పెద్దపల్లి రూరల్, ఏప్రిల్ 10: దివ్యాంగులకు అండగా నిలిచేందుకే బ్యాటరీ ట్రైసైకిళ్లు, సహాయ పరికరాల పంపిణీకి శ్రీకారం చుట్టామని రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ పేర్కొన్నారు. సీఎం కేసీఆర్ ముందుచూపుతో అమలు చేస్తున్న పథకాలతో సబ్బండ వర్గాలకు సంక్షేమ ఫలాలు అందుతున్నాయని ఉద్ఘాటించారు. అర్హులందరికీ అందించేందుకు చర్యలు తీసుకుంటామని చెప్పారు. పెద్దపల్లి వ్యవసాయ మార్కెట్ ఆవరణలో శనివారం 112మంది దివ్యాంగులకు బ్యాటరీతో నడిచే ట్రైసైకిళ్లు, 132మందికి ఇతర సహాయయంత్ర పరికరాలను పంపిణీ చేశారు.
అంతకు ముందు పెద్దపల్లి జిల్లా దవాఖాన వద్ద ఎంపీ ల్యాడ్స్ నిధులు రూ.24 లక్షలతో కొనుగోలు చేసిన అంబులెన్స్ను ఎంపీ బోర్లకుంట వెంకటేశ్ నేతకానితో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయా చోట్ల మంత్రి మాట్లాడారు. గత పాలకులు ప్రజాసంక్షేమాన్ని గాలికొదిలేశారని విమర్శించారు. ఇందుకు భిన్నంగా తెలంగాణ ప్రభుత్వం అణగారిన వర్గాల అభ్యున్నతికి విశేష కృషి చేస్తున్నదని చెప్పారు. గతంలో జగిత్యాల జిల్లాలో బ్యాటరీతో తయారు చేసిన ట్రైసైకిళ్లను ఇచ్చామని, అదే తరహాలో పెద్దపల్లి జిల్లాలోనూ ఇవ్వాలని నిర్ణయించినట్లు తెలిపారు. ఇంతకు ముందు క్యాంపులు నిర్వహించి అలీం కో ద్వారా ఎంపికైన వారికి సహాయ యంత్ర పరికరాలను అందించామ ని, జిల్లాలో ఇంకా అర్హులు ఉంటే అందజేస్తామని, దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.
జడ్పీ చైర్మన్ పుట్ట మధూకర్ మాట్లాడుతూ, తెలంగాణ వస్తే ఏం వచ్చిందని, ప్రభుత్వం ఏం చేస్తున్నదని కొందరు సోషల్ మీడియా లో పిచ్చికూతలు కూస్తున్నారని, దివ్యాంగు లకు పంపిణీ చేసిన బ్యాటరీ ట్రైసైకిళ్లే వారికి సమాధానమని పేర్కొన్నారు. గడప గడపకూ పథకాలు అందజేస్తున్న ఘనత ముఖ్యమం త్రి కేసీఆర్కే దక్కిందన్నారు. ఎంపీ వెంకటేశ్నేతకాని ఎంపీ ల్యాడ్స్ నిధులతో అంబులెన్స్ను అందించడం అభినందనీయమన్నారు. ఎంపీ వెంకటేశ్ నేతకాని మాట్లాడుతూ, కేసీఆర్ ప్రభుత్వం ఆసరా, కల్యాణలక్ష్మి, షాదీముబారక్, రైతుబంధు, రైతు బీమా పథకాలను అమలు చేసి పేదల గుండెల్లో గూడు కట్టుకున్నదన్నారు. ఇన్ని మంచి కార్యక్రమా లు అమలు చేస్తున్న సర్కారుకు అండగా నిలువాలని ప్రజలను కోరారు.
ప్రజా సేవలో తరిస్తున్న టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులకు బాసటగా నిలువాలని పిలుపునిచ్చారు. ఎమ్మెల్యే దాసరి మనోహర్రెడ్డి మాట్లాడుతూ, దివ్యాంగులకు అండగా ఉండేందుకే రూ.1.50కోట్లతో 240 మందికి సహాయ యంత్ర పరికరాలను అందజేశామని తెలిపారు. అర్హులందరికీ పంపిణీ చేస్తామని పేర్కొన్నారు. కార్యక్రమంలో కలెక్టర్ డాక్టర్ సంగీత సత్యనారాయణ, అదనపు కలెక్టర్ వీ లక్ష్మీనారాయణ, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రఘువీర్ సింగ్, డీసీఎమ్మెఎస్ చైర్మన్ ఎల్లాల శ్రీకాంత్ రెడ్డి, ఎంపీపీలు బండారి స్రవంతి, తానిపర్తి స్రవంతి, కూనారపు రేణుకాదేవి, జడ్పీటీసీలు కందుల సంధ్యారాణి, బొద్దుల లక్ష్మణ్, వంగళ తిరుపతిరెడ్డి, జిల్లా సంక్షేమ శాఖ అధికారి లక్ష్మీరాజం పాల్గొన్నారు.