ప్రైవేటుకు దీటుగా సర్కారు దవాఖానలను తీర్చిదిద్దున్న ప్రభుత్వం ప్రసవాల సంఖ్యను పెంచడమే లక్ష్యంగా ముందుకెళ్తున్నది. సర్కారు దవాఖానల్లో మిషన్ 80 పర్సెంట్ పేరుతో ప్రత్యేక పైలెట్ ప్రాజెక్ట్కు శ్రీకారం చుట్టింది. మంత్రి కేటీఆర్ సూచన మేరకు కలెక్టర్ అనురాగ్ జయంతి ఆదేశాల మేరకు రాజన్న సిరిసిల్ల జిల్లాలో యంత్రాంగం పీఆర్వో(పబ్లిక్ రిలేషన్ వ్యవస్థ) వ్యవస్థను ఏర్పాటు చేయనున్నది. ఈ క్రమంలో జిల్లా దవాఖాన, వేములవాడ ఏరియా దవాఖానల్లో 13 మంది పీఆర్వోలు సేవలందించనుండగా, వీరికి మెటర్నిటీ సర్వీస్ ఎగ్జిక్యూటివ్గా నామకరణం చేయనున్నారు. ఈ నెల 10 నుంచి వారం పాటు ట్రయల్ రన్ నిర్వహించి లోటుపాట్లను గుర్తించి 80 శాతం ప్రసవాలు గవర్నమెంట్ హాస్పిటల్స్లో జరిగేలా చర్యలకు ఉపక్రమించింది..
సిరిసిల్ల టౌన్, జూలై 7: స్వరాష్ట్రంలో ముఖ్యమం త్రి కేసీఆర్ ప్రభుత్వం ప్రైవేటుకు దీటుగా ప్రభుత్వ దవాఖానల్లో ఆధునిక వైద్య సేవలను అందుబాటులోకి తెచ్చింది. కార్మికక్షేత్రమైన సిరిసిల్ల జిల్లా కేంద్రంతో పాటు వేములవాడ ఏరియా దవాఖాన, ప్రాథమిక కేంద్రాల్లో పేద ప్రజలకు మెరుగైన వైద్య సేవలను రోగులకు అందిస్తున్నారు. 24గంటల పాటు మల్టీ స్పెషాలిటీ వైద్య సేవలు అందుబాటులో ఉండడంతో నిత్యం ప్రభుత్వ ద వాఖానలకు వచ్చే రోగుల సంఖ్య క్రమంగా పెరుగుతుంది. ప్రసవాల సంఖ్య 42శాతం నుంచి 62 శాతం పైగా పెరిగిందని వైద్యులు చెబుతున్నారు. దీనిని 80శాతం పెంచడమే లక్ష్యంగా ప్రభుత్వ దవాఖానల్లో మిషన్ 80పర్సెంట్ పేరుతో ప్రత్యేక పైలట్ ప్రాజెక్టును ఈ నెల 10నుంచి అమలుచేసేందుకు శ్రీకారం చుడుతున్నారు.
అత్యాధునిక వైద్య పరికరాలు, నిరంతర వైద్య సేవలు సర్కారు వైద్యశాలల్లో అందుబాటులో ఉన్నాయి. అయినప్పటికీ ప్రజలు ప్రైవేట్ వైద్య శాలలను ఆశ్రయిస్తున్నారు. వేలాదిగా ఫీజులు చెల్లిస్తూ అక్కడ వైద్య పరీక్షలు పొందుతున్నారు. దీనికి గల కారణాలపై కలెక్టర్ అనురాగ్జయంతి ప్రత్యేక అధ్యయనం చేసి కారణాలను అన్వేషించారు. ప్రభుత్వ దవాఖానలకు రోగులు వచ్చాక ఎవరినీ సంప్రదించాలో తెలియకపోవడం, వైద్య సిబ్బంది రోగుల పట్ల వ్యవహరించే విధానంలో లోపాలు ఉన్నట్లు గుర్తించారు. ఈ పద్ధతుల్లో కొన్ని మార్పులు రావాల్సి ఉందని మంత్రి కేటీఆర్ మార్గదర్శనం మేరకు ప్రత్యేక పబ్లిక్ రిలేషన్ వ్యవస్థ ఏర్పాటుకు నిర్ణయం తీసుకున్నారు.
ఎంఎస్ఈలుగా సూపర్వైజర్లు..
