కమాన్చౌరస్తా, ఫిబ్రవరి 26 : శాతవాహన యూనివర్సిటీ డిపార్ట్మెంట్ ఆఫ్ కామర్స్ ఆధ్వర్యంలో డిగ్రీ, పీజీ అధ్యాపకులకు సోమవారం ప్రాజెక్ట్ రిపోర్ట్ ప్రిపరేషన్పై ఒక రోజు జాతీయ వర్క్షాప్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కీ నోట్ స్పీకర్గా వరంగల్ ఎన్ఐటీ ప్రొఫెసర్ రాంలాల్ హాజరై మాట్లాడారు. విద్యార్థులకు పరిశోధన చాలా అవసరమని, వారిలో విషయ నైపుణ్యాలను పెంపొందించేందుకు అధ్యాపకులకు ఇలాంటి వర్క్షాప్ ఎంతో ఉపయోగపడుతుందని చెప్పారు.
విశిష్ట అతిథిగా హాజరైన ఎస్యూ పరీక్షల నియంత్రణ అధికారి డాక్టర్ శ్రీరంగప్రసాద్ మాట్లాడుతూ డిగ్రీ, పీజీ విద్యార్థుల ప్రాజెక్ట్ రిపోర్ట్కి సంబంధించిన విధి విధానాలను ఈ వర్క్షాప్ ద్వారా అధ్యాపకులు సందేహలను ని వృత్తి చేసుకోవచ్చని సూచించారు. విద్యార్థులకు ప్రాజెక్ట్ రిపోర్ట్ చాలా అవసరమని, అందుకు అధ్యాపకులు మార్గ నిర్దేశకులుగా ఉండాలని చె ప్పారు. డాక్టర్ మనోహర్ మాట్లాడుతూ పరిశోధనలో భాగంగా విద్యార్థులు తయారు చేసే ప్రాజెక్ట్ రిపోర్ట్ వారి ఉన్నత విద్యతో పాటు ఉపాధి అవకాశాలకు కీలకమన్నారు. ఇక్కడ డైరెక్టర్ డాక్టర్ డీ హరికాంత్, డిపార్ట్మెంట్ అధ్యాపకులు డాక్టర్ తిరుపతి, నరేశ్, డాక్టర్ పరశురాములు ఉన్నారు.