వానకాలం వరిధాన్యం కొనుగోళ్లు చివరిదశకు చేరుకున్నాయి. ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా 17.46 మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణే లక్ష్యంగా ప్రభుత్వం 1336 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసింది. వీటిలో ఇప్పటి వరకు 1,58,388 మంది రైతుల నుంచి 10.36 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసింది. దీని విలువ రూ.రూ.2133.14 కోట్లు కాగా, ఆన్లైన్లో నమోదైన వివరాల మేరకు ఇప్పటి వరకు రూ.1442.7 కోట్లు జమ చేసింది. అయితే, ఈ సీజన్లో ఎక్కువగా ప్రైవేట్ వ్యాపారులు రైతుల వద్దకు వెళ్లి నేరుగా కొనుగోలు చేయడంతో కేంద్రాలకు అధికారులు అనుకున్న లక్ష్యానికి అనుగుణంగా ధాన్యం రాలేదు. దీంతో అధికార యంత్రాంగంపై రైతుల నుంచి ఒత్తిడి తగ్గింది. ఇక సీజన్కు సంబంధించి కొన్ని చోట్ల కొనుగోళ్లు పూర్తవడంతో ఇప్పటికే కేంద్రాలను మూసివేశారు. మరి కొన్ని రోజుల్లో ధాన్యం కొనుగోళ్లను పూర్తి చేసి కేంద్రాలను మూసివేయాలని అధికారులు భావిస్తున్నారు.
కరీంనగర్, డిసెంబర్ 12 (నమస్తే తెలంగాణ): వానకాలం సీజన్కు సంబంధించి ధాన్యం కొనుగోళ్లు ఆఖరికి చేరుకున్నాయి. ఇప్పటికే యా సంగి మొదలవడంతో త్వరలో కొనుగోళ్లను వేగం గా పూర్తి చేయాలని అధికారులు భావిస్తున్నారు. ఈసారి గతం కంటే దిగుబడి పెరగడంతో అందుకనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసింది. అయితే, ఈసారి ధాన్యానికి డి మాండ్ ఉండడంతో ప్రైవేటు వ్యాపారులు పోటీపడ్డారు. నేరుగా రైతుల వద్దకే వెళ్లి పచ్చి వడ్లు కొన డంతో కేంద్రాలకు అధికారులు అనుకున్నంత ధాన్యం రాలేదు. దీంతో వారిపై కొంత మేర ఒత్తిడి తగ్గింది.
ఈసారి ‘ప్రైవేట్’ వ్యాపారులదే..
ఈ వానకాలం సీజన్లో వడ్లకు మంచి గిరాకీ వచ్చిందని చెప్పవచ్చు. అంతరాష్ట్ర మార్కెట్లో బియ్యానికి డిమాండ్ పెరగడంతో ఎక్కువగా వరిసాగు చేసే తెలంగాణ రాష్ట్రంలో ధాన్యం కొనుగోలు చేసేందుకు ఇతర రాష్ర్టాల వ్యాపారులు ఎగబడ్డారు. రైతుల పొలాల వద్దకు వెళ్లి కోతలు కాకముందే చాలా చోట్ల రైతులకు అడ్వాన్స్లు ఇచ్చుకున్నారు. ఒక పక్క కోతలు జరుగుతుండగానే పచ్చి వడ్లకే రూ.2 వేలకు క్వింటాలు చొప్పున చెల్లించారు. సన్న, దొడ్డు రకం అనే తేడా లేకుండా అన్ని రకాల వడ్లకు నాణ్యతను బట్టి ధర చెల్లించి పెద్ద మొత్తంలో ధాన్యాన్ని ఇతర జిల్లాలు, రాష్ర్టాలకు చెందిన వ్యాపారులు కొనుగోళ్లు జరిపారు.
కేంద్రం నిర్ణయించిన కనీస మద్దతు ధర ఏ గ్రేడ్ ధాన్యానికి రూ.2,060, సాదారణ రకానికి రూ. 2,040 చొప్పున ఈ ఏడాకి నిర్ణయించారు. ఎఫ్ఏక్యూ నాణ్యత ప్రమాణాలు తప్పని సరిగా ఉంటేనే ఈ ధర చెల్లిస్తారు. కానీ, ప్రైవేట్ వ్యాపారులు ఒక పక్క కోతలు నిర్వహిస్తుండగానే మరో కొనుగోళ్లు చేసుకుని వెళ్లారు. ఉదాహరణకు కరీంనగర్ జిల్లాలో ధాన్యం సేకరణ లక్ష్యం 4.46 లక్షల మెట్రిక్ టన్నులు. కానీ, ప్రైవేట్ వ్యాపారులు రంగంలోకి దిగడంతో ఇప్పటి వరకు 2.50 లక్షల మెట్రిక్ టన్నులు మాత్రమే కొనుగోలు చేయగలిగారు. ఒక్క ఈ జిల్లాలోనే ప్రైవేట్ వ్యాపారులు దాదాపు 2 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది.
