పెగడపల్లి/వెల్గటూర్, నవంబర్ 23: కాంగ్రెస్ వస్తే అన్నీ ఇబ్బందులే. ఏండ్ల కొద్ది పాలించి రాష్ట్రంలో చేసిందేమీలేదు. అన్నీ స్కాంలు తప్ప అభివృద్ధి ఉండదు. నమ్ముకున్న ప్రజలకు కష్టాలు, కన్నీళ్లు మిగిల్చే కాంగ్రెస్ కావాలా..? ప్రజా సంక్షేమానికి పాటుపడే బీఆర్ఎస్ కావాలా..? మీరే నిర్ణయం తీసుకోవాలి’ అని ధర్మపురి అభ్యర్థి, మంత్రి కొప్పుల ఈశ్వర్ పిలుపునిచ్చారు. గురువారం రాములపల్లి, వెంగళాయిపేట, లింగాపూర్, శాలపల్లి, వెల్గటూర్ మండలం రాజారంపల్లి గ్రామంలో ప్రజా ఆశీర్వాద యాత్ర చేపట్టగా, ఆయా గ్రామాల్లో పార్టీ శ్రేణులు, మహిళలు ఘన స్వాగతం పలికారు. అనంతరం ఆయాచోట్ల మంత్రి మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రం దేశంలోనే అన్ని రంగాల్లో ముందంజలో ఉందని, పదేళ్ల సీఎం కేసీఆర్ నేతృత్వంలో రాష్ట్రం గణనీయమైన అభివృద్ధిని సాధించిందని వివరించారు.
దేశంలోని పలు రాష్ర్టాల్లో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రజలను అష్టకష్టాల పాలు చేస్తోందన్నారు. ఆరు నెలల కింద కర్ణాటకలో దొంగ హామీలతో అధికారంలోకి వచ్చిందని, ఒక్కటీ నెరవేర్చలేదన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ 50 ఏండ్ల పాలనలో నీళ్లు, విద్యుత్, విద్య, వైద్యం లేక ప్రజలు నానా కష్టాలు పడ్డారని, ఆ బాధలు ఇంకా ఎవరూ మర్చిపోలేదన్నారు. రైతులకు 3 గంటల కరంటు చాలని పార్టీ చీఫ్ రేవంత్రెడ్డి మాట్లాడడం సరికాదని, మూడు గంటలు ఎట్లా చాలుతదో చెప్పాలని ప్రశ్నించారు. ప్రజా సంక్షేమానికి అధిక ప్రాధాన్యం ఇచ్చే బీఆర్ఎస్కు ఓటు వేయాలని ప్రజలకు మంత్రి ఈశ్వర్ విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా ఆయా గ్రామాలకు చెందిన పలువురు కాంగ్రెస్, బీజేపీ నాయకులు భారీ సంఖ్యలో మంత్రి ఈశ్వర్ సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు.
ఇక్కడ పార్టీ రాష్ట్ర నేత వోరుగంటి రమణారావు, జడ్పీటీసీ కాసుగంటి రాజేందర్రావు, ఎంపీపీ గోళి శోభ-సురేందర్రెడ్డి, ఏఎంసీ చైర్ పర్సన్ లోక నిర్మల, సర్పంచులు తోట గంగాభవాని, చిందం సులోచన, బొడ్డు తార, వైస్ ఎంపీపీ గాజుల గంగాధర్, పార్టీ మండలాధ్యక్ష, కార్యదర్శులు లోక మల్లారెడ్డి, బండి వెంకన్న, నందగిరి, నంచర్ల విండో చైర్మన్లు కర్ర భాస్కర్రెడ్డి, మంత్రి వేణుగోపాల్, ఆర్బీఎస్ మండలాధ్యక్షుడు ఉప్పుగండ్ల నరేందర్రెడ్డి, మార్కెట్ వైస్ చైర్మన్ రాజు ఆంజనేయులు, కో-ఆప్షన్ సభ్యుడు రహీం, మండల అడ్హక్ కమిటీ అధ్యక్షుడు ఇరుగురాల ఆనందం, యూత్ అధ్యక్షుడు సంతోష్, మహిళా అధ్యక్షరాలు సుంకరి మమత, పార్టీ నాయకులు తోట మోహన్రెడ్డి,
సాగి శ్రీనివాసరావు, తోట మహేందర్, కాశెట్టి సత్తయ్య, వీరేశం, రాంమచంద్రం, నరేష్రావు, నారెడ్డి రాజిరెడ్డి, పుల్లూరి సత్యనారాయణ, శ్రీనివాస్, భాస్కర్రావు, సత్యనారాయణరావు, దేవయ్య, కరుణాకర్, విజయ్యాదవ్, సంజీవరెడ్డి, జానీపాషా, నరేష్ ఉన్నారు. వెల్గటూర్లో జరిగిన కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ పత్తిపాక వెంకటేశ్, సింహాచలం జగన్, ఎంపీటీసీ గాజుల మల్లేశం, సీనియర్ నేత ఏలేటి చంద్రారెడ్డి, సంగ రమేశ్, రెడ్ల కృష్ణ, గూడ రాంరెడ్డి, జలేంధర్రెడ్డి, జగన్మోహన్రెడ్డి, సత్యనారాయణరెడ్డి, మహేందర్రెడ్డి, మేరుగు జానీ తదితరులున్నారు..