ధర్మపురి, ఏప్రిల్ 1: ధర్మపురి శ్రీలక్ష్మీనర్సింహస్వామి బ్రహ్మోత్సవాలు వైభవంగా సాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా గురువారం ఉద యం యజ్ఞాచార్యులు కందాళై పురుషోత్తమాచార్యుల ఆధ్వర్యంలో హోమాది కార్యక్రమాలు నిర్వహించారు. శ్రీ వేంకటేశ్వర స్వామి వారి ఉత్తర, దక్షిణ దిగ్యాత్రల ఘట్టాన్ని పండితులు కొవిడ్ నిబంధనల మేరకు ఆలయ ప్రాంగణంలోనే ని ర్వహించారు. దిగ్యాత్రలో భాగంగా శ్రీ వేంకటేశ్వరస్వామివారి ఉత్సవమూర్తులను ఆశ్వవాహనంపై ఉంచి ఆలయ ప్రాంగణంలోనే పూజలు నిర్వహించారు. పూజా కార్యక్రమంలో ఈవో సంకటాల శ్రీనివాస్, డీసీఎమ్మెస్ చైర్మన్ ఎల్లాల శ్రీకాంత్రెడ్డి, దేవస్థానం సూపరింటెండెంట్ ద్యావళ్ల కిరణ్కుమార్, సీనియర్ అసిస్టెంట్ శ్రీనివాస్, నాయకులు శేఖర్, దేవస్థాన సిబ్బంది ఉన్నారు.