పెద్దపల్లి: పెద్దపల్లి జిల్లా రామగుండంలో యూరియా ఫ్యాక్టరీ ఉన్నప్పటికీ కాంగ్రెస్ అనాలోచిత చర్య మూలంగా పండుగ పూట రైతులు కష్టాలు పడుతున్నారని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు వాళ్ళ హరీశ్ రెడ్డి (Harish Reddy) అన్నారు. మంగళవారం పాలకుర్తి మండలం ఈసాల తక్కల్లపల్లిలో యూరియా కోసం అవస్థలు పడుతున్న రైతులతో ఆయన మాట్లాడారు. వాస్తవానికి యూరియా రామగుండలోనే తయారవుతుంది. దీపం కింద చీకటి లాగా ఇక్కడే యూరియాకు రైతులు తిప్పలు పడుతూండ్రు. ప్రభుత్వం, స్థానిక ఎమ్మెల్యే, రైతులను అస్సలు పట్టించుకోవడం లేదు. నేటికి రామగుండం ఎరువుల కర్మాగారం షట్ డౌన్ అయ్యి నెల రోజులపైనే అయింది. ఇప్పటికీ దాని మరమ్మతులు చేసి ప్రారంభించలేదని చెప్పారు.