సిరిసిల్ల టౌన్, నవంబర్ 28: చేనేత రంగంపై విధించిన జీఎస్టీ పన్నును కేంద్రం వెంటనే ఎత్తివేయాలని టీ(బీ)ఆర్ఎస్ కార్మిక విభాగం జిల్లా అధ్యక్షుడు వెంగళ శ్రీనివాస్ డిమాండ్ చేశారు. జీ-20లోగోను చేనేత వస్త్రంపై తయారుచేసిన చేనేత కళాకారుడు వెల్ది హరిప్రసాద్ను సోమవారం ఆయన నివాసంలో వెంగళ శ్రీనివాస్తోపాటు కేడీసీసీబీ డైరెక్టర్ వీరబత్తిని కమలాకర్ సన్మానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడు తూ, చేనేత కళా నైపుణ్యం కలిగిన కళాకారుల ఆర్థిక ఎదుగుదలకు కేంద్రం తోడ్పడాలని కోరారు. తద్వారా వారిలోని నైపు ణ్యం మరింత మెరుగుపడుతుందని ఆకాంక్షించారు. రాష్ట్ర ప్రభుత్వం నేతన్నకు చేయూతతో పాటు అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నదని తెలిపారు.
చేనేత రంగంపై జీఎస్టీ భారం
కేంద్రం చేనేతపై విధిస్తున్న జీఎస్టీ చేనేత రంగానికి మోయలేని భారంగా మారుతున్నదని టీ(బీ)ఆర్ఎస్ యువజన విభా గం పట్టణాధ్యక్షుడు సుంకపాక మనోజ్కుమార్ అన్నారు. సోమవారం జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. మన్ కీ బాత్ నిర్వహించడం కాదు.. జనాల్లోకి వచ్చి వారి సమస్యలు తెలుసుకొని పరిష్కారం చూపాలని హితవుపలికారు. బీజేపీ పాలనలో దేశం అభివృద్ధిలో మరింత వెనుకబడిపోయిందన్నారు. ఇక్కడ మునీర్, కత్తెర వరుణ్, ఫిరోజ్, పంగ సురేశ్, అజయ్గౌడ్, తదితరులు ఉన్నారు.