హుజూరాబాద్ టౌన్, మార్చి 2: పెంచిన గ్యాస్ ధరలు తక్షణమే తగ్గించాలని ఖాళీ సిలిండర్, కట్టెల పొయ్యితో బీఆర్ఎస్ నేతలు నిరసన వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ పార్టీ వరింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు గురువారం హుజూరాబాద్ అంబేదర్ చౌరస్తాలో ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ బండ శ్రీనివాస్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా బండ శ్రీనివాస్ మాట్లాడుతూ, కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ విధానాలతో పేద, మధ్య తరగతి కుటుంబాలపై పెను భారం పడుతున్నదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి ప్రభుత్వాన్ని గద్దెదించడం కోసమే కేసీఆర్ దేశ రాజకీయాల్లోకి వచ్చారని, ప్రజలు ఆయనకు మద్దతుగా నిలువాలని కోరారు. కార్యక్రమంలో హుజూరాబాద్ మున్సిపల్ చైర్పర్సన్ గందె రాధికాశ్రీనివాస్, ఎంపీపీ ఇరుమల్ల రాణీసురేందర్రెడ్డి, హుజూరాబాద్ సింగిల్ విండో చైర్మన్ ఎడవెల్లి కొండల్రెడ్డి, మున్సిపల్ మాజీ చైర్మన్ వడ్లూరి విజయ్కుమార్, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు సంగెం అయిలయ్య, సామాజిక కార్యకర్త, సీనియర్ నాయకుడు వర్దినేని రవీందర్రావు, పార్టీ సోషల్మీడియా నేతలు గొడిశాల పావని, తులసీ లక్ష్మణమూర్తి, కౌన్సిలర్లు మొలుగు సృజనాపూర్ణచందర్, కుమార్యాదవ్, ముత్యంరాజు, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, మహిళలు పాల్గొన్నారు.
సీపీఎం ఆధ్వర్యంలో పీఎం దిష్టిబొమ్మ దహనం
జమ్మికుంట, మార్చి 2: కేంద్ర ప్రభుత్వం పెంచిన గ్యాస్ ధరలను నిరసిస్తూ.. సీపీఎం జమ్మికుంట జోన్కమిటీ ఆధ్వర్యంలో గురువారం స్థానిక తెలంగాణ చౌక్ వద్ద ప్రధాని నరేంద్రమోదీ దిష్టిబొమ్మను దహనం చేశారు. అంతకుముందు సీపీఎం నాయకులు గ్యాస్ సిలిండర్ను రోడ్డుపై పెట్టారు. పూజలు చేసి నిరసన తెలిపారు. ప్లకార్డులు పట్టుకుని కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేక నినాదాలు చేశారు. ఇక్కడ నాయకులు అశోక్, శంకర్, రాములు, రమేశ్, రాజకుమారి, సదానందం, కిశోర్, మొగిలి, శోభన్, కుమార్, రాజు, రమేశ్, సాయి తదితరులున్నారు.