విద్యానగర్, ఫిబ్రవరి 19: తపాల శాఖలో అందుబాటులో ఉన్న వివిధ ఖాతాలలో ప్రజలను చేర్పించడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్న భారత తపాల శాఖ నిన్నటి మొన్నటి వరకు ఒకో సీమ్ను తీసుకుని ప్రజల వద్దకు వెళ్లగా, ఈసారి అన్ని సీమ్ లతో ప్రజల వద్దకు వెళ్లేందుకు సిద్ధమైంది. ఇటీవలే భారీగా పెంచిన వడ్డీ రేట్లతో మహా మేళా పేరిట ఈ నెల 20 నుంచి 24 వరకు ఐదు రోజుల పాటు ప్రతి పోస్టాఫీసు పరిధిలో స్పెషల్ క్యాంపెన్ నిర్వహించి, ఎవరికీ అనుకూలమైన సీమ్ లలో వారిని చేర్పించేందుకు సమాయత్తమైంది. భారత తపాల శాఖ ఆదేశాల మేరకు కరీంనగర్ డివిజన్ వ్యాప్తంగా మహా మేళాల నిర్వహణకు అధికారులు అంతా సిద్ధం చేశారు. ఇప్పటికే సబ్ పోస్టాఫీసుల వారీగా అధికారులు, సిబ్బందితో పోస్టల్ ఎస్పీ వై.వెంకటేశ్వర్లు సమావేశమై మహా మేళాను విజయవంతం చేయాలని సూచించారు. ఈ సందర్భంగా పోస్టల్ ఎస్పీ వై.వెంకటేశ్వర్లు ఆదివారం మాట్లాడారు.
భారత తపాల శాఖ ఆదేశాల మేరకు అందుబాటులో ఉన్న వివిధ సీమ్ లలో పెద్ద సంఖ్యలో ప్రజలను చేర్పించాలనే లక్ష్యంతో ఈ మహా మేళా నిర్వహిస్తున్నట్లు పేరొన్నారు. తపాలా శాఖ ఇప్పటికే వడ్డీ రేట్లను భారీగా పెంచిందని, పెరిగిన రేట్ల ప్రకారం సీనియర్ సిటిజన్ సేవింగ్స్ సీమ్ 8.0 శాతం, సుకన్య సమృద్ధి ఖాతా 7.6, కిసాన్ వికాస్ పత్ర 7.2, పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ 7.1, నేషనల్ సేవింగ్స్ సర్టిఫికెట్ 7.0, నెలవారీ ఆదాయ పథకం 7.1, ఐదు సంవత్సరాల టైమ్ డిపాజిట్ 7.0, మూడు సంవత్సరాల టైమ్ డిపాజిట్ 6.9, రెండు సంవత్సరాల టైమ్ డిపాజిట్ 6.8, ఒక సంవత్సరం టైమ్ డిపాజిట్, 6.6, రికరింగ్ డిపాజిట్ 5.8, పొదుపు ఖాతా 4.0శాతంగా వడ్డీ రేట్లు ఉన్నాయని వివరించారు. ఆర్థిక చేయూతనిచ్చే ఈ పోస్టల్ సీమ్ లను ప్రజలు ఉపయోగించుకోవాలని కోరారు. కరీంనగర్ డివిజన్ వ్యాప్తంగా అన్ని పోస్టాఫీసులలో ఐదు రోజుల పాటు ఈ స్పెషల్ క్యాంపెన్ కొనసాగుతుందని వివరించారు. మరిన్ని వివరాల కోసం మీ దగ్గరలో ఉన్న పోస్టాఫీసులో సంప్రదించాలని పోస్టల్ ఎస్పీ కోరారు.