పెద్దపల్లి జిల్లా: పెద్దపల్లి జిల్లాలో భారత రాష్ట్రీయ సమితి (బీఆర్ఎస్) కి ఆదరణ లభిస్తున్నది. జిల్లాలో తొలిసారిగా కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్లో పలువురు నేతలు మారారు. వీరికి పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్రెడ్డి కండువాలు కప్పి సాదరంగా స్వాగతం చెప్పారు. పెద్దపల్లి మండలం నిట్టూరు గ్రాపంచాయతీ వార్డు సభ్యుడు కుంబాల నిరంజన్ అతడి అనుచరులతో కలిసి బీఆర్ఎస్ పార్టీలో చేరారు. క్యాంపు కార్యాలయంలో ఆదివారం ఉదయం జరిగిన ఒక కార్యక్రమంలో కాంగ్రెస్ నేతలను బీఆర్ఎస్లోకి ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి ఆహ్వానించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మనోహర్రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణలో సీఎం కే చంద్రశేఖర్ రావు ఆధ్వర్యంలో టీఆర్ఎస్ ప్రభుత్వం చేపడుతున్న ప్రజాసంక్షేమ కార్యక్రమాలను అన్ని వర్గాల ప్రజలు ఆదరిస్తున్నారని చెప్పారు. పేదల సంక్షేమమే పరమావధిగా తమ ప్రభుత్వం పనిచేస్తున్నదని తెలిపారు.