కరీంనగర్, మే 14 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : ‘పోక్సో కేసు నిందితుడు బండి భగీరథ్ కనిపించడం లేదు. ఆచూకీ తెలిస్తే సమీప పోలీస్ స్టేషన్లో తెలియజేయండి’ అంటూ కరీంనగర్ జిల్లాకేంద్రంతోపాటు వివిధ ప్రాంతాల్లో గురువారం పోస్టర్లు వెలిశాయి. కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కొడుకు భగీరథ్పై ఈ నెల 9న పోక్సో కేసు నమోదు కాగా, ఈనెల 13న విచారణకు హాజరు కావాలంటూ పోలీసులు నోటీసులు ఇచ్చారు. అయితే భగీరథ్ గైర్హాజరయ్యాడు.
ఈ పరిస్థితుల్లో కరీంనగర్ బస్స్టేషన్, తెలంగాణ చౌక్, ఎస్సారార్ కాలేజీతోపాటు వివిధ ప్రాంతాల్లో తెల్లారే సరికి పోస్టర్లు వెలిశాయి. వీటిని నగరవాసులు ఆసక్తి తిలకించారు. ఈ విషయం తెలుసుకున్న కొంత మంది బీజేపీ నాయకులు పోస్టర్లను చింపేశారు. కాగా, పోస్టర్లు వెలిసిన విషయం అప్పటికే సోషల్ మీడియాలో వైరల్గా మారింది.