కలెక్టరేట్, డిసెంబర్ 19 : ప్రజావాణి కార్యక్రమానికి వచ్చే అర్జీలు సత్వరమే పరిష్కరించాలని ఇన్చార్జి కలెక్టర్ గరిమా అగర్వాల్ సంబంధిత అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ ఆడిటోరియంలో నిర్వహించిన ప్రజావాణిలో పాల్గొన్న ఆమె జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన వారి సమస్యలు విని, అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, స్థానిక పరిస్థితుల నేపథ్యంలో సుదీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న సమస్యలపై మాత్రమే అర్జీదారులు కలెక్టరేట్కు వస్తారని, వారి ఇబ్బందులు గమనించి వెంటవెంటనే పరిష్కారం చూపాలని అధికారులకు సూచించారు.
జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి 126 మంది వారి సమస్యలపై కలెక్టర్కు దరఖాస్తులు చేయగా, వాటిని పరిశీలించిన ఆమె విభాగాల వారీగా అధికారులకు అందజేశారు. మున్సిపల్ కార్పొరేషన్లో 11, జిల్లా పంచాయతీ కార్యాలయంలో 14, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయంలో 3, పోలీస్ కమిషనరేట్లో 7, డివిజనల్ రెవెన్యూ అధికారి కార్యాలయంలో 5, జిల్లా సంక్షేమ శాఖకు సంబంధించి 5, రూరల్ తహసీల్ కార్యాలయానికి 5, కొత్తపల్లి తహసీల్ కార్యాలయానికి 5, వారధి సొసైటీలో పెండింగ్ సమస్యలపై 9, మిగతా సమస్యలపై 62 దరఖాస్తులు వచ్చినట్లు కలెక్టర్ వెల్లడించారు.
కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ జీవీ శ్యాంప్రసాద్లాల్, శిక్షణ కలెక్టర్ లెనిన్, ఆర్డీవో ఆనంద్కుమార్, మున్సిపల్ కమిషనర్ సేవా ఇస్లావత్, కలెక్టరేట్ ఏవో డా.ఎం నారాయణ పాల్గొన్నారు.