Jagityal SP Shri Ashok Kumar | జగిత్యాల క్రైమ్ : అన్ని శాఖల అధికారుల సమన్వయంతో ఆపరేషన్ ముస్కాన్ జగిత్యాల జిల్లాలో విజయవంతంగా నిర్వహించామని ఎస్పీ అశోక్ కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. బాలకార్మిక వ్యవస్థను నిర్మూలించడానికి సంవత్సరంలో రెండు సార్లు ఆపరేషన్ స్మైల్, ఆపరేషన్ ముస్కాన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని, దీనిలో భాగంగా తప్పిపోయిన బాలలను గుర్తించి వారి తల్లిదండ్రుల వద్దకు చేర్చామన్నారు. ఆపరేషన్ ముస్కాన్ విజయవంతం కోసం ఒక్కో సబ్ డివిజన్ పరిధిలో ఒక సబ్- ఇన్స్ పెక్టర్, ముగ్గురు కానిస్టేబుల్స్, ఒక మహిళ కానిస్టేబుల్ ను ప్రత్యేకంగా కేటాయించి చైల్డ్ లైన్ తో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి ప్రభుత్వేతర స్వచ్చంద సంస్థలను గుర్తించి జులై 1 నుండి 31 వరకు విస్తృతంగా తనిఖీలు నిర్వహించి 36 మంది బాలకార్మికులను గుర్తించి CWC (చైల్డ్ వెల్ఫేర్ కమిటీ) ముందు హాజరు పరిచయమని తెలిపారు.
బాలల హక్కులను కాపాడాల్సిన బాధ్యత మానందరిపైనా ఉన్నదని, బాల కార్మిక వ్యవస్థ నిర్ములన కోసం బాధ్యతాయుతంగా కృషి చేయాలని, బాలల హక్కులను, బాలకార్మిక వ్యవస్థను నిర్మూలించడానికి ఆపరేషన్ స్మైల్, ముస్కాన్ కార్యక్రమాలను నిరంతరం నిర్వహించనున్నట్లు తెలిపారు. ఎవరైనా బాలలను పనిలో పెట్టుకున్న, ఎక్కడైనా పనిచేసిన, తప్పిపోయిన వదిలివేయబడిన బాలల సమాచారం తెలిసిన వెంటనే డయల్ 100 కి కాల్ చేసి పోలీసు వారికి సమాచారం ఇవ్వగలరని తెలిపారు. బాలకార్మికులుగా పెట్టుకున్న వారిపై కూడా చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు.