొండ అరుణ మంత్రి కేటీఆర్ను కలిసి జిల్లాలోని పలు అభివృద్ధి పనుల గురించి వివరించారు. అంతకుముందు ముఖ్యమంత్రి కేసీఆర్ను కలిసి శ్రీరాజరాజేశ్వర స్వామి చిత్రపటాన్ని అందజేశారు. ఇక్కడ న్యాఫ్స్కాబ్ చైర్మన్ కొండూరి రవీందర్రా వు, టీఆర్ఎస్ రాష్ట్ర సహాయ కార్యదర్శి గూడూరి ప్రవీణ్, జడ్పీ వైస్ చైర్మన్ సిద్ధం వేణు, ఆర్బీఎస్ ముస్తాబాద్ మం డల కోఆర్డినేటర్ కల్వకుంట్ల గోపాల్రావు, న్యాలకొండ రాఘవరెడ్డి ఉన్నారు.
అలాగే జగిత్యాల జిల్లా టీఆర్ఎస్ అధ్యక్షుడు కల్వకుంట్ల విద్యాసాగర్రావు ఎమ్మెల్సీ కవితను, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ను జగిత్యా ల ఎమ్మెల్యే సంజయ్ కలిశారు. ఈ సందర్భంగా వారిని అభినందించారు. పెద్దపల్లి జిల్లా టీఆర్ఎస్ అధ్యక్షుడు కోరుకంటి చందర్ హైదరాబాద్లో మంత్రి కేటీఆర్ను కలిసి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా కేటీఆర్ను కోరుకం టి అభినందించారు. కరీంనగర్ జిల్లా టీఆర్ఎస్ అధ్యక్షుడు మంత్రి గంగుల కమలాకర్తో కలిసి హైదరాబాద్లో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ను కలిశారు. పుష్పగుచ్ఛం అందజేసి కృతజ్ఞతలు తెలిపారు. ఆయన వెంట ఎమ్మెల్యేలు వొడితల సతీశ్కుమార్, సుంకె రవిశంకర్, ఎమ్మెల్సీ కౌశిక్రెడ్డి తదితరులు ఉన్నారు.