నేడు 75వ స్వాతంత్య్ర దినోత్సవం
జాతీయ జెండాను ఆవిష్కరించనున్న అమాత్యులు
సిరిసిల్లలో కేటీఆర్, జగిత్యాలలో కొప్పుల
పెద్దపల్లిలో ప్రభుత్వ ముఖ్య సలహాదారు రాజీవ్ శర్మ
రాజన్నసిరిసిల్ల/పెద్దపల్లి/జగిత్యాల, ఆగస్టు 14(నమస్తే తెలంగాణ);నేటి 75వ స్వాతంత్య్ర దినోత్సవానికి సర్వం సిద్ధమైంది. ఇప్పటికే మూడు జిల్లాల్లో వేడుకలకు అధికారులు ఏర్పాట్లు పూర్తిచేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లాకేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో, జగిత్యాల జిల్లాలో ఖిల్లాలో, పెద్దపల్లి జిల్లా కలెక్టరేట్లో వేడుకలు నిర్వహించనున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్, జగిత్యాల జిల్లాలో రాష్ట్ర మంత్రి కొప్పుల ఈశ్వర్, పెద్దపల్లి జిల్లాలో ప్రభుత్వ ముఖ్య సలహాదారు రాజీవ్ శర్మ ముఖ్య అతిథులుగా హాజరై జాతీయ జెండాను ఆవిష్కరించనున్నారు.
పంద్రాగస్టు వేడుకలకు ఉమ్మడి జిల్లా ముస్తాబైంది. రాజన్న సి రిసిల్ల జిల్లా, జగిత్యాల, పెద్దపల్లిలో వేడుకలకు అ ధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో వేడుకలకు ముఖ్య అతిథిగా మంత్రి కేటీఆర్, జగిత్యాల జిల్లాలో మంత్రి కొప్పుల ఈశ్వర్, పెద్దపల్లి జిల్లాలో ప్రభుత్వ ముఖ్య సలహాదారు రా జీవ్శర్మ హాజరై జెండాను ఆవిష్కరించనున్నారు.
రాజన్న సిరిసిల్ల జిల్లాలో..
జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో ఆదివారం జరిగే పురపాలక, పట్టణాభివృద్ధి, పరిశ్రమల శాఖల మంత్రి కల్వకుంట్ల తారకరామారావు ముఖ్యఅతిథిగా హాజరు కానున్నారు. ఉదయం 10.30 గంటలకు జాతీ య పతాకాన్ని ఆవిష్కరించి, పోలీసులతో గౌరవ వందనం స్వీకరిస్తారు. 11.00 గంటలకు వివిధ శాఖల్లో సేవలందించిన అధికారులకు ప్రశంసా పత్రాలు అందజేస్తారు. 11.20కి సాంస్కృతిక కార్యక్రమాలు, అనంతరం మహిళా సంఘాలకు రూ. 50 కోట్ల రుణాలను పంపిణీ చేస్తారు. వివిధ శాఖలకు సంబందించి స్టాళ్లు ఏర్పాటు చేస్తున్నారు. అతిథులు, ప్రజాప్రతినిధులు, అధికారుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు.
జగిత్యాల జిల్లాలో..
జిల్లాకేంద్రంలోని ఖిలాలో వేడుకలను నిర్వహించనున్నారు. మంత్రి కొప్పుల ఈశ్వర్ ముఖ్య అతిథిగా హాజరై జాతీయ పతాకాన్ని ఆవిష్కరించనున్నారు. ఉదయం 10.30నుంచి 10.35 గంట ల వరకు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించనున్నా రు. 10.35 నుంచి 10.40వరకు పోలీస్ పరేడ్, పోలీసుల గౌరవ వందనాన్ని స్వీకరిస్తారు. 10.40 నుంచి 10.55 వరకు మంత్రి కొప్పుల ఈశ్వర్ సందేశాన్ని ఇవ్వనున్నారు. 10.55 నుంచి 11 గంటల వరకు స్వాతంత్య్ర సమరయోధులకు సత్కారం, 11నుంచి 11.30 వరకు సాంస్కృతిక కార్యక్రమాలు, 11.30 నుంచి 12 గంటల వరకు వివిధ రంగాల్లో కృషి చేసిన వారికి ప్రశంసా పత్రాల ప్రదానం ఉంటుంది. అనంతరం 12నుంచి 12.15 వరకు వివిధ శాఖల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన స్టాల్స్ పరిశీలన, లబ్ధిదారులకు ఆస్తుల పంపిణీ, 12.15కు వందన సమర్పనతో వేడుకలు ముగియనున్నాయి. ఈ సందర్భంగా ఖిలాలో ఏర్పాట్లన్నీ పూర్తిచేశారు. అతిథు లు, వీఐపీలు, ప్రజల కోసం ప్రత్యేకంగా ఏర్పాట్లు చేశారు. ఖిలాలో జరుగుతున్న ఏర్పాట్లను జగిత్యాల మున్సిపల్ చైర్పర్సన్ బోగ శ్రావణి శనివారం పరిశీలించారు. పోలీసులు పరేడ్ రిహార్సల్స్ను ఇదివరకే పరిశీలించిన అడ్మిన్ ఎస్పీ సురేశ్కుమార్ బందోబస్తు చర్యలపై పోలీసు సిబ్బందికి దిశానిర్దేశం చేశారు.
పెద్దపల్లి జిల్లాలో..
75వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను నిరాడంబరంగా నిర్వహించేందుకు జిల్లా ఇన్చార్జి కలెక్టర్ డాక్టర్ సర్వే సంగీత సత్యనారాయణ, అదనపు కలెక్టర్లు లక్ష్మీనారాయణ, కుమార్ దీపక్ ఆధ్వర్యంలో ఏర్పాట్లు పూర్తి చేశారు. రాష్ట్ర ప్రభుత్వ ముఖ్య సలహాదారు రాజీవ్శర్మ వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరై జాతీయ జెండాను ఆవిష్కరించనున్నారు. ఉదయం 10.25 నుంచి 10.32వరకు జాతీయ పతాక ఆవిష్కరణ చేస్తారు. 10.32 నుంచి 10.40 వరకు పోలీసు గౌరవ వందనాన్ని స్వీకరిస్తున్నారు. 10.40నుంచి 10.45 వరకు ప్రభుత్వ ముఖ్య సలహాదారు రాజీవ్శర్మ సందేశం ఇస్తారు. 10.45నుంచి 11 వరకు ఉత్తమ సేవలందించిన జిల్లాలోని అధికారులకు ప్రశంసా పత్రాలను పంపిణీ చేస్తారు. ఈ వేడుకల్లో జిల్లా పరిషత్ చైర్మన్ పుట్ట మధూకర్తో పాటుగా పార్లమెంటు సభ్యులు బోర్లకుంట వెంకటేశ్ నేత, జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలతో పాటు ఎమ్మెల్సీలు, వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు, ప్రజాప్రతినిధులు హాజరుకానున్నారు.