పెద్దపల్లి : టీఆర్ఎస్లోకి వలసల పర్వం కొనసాగుతూనే ఉంది. అభివృద్ది, సంక్షేమ కార్యక్రమాలకు ఆకర్షితులై వివిధ పార్టీల నుంచి టీఆర్ఎస్లో స్వచ్ఛందంగా చేరుతున్నారు. తాజాగా మంథని మండలం ధర్మారం గ్రామంలో మాజీ సర్పంచ్, సీనియర్ కాంగ్రెస్ నాయకుడు అంబీరు బాపు, సరోజన టీఆర్ఎస్ పార్టీలో చేరారు.
వారికి జెడ్పీ చైర్మన్ పుట్ట మధుకర్ గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
ఈ సంర్భంగా మధుకర్ మాట్లాడుతూ..టీఆర్ఎస్ పార్టీలో ప్రతి ఒక్కరికి గుర్తింపు ఉంటుందన్నారు.
పార్టీలో చేరిన ప్రతి ఒక్కరికి సరైన గౌరవం లభిస్తుందన్నారు. ప్రతి కార్యకర్త ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని ఆయన పిలుపునిచ్చారు. కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, తదితరులు ఉన్నారు.