పెద్దపల్లి, నవంబర్ 15 (నమస్తే తెలంగాణ): యాభై ఏండ్లలో జరగని అభివృద్ధిని గడిచిన తొమ్మిదేళ్లలో చేశానని, మరోసారి తనకు అవకాశమిస్తే మరింత ఆదర్శంగా తీర్చిదిద్దుతానని పెద్దపల్లి అసెంబ్లీ బీఆర్ఎస్ అభ్యర్థి, ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి ప్రజలకు విజ్ఞప్తి చేశారు. బుధవారం ఆయన ‘నమస్తే తెలంగాణ’కు ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. చేసిన అభివృద్ధి కండ్ల ముందు కనిపిస్తున్నదని, అదే తనను గెలిపిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. నియోజకవర్గ ప్రజలు చైతన్య వంతులని, పనిచేసే వాళ్లను తప్పకుండా దీవిస్తారన్న నమ్మకం తనకు ఉందని విశ్వాసం ప్రకటించారు. పెద్దపల్లిలో జరిగిన సీఎం ప్రజా ఆశీర్వద సభే తన గెలుపును నిర్ధారించిందని హర్షం వ్యక్తం చేశారు.
దాసరి మనోహర్రెడ్డి : ప్రచారం చాలా గొప్పగా నడుస్తున్నది. గులాబీ సేన ఇంటింటికీ వెళ్తున్నది. మా పార్టీ నాయకులు, కార్యకర్తలు గడపగడపకూ తిరుగుతున్నరు. గులాబీ జెండా ఎగురవేసేందుకు కార్యోన్ముఖులై పనిచేస్తున్నరు. తెలంగాణ రాక ముందు అనుభవించిన కష్టాలను కండ్ల ముందుంచుతున్నం. గడిచిన తొమ్మిదిన్నరేండ్లలో చేసిన అభివృద్ధిని వివరిస్తున్నం. రాబోయే ఐదేండ్లలో ఏం చేస్తామో చెబుతున్నం. ప్రజల నుంచి వస్తున్న ఆదరణను చూస్తే బీఆర్ఎస్ గెలుపు ఖాయమని స్పష్టమవుతున్నది.
దాసరి మనోహర్రెడ్డి : పెద్దపల్లి నియోజకవర్గంలో ప్రజల స్పందన బాగున్నది. ఏ గ్రామానికి వెళ్లినా మమ్మల్ని స్వాగతిస్తున్న తీరు, చూపుతున్న అభిమానం వెలకట్టలేనిది. బీఆర్ఎస్ను మరోసా రి గెలిపించాలని తపన ప్రతి ఒక్కరిలోనూ కనిపిస్తున్నది. ‘అన్నా మీరు తప్పకుండా గెలువాలి. మీరు గెలిస్తేనే ఈ నియోజకవర్గం అభివృద్ధి, సంక్షేమం దిశగా పరుగులు తీస్తున్నది’ అని చెబుతుండడం మాకు ఉత్సాహాన్నిస్తున్నది. నిజంగా నియోకవర్గ ప్రజలకు ఎంత చేసినా రుణం తీర్చుకోలేం. గ్రామగ్రామాన మహిళలు మంగళహారతులతో స్వాగతించడం, డప్పు చప్పుళ్ల మధ్య నృత్యా లు చేస్తూ ఆహ్వానించడం మరువలేనిది. నిజంగా బీఆర్ఎస్ కార్యకర్తనైనందుకు, అభ్యర్థినైనందుకు గర్వపడుతున్న.
దాసరి మనోహర్రెడ్డి : ఈ నెల 7న పెద్దపల్లిలో ప్రజా ఆశీర్వాద సభ గ్రాండ్ సక్సెస్ అయింది. పెద్దపల్లి చరిత్రలో ఇలాంటి సభ జరగడం ఇదే మొదటిసారి. నియోజకవర్గ నలుమూలల నుంచి అశేషంగా తరలివచ్చిన్రు. సభా ప్రాంగణమే కాదు, దారులన్నీ జనంతో కిటకిటలాడినయి. సభా స్థలి వద్ద ఎంత మంది ఉన్నారో.. రహదారులపై అంతకన్నా ఎక్కువ మందే ఉన్నరు. ఆ రోజు వచ్చిన జనాన్ని చూస్తే పెద్దపల్లిలో బీఆర్ఎస్ గెలుపు ఖాయమని స్పష్టమైంది. సీఎం కేసీఆర్ నాయకత్వాన నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధే ప్రజలను సభ వైపు నడిపించింది. ముఖ్యమంత్రి ప్రసంగం అందర్నీ కట్టిపడేసింది. పార్టీపై, అధినేతపై, నాయకులపై ప్రేమ లేకుండా ఇంత గొప్పగా సభ విజయవంతం కావడం అనేది ఉండదు. కేసీఆర్ మాట్లాడిన ప్రతి మాటపైనా గ్రామాల్లో విస్తృతమైన చర్చ జరుగుతున్నది. ఆ చర్చ అసలు ఓటు ఎవరికి వేయాలి? ఏ పార్టీకి వేయాలి? అనే తీరుగా ఉన్నది. ప్రజలంతా మరోసారి బీఆర్ఎస్కు మరోసారి ఓటేసి పట్టం కట్టేందుకు సిద్ధంగా ఉన్నరు.
