గోదావరిఖని, నవంబర్ 14: విద్యార్థుల్లో ఉన్న కళను, ప్రతిభను వెలికితీసేందుకు తెలంగాణ బాలోత్సవ్ వేదికలు ఎంతో ఉపయోగ పడుతాయని రాష్ట్ర మంత్రి కొప్పుల ఈశ్వర్ పేర్కొన్నారు. బాలల దినోత్సవం సందర్భంగా ఆదివారం గోదావరిఖని మార్కండేయ కాలనీలో తెలంగాణ బాలోత్సవం-2021 కార్యక్రమంలో మంత్రి కొప్పుల ఈశ్వర్, ఎమ్మెల్యే కోరుకంటి చందర్ పాల్గొన్నారు. తెలంగాణ బాలోత్సవంలో ప్రతిభ చూపిన విద్యార్థులకు జ్ఞాపికలను అందజేశారు. మంత్రి మాట్లాడుతూ విద్యార్థులు ఉన్నత లక్ష్యాలను ఎంచుకొని సాధన చేస్తే విజయం సొంతమవుతుందన్నారు. ఇలాంటి బృహత్తరమైన కార్యక్రమాలు చేపట్టడం ఎమ్మెల్యే చందర్కే సాధ్యమవుతుందన్నారు. కార్యక్రమంలో నగర మేయర్ డా.అనిల్కుమార్, టీబీజీకేఎస్ అధ్యక్షులు వెంకట్రావు, మిర్యాలరాజిరెడ్డి, కెంగర్ల మల్లయ్య, కార్పొరేటర్లు, టీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.
ముగిసిన కబడ్డీ పోటీలు
గోదావరిఖని జేఎల్ఎం స్టేడియంలో నిర్వహించిన ఉమ్మడి జిల్లా మెగా కబడ్డీ పోటీల ముగింపునకు ఎమ్మెల్యే కోరుకంటితో కలిసి మంత్రి కొప్పుల హాజరయ్యారు. విజేతలకు బహుమతులను అందజేశారు. ఈ కార్యక్రమంలో మేయర్ అనిల్కుమార్, కార్పొరేటర్ దాతు శ్రీనివాస్, పెంట రాజేశ్, రాజ్కుమార్, సాగంటి శంకర్ పాల్గొన్నారు.