Palakurthi | పాలకుర్తి : శాంతిభద్రతల పరిరక్షణకు ప్రజల సహకారం తప్పనిసరిగా అవసరమని పెద్దపల్లి సీఐ ప్రవీణ్ కుమార్ అన్నారు. పాలకుర్తి మండలంలోని ఘనశ్యామ్ దాస్ నగర్ గ్రామంలో శనివారం పోలీసులు కార్డన్ సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు. ఈ సందర్భంగా సరైనన పత్రాలు లేని 34-మోటార్ సైకిళ్లు, 08 ఆటోలు, ఒక కార్ను పోలీసులు సీజ్ చేశారు.
సమాజంలో నేరాల నియంత్రణకు ప్రజలు పోలీసులకు సహకరించాలి సీఐ కోరారు.. యువత డ్రగ్స్ మాదక ద్రవ్యాలకు బానిసైన బంగారు జీవితం కోల్పోతున్నారని, తల్లిదండ్రులు పిల్లల చెడు అలవాట్లను గమనించి హెచ్చరించాలని సూచించారు. సమాజంలో నేరాల నియంత్రణకు శాంతిభద్రతల పరిరక్షణకు ప్రజల సహకారం ఎంతో కీలకమని పేర్కొన్నారు. ఆన్లైన్ మోసాలు ఎక్కువ శాతం గ్రామాల్లో జరుగుతున్నాయని జాగ్రతగా ఉండాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐలు నూతి శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు.