60 లక్షల సభ్యత్వం కల్గిన ఏకైక పార్టీ
ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య
గోదావరిఖని/మంథని టౌన్, జూలై 18: దేశంలో 60 లక్షల సభ్యత్వం కలిగిన ఏకైక ప్రాంతీయ రాజకీయ పార్టీ టీఆర్ఎస్ అని, సీఎం కేసీఆర్ నాయకత్వంలో పార్టీ తిరుగులేని రాజకీయ శక్తిగా ఆవిర్భవించిందని ఎమ్మెల్సీ బస్వరాజ్ సారయ్య స్పష్టం చేశారు. ఆదివారం గోదావరిఖని క్యాంపు కార్యాలయంలో సభ్యత్వ నమోదు ముగింపునకు జిల్లా పార్టీ ఇన్చార్జి లోక బాపురెడ్డి, ఎమ్మెల్యే చందర్తో కలిసి హాజరయ్యారు. అనంతరం మంథనిలోని టీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో నియోజకవర్గ స్థాయి పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని జడ్పీ చైర్మన్ పుట్ట మధూకర్తో కలిసి నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయా చోట్ల బస్వరాజ్ సారయ్య మాట్లాడుతూ.. తెలంగాణ ఏర్పడిన తర్వాత ఏ రాష్ట్రంలో లేనివిధంగా ప్రజా సంక్షేమ, అభివృద్ధి పథకాలు ప్రవేశపెట్టి దేశానికే ఆదర్శవంత పాలన కేసీఆర్ అందిస్తున్నారని వివరించారు. దేశంలోనే టీఆర్ఎస్ మాత్రమే కార్యకర్తలకు ప్రమాద బీమా అందిస్తున్నదని చెప్పారు. బీజేపీ, కాంగ్రెస్ చేస్తున్న ఆరోపణలు తిప్పికొట్టాలన్నారు. పట్టుదల, కార్యదీక్ష కలిగిన ఎమ్మెల్యే చందర్ ఉండడం ఇక్కడి ప్రజల అదృష్టమన్నారు.
బలమైన రాజకీయ శక్తి : కోరుకంటి చందర్
రాష్ట్రంలో బలమైన రాజకీయ శక్తి టీఆర్ఎస్ అని రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రజలందరికీ అండ గులాబీ జెండాయేనని స్పష్టం చేశారు. గోదావరిఖని 13వ డివిజన్కు చెందిన టీఆర్ఎస్ కార్యకర్త పిల్లి శ్రీనివాస్ ప్రమాదంలో మృతి చెందితే వారి కుటుంబానికి పార్టీ పక్షాన రూ. రెండు లక్షల ప్రమాద బీమా చెక్కును అందించి వారి కుటుంబానికి అండగా నిలిచామని పేర్కొన్నారు.
కార్యకర్తలకు అండ
మంథనిలో జడ్పీ చైర్మన్ పుట్ట మధూకర్ మాట్లాడుతూ టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు ఎల్లప్పుడూ అండగా ఉంటుందని స్పష్టం చేశారు. టీఆర్ఎస్ ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ, అభివృద్ధి పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు కార్యకర్తలంతా కృషి చేయాలని పిలుపునిచ్చారు. టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల కష్ట సుఖాల్లో పాలు పంచుకుంటూ ఎల్లప్పుడూ అండగా ఉంటుందన్నారు. నియోజకవర్గంలోని అన్ని మండలాల్లో అధిక సంఖ్యలో పార్టీ సభ్యత్వం నమోదు చేయాలని సూచించారు. అనంతరం బస్వరాజు సారయ్య, లోక బాపురెడ్డిని పుట్ట మధూకర్ శాలువాలతో సన్మానించారు. కార్యక్రమాల్లో రామగుండం మేయర్ అనిల్కుమార్, డిప్యూటీ మేయర్ అభిషేక్ రావు, మాజీ మేయర్ కొంకటి లక్ష్మీనారాయణ, కార్పొరేటర్లు ధాతు శ్రీనివాస్, సాగంటి శంకర్, పెంట రాజేశ్, అడ్డాల గట్టయ్య, భాస్కర్, రమణారెడ్డి, రాజ్కుమార్, కృష్ణవేణి, అంజలి, అమృతమ్మ, జెట్టి జ్యోతి, కవిత సరోజని, ఎంపీటీసీ కొలిపాక శరణ్య, సర్పంచ్ లక్ష్మీపతి, నాయకులు మూల విజయారెడ్డి, పాతపెల్లి ఎల్లయ్య, పీటీ స్వామి, తోడేటి శంకర్, బొడ్డు రవీందర్, తానిపర్తి గోపాల్రావు, సలీం బేగ్, జహీద్పాషా, ఐలి శ్రీనివాస్, ధరణి జలపతి, రాకం వేణు, బొడ్డుపల్లి శ్రీనివాస్, జేవీ రాజు, మారుతి, నూతి తిరుపతి, దేవరాజ్, అచ్చ వేణు, మండ రమేశ్, మేకల పోశం, తోకల రమేశ్, గోలివాడ ప్రసన్నకుమార్, నీరటి శ్రీనివాస్, చిలుముల విజయ్కుమార్, మంథని ఎంపీపీ కొండ శంకర్, టీఆర్ఎస్ నాయకులు జక్కు రాకేశ్, ఏగోలపు శంకర్గౌడ్, ఎక్కటి అనంతరెడ్డి, ఆకుల కిరణ్, శ్రీరాంభట్ల శ్రీనివాస్, పూదరి సత్యనారాయణగౌడ్, గోనె శ్రీనివాస్రావు, బత్తుల సత్యనారాయణ, వీకే రవి తదితరులు పాల్గొన్నారు.