దాసరి మనోహర్రెడ్డి: ప్రతిపక్షాలవి పసలేని ఆరోపణలు. కేవలం రాజకీయ ప్రయోజనాల కోసం మాత్రమే చేస్తున్నరు. నిజంగా ఇంత నీచానికి దిగజారడం అవసరమా..? ఏం ఆరోపణలు అవి? దేనికైనా ఆధారం ఉన్నదా..? ఏది పడితే అది మాట్లాడొచ్చా..? కేవలం రాజకీయ కక్షతో నిరాధార ఆరోపణలు చేయడం సిగ్గు చేటు. అదే ఇతరులు వాళ్లపై చేస్తే మాత్రం జీర్ణించుకోరు. ఇదేం విచిత్రమో అర్థం కాదు. నోరుందని ఏది పడితే అది మాట్లాడడం సరికాదు. వాస్తవమేదో.. సత్యమేదో తెలుసకొని మాట్లాడాలి. ప్రజలు అన్నీ గమనిస్తున్నరు. ఇవాళ బీఆర్ఎస్ను గెలిపించడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నరు. అడ్డదిడ్డంగా మాట్లాడేటోళ్లకు కచ్చితంగా బుద్ధి చెబుతరు.
దాసరి మనోహర్రెడ్డి: తొమ్మిదిన్నరేండ్లలో తెలంగాణ దేశానికే ఆదర్శంగా నిలిచింది. అది సీఎం కేసీఆర్తోనే సాధ్యమైంది. ఇదే భావన ప్రతి ఒక్కరిలోనూ ఉన్నది. కేసీఆర్ చేతుల్లోనే రాష్ట్రం సుభిక్షంగా ఉంటుందనే అభిప్రాయం కనిపిస్తున్నది. అందుకే ఇవాళ అందరూ తెలంగాణను కాపాడుకోవాలనే లక్ష్యంతో బీఆర్ఎస్వైపు చూస్తున్నరు. కాంగ్రెస్, బీజేపీ నుంచి పెద్దసంఖ్యలో గులాబీ పార్టీలో చేరుతున్నరు. అందరినీ సమన్వయం చేసుకొని ముందుకెళ్తున్నం. అలాగే పార్టీలో పనిచేసే ప్రతి కార్యకర్తకూ గుర్తింపు ఉంటుంది. పార్టీ అందరినీ గౌరవిస్తుంది. నాకు ఎమ్మెల్యేగా అవకాశం ఇచ్చింది. నియోజకవర్గం నుంచి ఎమ్మెల్సీ, కార్పొరేషన్ చైర్మన్గా ఇద్దరికి చాన్స్ ఇచ్చింది. పాత కొత్తల కలయికతో ఎన్నికల్లో విజయం సాధించి పార్టీ జెండాను నియోజకవర్గంపై ఎగురవేసే విధంగా అందరం అంకిత భావంతో పనిచేస్తున్నం.
దాసరి మనోహర్రెడ్డి: పెద్దపల్లి చరిత్రలో వరుసగా రెండు సార్లు గెలిచిన ఎమ్మెల్యే లేడు. నియోజకవర్గ ప్రజల ఆశీర్వాదంతో 2018ఎన్నికల్లో రెం డోసారి గెలిచి రికార్డు సృష్టించా. ఈ ఎన్నికల్లోనూ ప్రజల ప్రేమాభిమానాలతో మరోసారి గెలిచి హ్యాట్రిక్ సాధిస్త. పనిచేసే వాళ్లకు ప్రత్యర్థులుండరు. ప్రజలకు నా మీద పూర్తి విశ్వాసం ఉన్నది. తప్పకుండా మూడో సారి ఆశీర్వదిస్తరు. అందరి ఆదారభిమానాలతో మరోసారి విజయం సాధిస్త.