జగిత్యాలలో..
జగిత్యాల జిల్లా తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత అన్నెంగిన్నెగా మారిపోయిందని చెప్పొచ్చు. ఎస్సారెస్పీ పునర్జీవ పథకం వల్ల జిల్లాలో సాగు, దిగుబడి విస్తీర్ణం గణనీయంగా పెరిగిపోయింది. 2014లో జిల్లాలో 2,59,255 ఎకరాల్లో సాగు జరుగగా, ఇందులో 1,16,746 ఎకరాల్లో వరి పంట వేశారు. ఎస్సారెస్పీ పునర్జీవ పథకం పూర్తయిన ఈ నాలుగేండ్ల వ్యవధిలో పంట సాగు విస్తీర్ణం, దిగుబడి రెండూ పెరిగిపోయాయి. ఈ ఏడాది జిల్లాలో 3,83,700 ఎకరాల్లో సాగు చేయగా, ఇందులో 3,01,820 ఎకరాల్లో వరి ఉండడం గమనార్హం.
వరద కాలువలకు తూములు ఏర్పాటు చేసి చెరువులు నింపడం వల్ల జిల్లాలో వరి సాగు పరిస్థితి వేగంగా మారిపోయింది. జిల్లాలో దాదాపు నలభై కిలోమీటర్ల పొడవున వరద కాలువ ఒక రిజర్వాయర్గా మారడంతో భూగర్భ జలాలు గణనీయంగా పెరిగాయి. 8 ఏండ్ల క్రితం 1,16 లక్షల ఎకరాల్లో వరి సాగు చేసిన రైతులు, ఇప్పుడు 3 లక్షలకు పైగా ఎకరాల్లో వరిని సాగు చేస్తున్నారు. 8 ఏండ్ల క్రితం రెండున్నర లక్షల మెట్రిక్ టన్నుల వరి ధాన్యం దిగుబడి కాగా, ఇప్పుడు ఏకంగా 6.50 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి అవుతుండడం గమనార్హం. అ ఏడాది వానకాలంలో 3,01,820 ఎకరాల్లో సాగు చేయగా, అందులో మొత్తం 6.50 లక్షల మెట్రిక్ టన్నుల వరి ధాన్యం కొనుగోలు చే యాల్సి ఉంటుందని అధికారులు అంచనా వేశారు. ఈ మేరకు జిల్లాలో పెద్ద సంఖ్యలో వరిధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశారు. జిల్లాలో 380 గ్రామ పంచాయితీలు ఉంటే, ఏకంగా 420 చోట్ల వరిధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశారు అధికారులు. అంటే వరిధాన్యం కొనుగోలుకు ప్రభుత్వం ఎంత ప్రాధాన్యత ఇస్తుందన్న విషయం అర్థం అవుతోంది.
రాజన్న సిరిసిల్లలో..
పుట్ల కొద్దీ వడ్లు.. కోట్ల కొద్దీ డబ్బు.. ఇదీ రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రస్తుత పరిస్థితి. కాళేశ్వర జలాలతో అన్నదాత ఇంట ధాన్యపు సిరులు కురుస్తున్నాయి. ఆశించిన స్థాయిలో దిగుబడి రావడంతో కేంద్రాలకు ధాన్యం పోటెత్తింది. అందుకనుగుణంగా కల్లాల వ ద్దే కేంద్రాలను ఏర్పాటు చేసి రైతులకు రవాణా ఖ ర్చులు భారం కాకుండా చర్యలు తీసుకుంది. కేం ద్రాలకు వచ్చిన వడ్లను వెనువెంటనే తూకం వేసి మిల్లులకు తరలించింది. జిల్లాలో 255 గ్రామ పం చాయతీలుండగా, 259 కేంద్రాలను ఏర్పాటు చే సింది. జిల్లా వ్యాప్తంగా 3.50లక్షల మెట్రిక్ టన్ను లు సేకరించాలని పౌరసరఫరాల శాఖ లక్ష్యం అంచ నా వేసింది. అయితే, వడ్లను రైతులు రైసు మిల్లులకు నేరుగా విక్రయించడంతో 2.50 లక్షల మెట్రిక్ టన్నులు కొనుగోలు చేసేందుకు ఏర్పాట్లు చేసింది. అయితే, ఇప్పటికే 33,682 మంది రైతుల నుంచి రూ.456.21 కోట్ల విలువైన 2,21,463 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసింది. అంతే కాకుం డా ఇప్పటికే రూ.300 కోట్లను రైతుల ఖాతాల్లో జమచేసింది. మరో రూ.155 కోట్లు చెల్లించడానికి ఆన్లైన్లో వివరాలు నమోదు చేశారు. కాగా, కొన్ని చోట్ల కొనుగోళ్లు పూర్తి కావడంతో 80 కేంద్రాలను మూసివేశారు. ఈ నెలాఖరులోగా జిల్లాలో కొనుగోళ్ల ప్రక్రియ పూర్తయ్యే అవకాశం కనిపిస్తున్నది.