ప్రభుత్వ ఆసుపత్రులలో ప్రసవాల సంఖ్యను 80శాతానికి పెంచడమే లక్ష్యంగా చేపట్టిన మిషన్ 80 పర్సెంట్లో భాగంగా పీఆర్వో వ్యవస్థ ఏర్పాటుకు శ్రీకారం చుట్టారు. జిల్లాలోని ఆయా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో పనిచేస్తున్న హెల్త్ సూపర్వైజర్లకు పీఆర్వోలుగా బాధ్యతలు అప్పగించనున్నారు. వీరికి ‘మెటర్నిటీ సర్వీస్ ఎగ్జిక్యూటివ్స్’గా నామకరణం చేశారు. సిరిసిల్ల జిల్లా దవాఖానలో 8 మంది, వేములవాడ ఏరియా హాస్పిటల్లో ఐదురుగు హెల్త్ సూపర్వైజర్లకు పీఆర్వో బాధ్యతలు అప్పగించారు. వీరు 3షిఫ్టుల్లో 24గంటల పాటు సేవలందించనున్నారు. హెల్త్ సూపర్వైజర్లను వారి సహాయకులను సులభంగా గుర్తించేలా ప్రత్యేక డ్రెస్ కోడ్ను ఏర్పాటు చేశారు. హెల్త్ ఎ డ్యుకేటర్లకు బ్లెజ్ కోట్, సహాయకులుగా ఉండే న ర్సింగ్ విద్యార్థులకు స్లీవ్లెస్ బ్లౌజ్ను డ్రెస్ కోడ్గా ఖరారు చేశారు. హెల్త్ సూపర్వైజర్లకు సహాయకులుగా నర్సింగ్ కళాశాల విద్యార్థులు తమ శిక్షణలో భాగంగా సోషల్ సర్వీస్, సోషల్ మేనేజ్మెంట్ నై పుణ్యాలను మెరుగుపరుచుకునేలా ప్లాన్ చేశారు. గర్భిణులకు అందించే వైద్య సేవలపై అవగాహన పెంచుకోనున్నారు. వారు హాస్పిటల్కు వచ్చినప్పటి నుంచి మర్యాదగా రిసీవ్ చేసుకోవడం, ద వాఖానకు వచ్చిన కారణాలను తెలుసుకొని వారి వెంట ఉండి అవసరమైన అన్ని రకాల పరీక్షలు చే యించడంతో పాటు వారికి కావాల్సిన ఇన్ పేషెం ట్, అవుట్ పేషెంట్ సేవలను అందించనున్నారు.
10 నుంచి పైలట్ ప్రాజెక్టుగా..
ఈ నెల 10నుండి వారం రోజుల పాటు ట్రయల్ రన్ నిర్వహించి..వచ్చే ప్రజా స్పందనను అనుసరించి పీఆర్వో వ్యవస్థ అమలులో లోటుపాట్లను సమీక్షిస్తూ మిషన్ 80పర్సెంట్ను విజయవంతంగా అమలుచేసేందుకు కలెక్టర్ చర్యలు తీసుకుంటున్నారు. గర్భిణులందరూ ప్రభుత్వ దవాఖానల్లోనే సంస్థాగత ప్రసవాలయ్యేలా మిషన్ 80పర్సెంట్ లక్ష్యం నెరవేరేలా కృషి చేస్తున్నారు. ప్రభుత్వ దవాఖానల్లోనే సంస్థాగత ప్రసవాలు చేయడం, మొదటి కాన్పులో సాధారణ ప్రసవాలను ప్రోత్సహించడంతో పేదలపై ఆర్థిక భారం పడకుండా చూడాలన్నదే ప్రధాన లక్ష్యంగా ఈ పైలట్ ప్రాజెక్టును చేపడుతున్నారు.
గర్భిణులకు వీఐపీ సేవలు..
ప్రభుత్వ దవాఖానలకు వచ్చే గర్భిణులకు వీఐపీ సేవలు అందించడమే లక్ష్యంగా కలెక్టర్ ఆదేశాల మేరకు ఎంఎస్ఈ వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నాం. ఎంఎస్ఈలు ప్రభుత్వ దవాఖానకు మొదటి నెల పరీక్షల కోసం వచ్చిన గర్భిణులు కాన్పు ప్రభుత్వ దవాఖానలోనే చేసుకునేలా వారిని మోటివేట్ చేస్తారు. అవసరమైన అన్ని రకాల పరీక్షలు దగ్గరుండి చేయిస్తారు. ప్రేమపూర్వకంగా స్వాగతం పలకడంతో పాటు వారిని ఆయా విభాగాల వద్దకు తీసుకెళ్లి పరీక్షలు చేయించడం, మందులు ఇప్పించడం, స్కానింగ్ తదితర పరీక్షలు చేసుకుని తిరిగి వారు వెళ్లే వరకు వారి వెన్నంటే ఉంటారు. 24గంటల పాటు నిరంతరరం అందుబాటులో ఉంటారు.
-మురళీధర్రావు, సూపరింటెండెంట్, జిల్లా దవాఖాన