దాసరి మనోహర్రెడ్డి: నిజంగా పెద్దపల్లి నియోజకవర్గ ప్రజలు బీఆర్ఎస్కే ఓటేయాలి. ఎందుకో నాకంటే వాళ్లకే ఎక్కువ తెలుసు. తెలంగాణ రాక ముందు, వచ్చిన తర్వాత పెద్దపల్లి ఎట్లున్నదో కం డ్ల ముందు చూస్తున్నరు. అంతకు ముందున్న ప్ర భుత్వాలు పెద్దపల్లి అభివృద్ధిపై దృష్టి పెట్టలేదు. కా నీ, స్వరాష్ట్రంలో నేను ఎమ్మెల్యే అయిన తర్వాత నాటి కష్టాలను దూరం చేసినం. సీఎం కేసీఆర్ సహకారంతో పెద్దపల్లిని జిల్లా చేసినం. వేల కోట్ల నిధులతో అభివృద్ధిని పరుగులు పెట్టించి నం. గడిచిన తొమ్మిదిన్నరేండ్లలో ఆదర్శంగా నిలిపినం. రో డ్లు బాగు చేసినం, తాగు, సాగునీటి కష్టాలను పారదోలినం. ఇంకా ఎన్నో చేసినం. ఇదంతా కం డ్ల ముందే ఉన్నది. ఇంకా అభివృద్ధి చేస్తమని సీఎం కేసీఆర్ ఈ నెల 7న జరిగిన ప్రజా ఆశీర్వద సభలో హామీ ఇచ్చిండు. అధికారంలోకి వ చ్చిన నెల రోజుల్లోనే అడిగినవన్నీ చేస్తానని ప్రకటించిం డు. పనిచేసిన వారికి ఓటు అడిగే హక్కు ఉంటుం ది. ఆ హక్కుతోనే నేను ఓటు వేయాలని అభ్యర్థిస్తున్న. బీఆర్ఎస్ను గెలిపించాలని కోరుతున్న.
దాసరి మనోహర్రెడ్డి: నియోజకవర్గ ప్రజలు రెండు సార్లు నన్ను ఎమ్మెల్యేగా దీవించిన్రు. యాభై ఏండ్లలో జరగని అభివృద్ధిని సీఎం కేసీఆర్ సహకారంతో తొమ్మిదిన్నరేండ్లలో చేసి చూపిన. నేను ఒక్కటే విజ్ఞప్తి చేస్తున్న. మరోసారి నాకు అవకాశం ఇవ్వండి. మీకు సేవ చేసే భాగ్యం కల్పించండి. నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి చేస్త. ప్రజల ఆర్థిక, సామాజిక పరిస్థితులు, జీవన ప్రమాణాలు మెరుపరిచేందుకు కృషి చేస్త. ఇక్కడ ఉన్న నిరుద్యోగుల కోసం జాబ్స్ సెంటర్స్ ఏర్పా టు చేస్త. పెద్దపల్లి పట్టణానికి స్టేడియం, కమ్యూనికేషన్ సెంటర్, థియేటర్, ఆడిటోరియం, రోడ్లు, మౌలిక వసతులు కల్పించాల్సి ఉన్నది. నేను మళ్లీ గెలిచిన తర్వాత ఆ పనులన్నీ పూర్తి చేస్త.
దాసరి మనోహర్రెడ్డి: నియోజకవర్గంలో 2 శా తం మహిళలు అధికంగా ఉన్నరు. సీఎం కేసీఆర్ మొదటి నుంచీ మహిళా సంక్షేమానికి ప్రాధాన్యం ఇస్తున్నారు. విద్య, వైద్యం, ఉద్యోగ, రాజకీయం లో ప్రభుతవ పెద్దపీట వేసింది. ప్రతి సంక్షేమ పథకాన్ని మహిళ పేరుపైనే ప్రవేశపెట్టింది. పుట్టిన బిడ్డ నుంచి పండు ముసలి వరకు ప్రతి ఒక్కరికీ ఏదో ఒక రూపంలో లబ్ధి చేకూరుస్తున్నది.
నమస్తే: సోషల్ మీడియా వేదికగా వస్తున్న ఆరోపణలను ఎలా తిప్పి కొడతారు?