జగిత్యాల జిల్లా కొనుగోళ్ల వివరాలు
లక్ష్యం: 6.50 లక్షల మెట్రిక్ టన్నులు
కొనుగోలు కేంద్రాలు: 420
ఇప్పటివరకు కొన్న ధాన్యం: 3.50 లక్షల మెట్రిక్ టన్నులు
కొనుగోలు చేసిన ధాన్యం విలువ: రూ.720కోట్లు
ఇప్పటివరకు జరిగిన చెల్లింపులు: రూ.500కోట్లు
కరీంనగర్ జిల్లాలో..
జిల్లాలో 353 కేంద్రాలను ఏర్పాటు చేసి 4.46 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. అంతరాష్ట్ర మార్కెట్లో బియ్యానికి మంచి డిమాండ్ రావడంతో ఇతర రా ష్ర్టాల నుంచి వ్యాపారులు నేరుగా రైతుల నుంచి కొనుగోళ్లు జరపడంతో పరిస్థితిని గమనించిన అధికారులు 341 కేంద్రాలను రైతులకు అందుబాటు లో ఉండేలా తెరిచారు. కానీ, 322 కేంద్రాలకు ద్వారా ఇప్పటి వరకు 45,246 మంది రైతుల నుంచి రూ.516.06 కోట్ల విలువైన 2,50, 514.428 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేశారు. ఇందులో 42,883 మంది రైతులకు సంబంధించిన 2,35,083.160 మెట్రిక్ టన్నుల ధాన్యం వివరాలను ఆన్లైన్లో నమోదు చేశారు. దీని విలువ రూ.484.27 కోట్లు. ఇక 35,655 మంది రైతులకు సంబంధించిన రూ.394.32 కోట్ల విలువైన 1,91,418.457 మె ట్రిక్ టన్నుల ధాన్యం డబ్బులను రైతుల ఖాతాల్లో జమచేశారు. అంటే ఆన్లైన్లో నమోదైన రైతుల వివరాలు 94 శాతం ఉండగా, నగదు పొందిన రైతులు 81 శా తం ఉన్నారు. కాగా, ముందుగా కోతలకు వచ్చిన హుజూరాబాద్, జమ్మికుంట, వీణవంక, మానకొండూర్ తదితర మండలాల్లో ఇప్పటికే 149 కేం ద్రాలను మూసి వేశారు. కరీంనగర్ రూరల్, గంగాధర, రామడుగు, తదితర మండలాల్లో ఇంకా ము మ్మరంగా కొనుగోళ్లు జరుగుతున్నాయి. మిగతా మండలాల్లో చివరి దశకు చేరాయి.
పెద్దపల్లి జిల్లా కొనుగోళ్ల వివరాలు
లక్ష్యం: 4 లక్షల మెట్రిక్ టన్నులు
కొనుగోలు కేంద్రాలు: 304
సేకరించిన కేంద్రాలు: 271
ఇప్పటివరకు కొన్న ధాన్యం: 2,14,226 మెట్రిక్ టన్నులు
ధాన్యం విలువ: రూ.440.87 కోట్లు
విక్రయించిన రైతుల సంఖ్య: 33460
ఇప్పటి వరకు చెల్లింపులు: రూ.248.38 కోట్లు
ఈ నెలాఖరు లోగా పూర్తి చేస్తాం
ఈ సారి జిల్లా వ్యాప్తంగా 304 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశాం. 271 సెంటర్ల నుంచి ధాన్యం సేకరించాం. ఇందులో ఇప్పటికే 21 సెంటర్లలో కొనుగోళ్లు పూర్తయ్యాయి. ఈ నెలాఖరు వరకు మొత్తం కొనుగోళ్లు పూర్తవుతాయి.
– తోట వెంకటేశ్, డీఎస్ఓ, పెద్దపల్లి