సిరిసిల్ల టౌన్, జనవరి 24: గట్టిగా అరుస్తూ అబద్ధాలను పదే పదే చెబితే నిజం కాబోదు. ఎంపీ బండి సంజయ్.. తొండి మాటలు మానుకోవాలనీ టీఆర్ఎస్వై సిరిసిల్ల పట్టణాధ్యక్షుడు సుంకపాక మనోజ్ కుమార్ హితవు చెప్పారు. సిరిసిల్లలో సోమవారం విలేకరులతో మాట్లాడారు. సిరిసిల్ల నేతన్నల కోసం మంత్రి కేటీఆర్ చేసిందేమీ లేదంటూ ఎంపీ మతిభ్రమించి మాట్లాడుతున్నాడని ధ్వజమెత్తారు. సమైక్య పాలనలో చితికిన నేతన్నల బతుకుల్లో వెలుగులు నింపిన మహోన్నత నేత కేటీఆర్ అని కొనియాడారు. పద్మనగర్, బీవైనగర్, సుందరయ్యనగర్, గణేశ్నగర్, తారకరామానగర్ లాంటి ప్రాంతాల్లో పర్యటిస్తే కార్మికులే సంజయ్కు సరైన సమాధానం చెబుతారన్నారు. చంద్రబాబు హయాంలో టెక్స్టైల్ పార్కు మంజూరైంది, విద్యాసాగర్ రావు వచ్చి కొబ్బరికాయలు కొట్టిండు, అద్వానీ వచ్చి పూజలు చేసిండంటే సరిపోదని.. ఎంపీగా కేంద్రం నుంచి ఎన్ని నిధులు తెచ్చారో చెప్పాలని ప్రశ్నించారు. ఆయనకు చేతనైతే మొదట కరీంనగర్ అభివృద్ధికి నిధులు తేవాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో గడ్డం కిరణ్, సిఖిందర్, శ్రీని వాస్రావు, శ్రీధర్, సురేశ్, ఎస్కే బాబా తదితరులు పాల్గొన్నారు.