Putta Madhukar | తెలంగాణలో సురాపానకంగా భావించే తెల్లకల్లు (White Toddy) ఆరోగ్యానికి దివ్య ఔషధంగా పని చేస్తుందని మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధుకర్ తెలిపారు. శనివారం ఉదయం మంథని నియోజకవర్గంలోని మహాముత్తారం మండలం సింగారం గ్రామంలోని తాటివనంలో ఆయన స్థానికులతో కలిసి తాటికల్లు సేవించారు. ఈ సందర్బంగా మధుకర్ మాట్లాడుతూ.. ప్రకృతి సిద్దంగా లభించే తెల్లకల్లును ప్రతీ ఒక్కరు సేవించడం ద్వారా అనేక ప్రయోజనాలు ఉంటాయన్నారు.
తెల్లకల్లు అనేక వ్యాధులకు ఔషధంగా పనిచేస్తుందని డాక్టర్లు, శాస్త్రవేత్తలు సైతం చెబుతుంటారని ఆయన వివరించారు. ప్రతి రోజు గౌడలు ఉదయం, సాయంత్రం తాటి చెట్లు ఎక్కి తాటి కల్లు తీసి మన ఆరోగ్యం కోసం కష్టపడుతుంటారన్నారు. కులవృత్తులను ప్రోత్సహించాలన్నదే తన లక్ష్యమని, గతంలో ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో సైతం తెల్లకల్లు సేవించి కల్లు ప్రత్యేకతను చాటానని గుర్తు చేశారు. ఇవాళ మళ్లీ మంథని కేంద్రానికి 75 కిలో మీటర్ల దూరంలో ఉన్న సింగారం నుంచి వచ్చి ఇక్కడి నుంచి కల్లు విశిష్టతను చెప్పడం జరుగుతుందన్నారు.
ఇంగ్లీష్ మందులైన రమ్ము, బ్రాండీ, విస్కీ, బీర్లాంటివి సేవిస్తే ఆరోగ్యం చెడిపోతుందని, ఆ బాటిల్స్పైనే ఆరోగ్యానికి హానికరం అని రాసి ఉంటుందనే విషయాన్ని ప్రతి ఒక్కరు గుర్తించాలన్నారు. సింగారం గ్రామంలో ఆరువై పాల్లు ఉన్నాయంటే ఇక్కడ ఎక్కువ శాతం గౌడలు ఉంటారన్నారు.ప్రకృతి సిద్దంగా లభించే తెల్లకల్లును ప్రతి ఒక్కరు సేవించి సంపూర్ణ ఆరోగ్యం పొందాలని ఆయన పిలుపునిచ్చారు.
Maha Kumbh | 41 రోజులు.. 60 కోట్ల మంది పుణ్యస్నానాలు.. చివరి దశకు మహాకుంభమేళా
Crime news | బస్ కండక్టర్పై అమానుషం.. మరాఠీ మాట్లడలేదని మూకుమ్మడి దాడి