తిమ్మాపూర్, ఫిబ్రవరి 17: ఉమ్మడి కరీంనగర్ డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్గా హనుమకొండ జిల్లాలో పని చేస్తున్న పురుషోత్తం నియామకమయ్యారు. కాగా, ఇక్కడ పనిచేస్తున్న మామిండ్ల చంద్రశేఖర్గౌడ్ రంగారెడ్డి జిల్లాకు బదిలీ అయ్యారు. రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్న సాధారణ బదిలీల్లో భాగంగా పలువురు అధికారులను బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
డీటీసీతో పాటు ఎంవీఐ నాగలక్ష్మి కామారెడ్డి జిల్లాకు, శ్రీనివాస్ కోరుట్లకు, ఏఎంవీఐ రజినీ దేవీ సిరిసిల్ల జిల్లాకు ట్రాన్స్ఫర్ అయ్యారు. కరీంనగర్కు ఆదిలాబాద్ నుంచి ఎంవీఐ రవికుమార్, ఆసిఫాబాద్ నుంచి ఎంవీఐ శ్రీకాంత్, హనుమకొండ నుంచి ఏఎంవీఐ స్రవంతి రానున్నారు. వీరంతా సోమవారం బాధ్యతలు చేపట్టే అవకాశమున్నది.