Rasamayi Balakishan | తిమ్మాపూర్, ఫిబ్రవరి 5 : కార్పొరేషన్ పరిధిలోని అలుగునూర్ డివిజన్ లో గులాబీ జెండా పక్క ఎగురుతుందని, బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి కాల్వ మల్లేశం గెలుపు ఖాయమని మానకొండూరు మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ స్పష్టం చేశారు. ఆయన మండల, నియోజకవర్గ నాయకులతో కలిసి బీఆర్ఎస్ అభ్యర్థి కాల్వ మల్లేశంకు మద్దతుగా డివిజన్లో గురువారం ఇంటింటా ప్రచారం చేశారు. ప్రస్తుత ప్రభుత్వం మీద ఉన్న వ్యతిరేకతను వివరించారు. హామీలు అమలులో వైఫల్యమైన సర్కారుకు, కార్పొరేషన్ ఎలక్షన్లలో తగిన బుద్ధి చెప్పాలని సూచించారు.
అలుగునూర్ డివిజన్లో బీఆర్ఎస్ బలంగా ఉందని కాల్వ మల్లేశం గెలుపు కోసం పార్టీ కార్యకర్తలు నిబద్ధతతో పనిచేస్తున్నారని కొనియాడారు. ఇంటింటా కరపత్రాలు పంచుతూ ఉత్సాహంగా ప్రచారంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ మండల అధ్యక్షుడు రావుల రమేష్, రాష్ట్ర నాయకుడు కేతిరెడ్డి దేవేందర్ రెడ్డి, సల్ల మహేందర్, వడ్లూరు శంకర్, బోయిన తిరుపతి, మల్లెత్తుల అంజయ్య యాదవ్, నియోజకవర్గ, మండల, డివిజన్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.