దాసరి మనోహర్రెడ్డి: ప్రత్యర్థి పార్టీల నాయకులు సోషల్ మీడియా వేదికగా అసత్యాలను ప్రచారం చేస్తున్నరు. ప్రతి చిన్న విషయాన్ని చిలువలు, పలువలు చేస్తున్నరు. వాళ్లకిదో పరిపాటి అయింది. వారి అబద్ధాలు, అసత్యాలను సోషల్ మీడియా వేదికగా ఎప్పటికప్పుడు తిప్పి కొడుతూనే ఉన్నం. ప్రజలు వివేకవంతులు. వాళ్లకు ఏది వాస్తవమో..? ఏది అవాస్తవమో..? తెలుసు. ఎవరేం మాట్లాడుతున్నరు? అనే విషయాన్ని గమనిస్తూనే ఉన్నరు. ఆరోపణలను ఎవరూ నమ్మరు. కాంగ్రెస్ పాలనను.. బీఆర్ఎస్ పాలనను ఈ ప్రాంత ప్రజలు ఒక్కసారి బేరీజు వేసుకుంటే.. మీకే కండ్లకు కట్టినట్టు కనిపిస్తుంది. అభివృద్ధి ఎవరు చేసిన్రు అనే విషయం స్పష్టమైతది.
దాసరి మనోహర్రెడ్డి: కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ప్రజలకు చేసిందేమీ లేదు. అప్పుడు 200 మాత్రమే పింఛన్ ఇచ్చేది. వరుసగా పదేళ్లు అధికారంలో ఉన్నా ఒక్క రూపాయి బిళ్ల పెంచలేదు. బీఆర్ఎస్ సర్కారు అలా కాదు, పేదలు, అభాగ్యుల విషయంలో మానవీయకో ణం చూపుతున్నది. పది రెట్లు పింఛన్లు పెంచి రెం డు వేలు చేసింది. ఇప్పుడు వృద్ధులకు 5,016, దివ్యాంగులకు 6వేలు చేస్తమని మ్యానిఫెస్టోలో ప్రకటించింది. ఇంకా 400లకే సిలిండర్, రైతుబంధు ఎకరానికి 16వేలు, రేషన్ కార్డుపై సన్నబియ్యం ఇస్తామని చెప్పింది. ఆరోగ్య బీమా 5లక్షలు, ఆరోగ్య శ్రీ కింద గరిష్ఠ పరిమితిని 15లక్షలు చేస్తనని అన్నది. ఇలా నమ్మకమైన హామీలతో మా మ్యానిఫెస్టో అద్భుతంగా ఉన్నది. కానీ, కాంగ్రెస్ ఇప్పుడు ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ఆరు గ్యారెంటీలని చెబుతున్నది. కర్ణాటకలో ఐదు గ్యారంటీలని చేతులెత్తేసింది. ఇక్కడ మళ్ల అదే పాట పాడుతున్నది. ప్రజలు ఏం నమ్ముతరు? ప్రజలంతా బీఆర్ఎస్ వైపే ఉన్నరు.
దాసరి మనోహర్రెడ్డి: ప్రజలు వివేకవంతులు. వాళ్లకు అన్ని విషయాలూ తెలుసు. నేను స్వరాష్ట్రలో రెండు సార్లు ఎమ్మెల్యేగా ఉన్న. 2014 నుంచి ఇప్పటి వరకు మీ ఊరు, మీ వాడకు ఇంటికి వచ్చిన అభివృద్ధిని, సంక్షేమాన్ని చూడాలి. కేసీఆర్ చేతుల్లోనే తెలంగాణ సురక్షితంగా ఉంటుందన్న విషయాన్ని గమనించాలి. రాష్ట్రం రాక ముందు మనలను అరిగోస పెట్టిన కాంగ్రెస్కు మరోసారి అవకాశమిస్తే రాష్ట్రం అధోగతి పాలవుతుంది. మన భవిష్యత్ అంధకారమవుతుంది. అనవసరంగా నెత్తిన కుంపటి పెట్టుకోవద్దు. మన కోసం, మన బిడ్డల కోసం తెలంగాణ ప్రభుత్వాన్ని కాపాడుకుందాం. విజ్ఞతతో ఆలోచిద్దాం. బోగస్ ప్రచారాలను తిప్పికొడుదాం. అన్ని వర్గాల సంక్షేమం కోసం పాటుపడుతున్న కేసీఆర్ను మరోసారి సీఎం చేద్దాం. పెద్దపల్లిలో బీఆర్ఎస్ను గెలిపించి ఆయనకు గిఫ్ట్గా ఇద్దాం.