పెద్దపల్లి, అక్టోబర్25 (నమస్తే తెలంగాణ): పొరపాటున కాంగ్రెస్కు ఓటేస్తే తెలంగాణలో కరెంట్ కట కట తప్పదని రాష్ట్ర పురుపాలక, ఐటీ శాఖ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హెచ్చరించారు. 3 గంటల కరెంట్ ఇచ్చే కాం గ్రెస్ పార్టీ కావాలా? 24 గంటల కరెంట్ ఇచ్చే బీఆర్ఎస్ కావాలో? తేల్చుకోవాలని ప్రజలకు పిలుపునిచ్చారు. కాళేశ్వరం ద్వారా ఎస్సారెస్పీకి పునర్జీవం పొసి, ఉమ్మడి కరీంనగర్ జిల్లా తాగు, సాగు నీటి సమస్య తీర్చిన ఘనత సీఎం కేసీఆర్కే దక్కుతుందని కొనియాడారు. కుల వృత్తులకు ప్రోత్సాహించి వారి ఆర్ధికాభివృద్దికి కృషి చేసింది బీఆర్ఎస్ సర్కారు అని గుర్తు చేశారు. రాష్ట్రంలో జీవ సంపద పెంపునపై సీఎం కేసీఆర్ ప్రత్యేక దృష్టిపెట్టారని తెలిపారు.
బుధవారం హైదరాబాద్ తెలంగాణ భవన్ లో ఎమ్మెల్యే దాసరి మనోహర్రెడ్డి ఆధ్వర్యంలో పెద్దపల్లి నియోజకవర్గానికి చెందిన సీనియర్ కాంగ్రెస్ నాయకులు, పెద్దపల్లి మాజీ ఎంపీపీలు సత్యనారాయణరెడ్డి, వేముల రామ్మూర్తి, ఉమ్మడి కరీంనగర్ జడ్పీ మాజీ కో -ఆప్షన్ సభ్యుడు హజీ, కాంగ్రెస్ పెద్దపల్లి పట్టణ మాజీ అధ్యక్షుడు రఫీ ఉల్లాఖాన్తో పాటు పలువురు బీఆర్ఎస్లో చేరారు. వీరికి మరో మంత్రి శ్రీనివాస్గౌడ్తో మంత్రి కేటీఆర్ గులాబీ కండు వా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అంతకుముం దు హైదరాబాద్కు వెళ్లే వాహన కాన్వాయ్ని పెద్దపల్లి ప్రభుత్వ జూనియర్ కళాశాల వద్ద ఎమ్మెల్యే దాసరి మనోహర్రెడ్డి జెండా ఊపి ప్రారంభించారు.
ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ కర్ణాటకలో ఒక చాన్స్ ఇవ్వండని ప్రాధేయపడితే అక్కడి ప్రజలు నమ్మి ఓటేశారని, ఇప్పుడు రోడ్లపైకి వచ్చే దుస్థితి నెలకొందన్నారు. ఉమ్మడి ఏపీ లో కాంగ్రెస్కు 11 సార్లు అధికారమిస్తే తెలంగాణ ప్రజలకు చేసిందేమీలేదని మండిపడ్డారు. కొత్త సీసాలో పాత సారా అన్నట్లు కాంగ్రెస్ నేతలు మా రి బహురూపుల వేషాలతో ఒక్క చాన్స్ అంటూ రావడం విడ్డూ రంగా ఉన్నదన్నారు. ప్రజలు త స్మాత్ జాగ్రత్త అని అన్నారు. 2014కు మందున్న పరిస్థితులు, స్వరాష్ట్రంలో తొమ్మిదిన్నర ఏండ్లలో జరిగిన అభివృద్ధిని బేరీజు వేసుకోవాలని సూచించారు. కేసీఆర్ భరోసా పేరిట బీఆర్ఎస్ మ్యానిఫెస్టోను రూపొందించామని, అందులోని 15 పథకాలను మళ్లీ అధికారంలోకి రాగానే అమలు చేస్తామని స్పష్టం చేశారు. రైతుబంధును రూ.16వేలకు పెంచుతూ నిర్ణయం తీసుకున్నారని, ఆసరా పింఛన్లను రూ. 5 వేలకు, దివ్యాంగులకు రూ. 6 వేలకు పెంచుతామని, గ్యాస్ సిలిండర్ రూ. 400కే అందిస్తామని హామీ ఇచ్చారు. ఉమ్మడి రాష్ట్రంలో మేజర్ పంచాయతీగా ఉన్న పెద్దపల్లిని జిల్లా చేసిన ఘనత బీఆర్ఎస్ సర్కారుకే దక్కిందన్నారు. ఇందుకు కృషి చేసిన దాసరి మనోహర్రెడ్డిని అఖండ మెజార్టీతో గెలిపించి మూడోసారి అసెంబ్లీకి పంపించాలని ప్రజలను కోరారు. బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు సమన్వయంతో ముందుకెళ్లి దాసరిని గెలిపించాలని విజ్ఞప్తిచేశారు.
ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన సీఎస్ఆర్, రామ్మూర్తి తిరిగి సొంతగూటికి చేరడం చా లా సంతోషంగా ఉన్నదని పెద్దపల్లి ఎమ్మెల్యే, బీఆర్ఎస్ అభ్యర్థి దాసరి మనోహర్రెడ్డి అన్నారు. సీఎం కేసీఆర్తోనే సంక్షేమం, అభివృద్ధి సాధ్యమవుతుందని, తప్ప ఇతర పార్టీలతో సాధ్యం కాదని నమ్మి తిరిగి బీఆర్ఎస్ లో చేరుతున్నా రన్నారు. రాబోయే కాలంలో పార్టీలో సముచిత స్థానం ఉం టుందని, ఉద్యమ సమయంలో జెండా మోసిన ప్రతి ఒకరిని గౌరవంగా చూసుకుంటామన్నారు సీఎస్ఆర్ పెద్దపల్లి లో మూడోసారి దాసరి మనోహర్ రెడ్డి హ్యాట్రిక్ విజయం సాధిస్తారన్నారని ధీమా వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ విజయం కోసం కలిసికట్టుగా పని చేస్తామన్నారు. కాంగ్రెస్ ఆరు గ్యారెంటీలను ప్రజలు నమ్మే పరిస్థితి లేరన్నారు. నియోజకవర్గంలో కాంగ్రెస్ను బొంద పెట్టేందుకు కలిసి కట్టుగా పని చేస్తామన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర సివిల్ సైప్లెస్ కార్పొరేషన్ చైర్మన్ సర్ధార్ ర వీందర్సింగ్, రాష్ట్ర టూరిజం కార్పొరేషన్ చైర్మన్ గెల్లు శ్రీనివాస్యాదవ్, జూలపల్లి జడ్పీటీసీ బొ ద్దుల లక్ష్మణ్, నాయకులు రాజేందర్రెడ్డి ఉన్నారు.
కొంతకాలంగా పార్టీకి దూరంగా ఉన్న ఉద్యమ దళం గులాబీ దండులో చేరడంతో పెద్దపల్లి బీఆర్ఎస్లో జోష్ కనిపిస్తున్నది. ఉద్యమ కాలంలో ఉమ్మడి జిల్లా అధ్యక్షుడిగా, టీఆర్ఎస్ (బీఆర్ఎస్) వ్యవస్థాపక సభ్యుడిగా పనిచేసిన సీ సత్యనారాయణరెడ్డి, మాజీ ఎంపీపీ వేములరామ్మూర్తి గులాబీ గూటికి చేరడంతో పార్టీ మరింత బలోపేతమైందని రాజకీయవిశ్లేషకులు భావిస్తున్నారు.