న్యూ ఇయర్ వేడుకలపై పోలీసులు ఆంక్షలు విధించారు. ప్రజలంతా సంబురాలు చేసుకోవచ్చని పేర్కొంటూనే, అదే సమయంలో వేడుకల పేరిట హద్దు దాటి ప్రవర్తిస్తే కఠిన చర్యలు తీసుకునేందుకు చర్యలు చేపట్టారు. జిల్లా వ్యాప్తంగా చెక్ పోస్ట్లు ఏర్పాటు చేశామని, నిరంతర డ్రంకెన్ డ్రైవ్ తనిఖీలు చేస్తామని, స్పెషల్ యాక్షన్ టీంలు ఆదివారం సాయంత్రం నుంచే రంగంలోకి దిగుతామని సీపీ మహంతి చెప్పారు.
అర్ధరాత్రి రోడ్లపైకి వచ్చే హంగామా చేసే వారిపై కఠినంగా వ్యవహరించడమే కాక కేసులు పెట్టేందుకు సిద్ధమయ్యారు. కాగా, ఆదివారం సాయంత్రం 6 నుంచి సోమవారం ఉదయం 5 గంటల వరకు నగర శివారులోని తీగల వంతెన, లోయర్ మానేరు డ్యాం కట్టపైకి వెళ్లేందుకు అనుమతించబోమని, అకడ వేడుకల నిర్వహణను నిషేధించినట్లు సీపీ అభిషేక్ మహంతి తెలిపారు.