అభాగ్యులకు అండగా నిలుస్తున్న రాష్ట్ర ప్రభుత్వం
ఎమ్మెల్యే సుంకె రవిశంకర్
లబ్ధిదారులకు చెక్కుల పంపిణీ
రామడుగు, ఏప్రిల్ 3: ముఖ్యమంత్రి సహాయనిధి నిరుపేదలకు వరంలాంటిదని ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ పేర్కొన్నారు. మండలంలోని 71 మందికి సీఎంఆర్ఎఫ్ కింద ఆర్థిక సాయం మంజూరైంది. రామడుగు మండల పరిషత్ కార్యాలయంలో శనివారం ఆయన లబ్ధిదారులకు రూ. 16 లక్షల 93 వేల విలువైన చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం అభాగ్యులకు అండగా ఉంటూ, ఆపద సమయంలో సీఎంఆర్ఎఫ్ ద్వారా ఆదుకుంటున్నట్లు పేర్కొన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో ముఖ్యమంత్రి సహాయనిధి అందని ద్రాక్షలా ఉండేదన్నారు. సీఎం కేసీఆర్ మానవతా దృక్పథంతో సీఎంఆర్ఎఫ్కు దరఖాస్తు చేసుకున్న ప్రతి ఒక్కరికీ ఆర్థిక సాయం మంజూరు చేస్తున్నట్లు తెలిపారు. నియోజకవర్గంలో అనేక మంది సీఎంఆర్ఎఫ్ ద్వారా లబ్ధి పొందినట్లు పేర్కొన్నారు. బాధితులకు ఎల్వోసీ కూడా ఇప్పించినట్లు తెలిపారు. అనారోగ్యం, ప్రమాదాల బారిన పడి దవాఖానల్లో చికిత్స పొందిన నియోజకవర్గ ప్రజలు సీఎంఆర్ఎఫ్కు దరఖాస్తు చేసుకోవాలని కోరారు. ఎంపీపీ కలిగేటి కవిత, మార్కెట్ కమిటీ చైర్మన్ గంట్ల వెంకటరెడ్డి, కొండగట్టు దేవస్థానం డైరెక్టర్ దాసరి రాజేందర్రెడ్డి, మాజీ ఎంపీపీ మార్కొండ కిష్టారెడ్డి, ఎంపీటీసీల ఫోరం మండలాధ్యక్షుడు ఎడవెల్లి నరేందర్రెడ్డి, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు గంట్ల జితేందర్రెడ్డి, ఏఎంసీ డైరెక్టర్ పైండ్ల శ్రీనివాస్, ఎంపీటీసీలు వంచ మహేందర్రెడ్డి, మడ్డి శ్యాంసుందర్గౌడ్, నాయకులు కలిగేటి లక్ష్మణ్, తౌటు మురళి, పంజాల జగన్మోహన్గౌడ్, వీర్ల రవీందర్రావు, గునుకొండ అశోక్, పూడూరి మల్లేశం, గుండి ప్రవీణ్, అర్జున్, మునీందర్, రాజేశం తదితరులు పాల్గొన్నారు.
ఇవి కూడా చూడండి..
డీఎంకే ఎంపీ కనిమొళి కి కరోనా పాజిటివ్
కరోనా ఎఫెక్ట్: వారంపాటు ప్రార్థనా స్థలాలు బంద్