క్లోరినేషన్ చేసిన నీటినే సరఫరా చేయాలి
ప్రతి రోజూ వార్డులను సందర్శించాలి
కలెక్టర్ శశాంక ఆదేశం
మున్సిపల్ కమిషనర్లతో సమీక్షా సమావేశం
కార్పొరేషన్, ఏప్రిల్ 17: జిల్లాలోని అన్ని మున్సిపాలిటీల పరిధిలో వేసవిలో ప్రజలు తాగునీటికి ఇబ్బందులు పడకుండా తగిన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ శశాంక మున్సిపల్ కమిషనర్లను ఆదేశించారు. శనివారం కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో వేసవిలో తాగునీటి సరఫరా, సమీకృత మారెట్ల నిర్మాణం, పబ్లిక్ టాయిలెట్లు, హరితహారంలో నాటిన మొకలు, నర్సరీల సంరక్షణ, పారిశుధ్య చర్యలపై మున్సిపల్ కమిషనర్లతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, వేసవిలో నీటి వినియోగం ఎకువగా ఉంటుందని, ప్రతి రోజూ 5-10 నిమిషాల పాటు అదనంగా నీటి సరఫరా చేయాలని సూచించారు. క్లోరినేషన్ చేసిన తాగునీటిని మాత్రమే సరఫరా చేయాలన్నారు. అలాగే క్వాలిటీ పరీక్షలు తప్పనిసరని చెప్పారు. మున్సిపల్ పరిధిలో చివరగా ఉన్న ఇండ్లకు తాగునీరు సరిగా సరఫరా అయ్యేలా చూడాలన్నారు. పట్టణాల్లో పైపులైన్ల లీకేజీలుంటే వెంటనే అరికట్టాలని చెప్పారు. వేసవి దృష్ట్యా మున్సిపాలిటీల్లో బోర్వెల్స్కు మరమ్మతులు చేయించాలన్నారు. హుజూరాబాద్ పట్టణంలో మిషన్ భగీరథ పథకం పనులను ఈ నెలాఖరులోగా పూర్తి చేసి మేలో పూర్తి స్థాయిలో తాగునీరు అందించాలని ఆదేశించారు. మున్సిపాలిటీల్లో తాగునీరు అందడం లేదనే ఫిర్యాదులు రావద్దన్నారు. నల్లా కనెక్షన్లపై ప్రత్యేక డ్రైవ్ నిర్వహించి దరఖాస్తు చేసుకున్న వారందరికీ కనెక్షన్ ఇవ్వాలన్నారు. జిల్లాలో కొవిడ్ ఉధృతంగా ఉన్నందున ప్రత్యేక పారిశుధ్య చర్యలు చేపట్టాలన్నారు.
అభివృద్ధి పనులను తనిఖీ చేయాలి
మున్సిపల్ కమిషనర్లు ప్రతిరోజూ ఉదయం వార్డులను సందర్శించాలని, పారిశుధ్య, తాగునీటి సరఫరా, అభివృద్ధి పనులను తనిఖీ చేయాలని కలెక్టర్ పేర్కొన్నారు. తనిఖీల ఫొటోలను ఉదయం 8 గంటల్లోపు వాట్సాప్ ద్వారా పంపించాలని ఆదేశించారు. మున్సిపాలిటీలకు మంజూరైన పబ్లిక్ టాయిలెట్లను త్వరగా పూర్తి చేసి ప్రారంభించాలని, వాటికి బిల్లులు చెల్లించాలని చెప్పారు. మున్సిపాలిటీలకు గ్రీన్ప్లాన్లో భాగంగా అవసరమైన మొకలను గ్రామీణాభివృద్ధి, అటవీశాఖల నర్సరీల నుంచి తెప్పించుకొని నర్సరీల్లో పెంచాలని పేర్కొన్నారు. హరితహారం కార్యక్రమంలో నాటిన మొకలు కనీసం 85 శాతం రక్షించాలని, లేకుంటే చర్యలు తప్పవన్నారు. మున్సిపాలిటీల్లో పనిచేసే సిబ్బంది, వర్కర్లు వ్యాక్సిన్ తీసుకోవాలన్నారు. మున్సిపాలిటీల్లో పనిచేసే ఔట్సోర్సింగ్, కాంట్రాక్ట్ సిబ్బందికి జీతాలు నెలనెలా చెల్లించాలని చెప్పారు. వైకుంఠధామాలు, సెగ్రిగేషన్ షెడ్ల నిర్మాణ పనులను మున్సిపల్ కమిషనర్లు ఎప్పటికప్పుడు తనిఖీ చేసి వేగంగా పూర్తి చేయించాలన్నారు. సమావేశంలో అదనపు కలెక్టర్ శ్యాంప్రసాద్లాల్, నగరపాలక సంస్థ కమిషనర్ క్రాంతి, హుజూరాబాద్, జమ్మికుంట, చొప్పదండి, కొత్తపల్లి మున్సిపల్ కమిషనర్లు ప్రసన్న రాణి, రషీద్, అంజయ్య, వేణుమాధవ్, ఎస్సారెస్పీ ఈఈ నాగభూషణం, మున్సిపల్ ఏఈలు, తదితరులు పాల్గొన్నారు.